పోలీసులే న్యాయ నిర్నేతలా...అసదుద్దీన్
వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఎన్ కౌంటర్ పై సీబీఐతో విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. పోలీసులే న్యాయమూర్తిలా వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. విచారణ ఖైదీలపై కాల్పులు ఏవిధంగా జరుపుతారని అసదుద్దీన్ అన్నారు. అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని అసదుద్దీన్ కోరారు. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వమే పథకం ప్రకారం వికారుద్దీన్ గ్యాంగ్ ని హతమార్చిందని ఆయన దుయ్యబట్టారు.
No comments:
Post a Comment