|
ఎన్కౌంటర్పై విచారణ జరగాలి
చంద్రబాబుకు పన్నీర్ సెల్వం లేఖ
చెన్నై, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): శేషాచలం అడవుల్లో 20 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల ఎన్కౌంటర్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్పై విచారణ జరిపి దోషులపై చర్యలు చేపట్టాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. 20 మంది కూలీలు మృతి చెందారన్న సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని లేఖలో పన్నీర్సెల్వం వ్యాఖ్యానించారు.
|
No comments:
Post a Comment