హైదరాబాద్, ఏప్రిల్ 9 : ఆలేరులో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గురువారం అసదుద్దీన్ నేతృత్వంలో ముస్లిం నేతలు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఎన్కౌంటర్పై విచారణ జరపాలని నేతలు కోరారు. అనంతరం అసద్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులకు చేతులకు సంకెళ్లు ఉండగా పోలీసుల నుంచి రైఫిళ్లు ఎలా లాక్కుంటారని ప్రశ్నించిన ఆయన ఇలాంటివి రిజినీకాంత్ సినిమాలో మాత్రమే సాధ్యమని తెలిపారు.
హైకోర్టు జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్తో ముస్లింలు భయాందోళనలో ఉన్నారన్నారు. ఈ విషయంలో న్యాయం చేస్తామని సీఎం చెప్పినట్లు అసద్ వెల్లడించారు. అలాగే సూర్యాపేట ఘటనను కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment