Battula Tirumalarao
"ఈ దేశంలో నూటికి ఎనబై మంది పేద ప్రజలున్నారు. కాని ఈ దేశం వీరిది కాదు. ఈ ప్రభుత్వం వాళ్ళదికాదు. ఈ రాజ్యాంగం వాళపాలిట ఉరితాడు. ఈ దేశంలో చట్టాలు వాళ్ళను అణిచి ఉంచడానికే కానీ మరెందుకూ ఉపయోగపడవు. ఈ వ్యవస్థలో వాళ్ళకు అన్యాయం తప్ప న్యాయం జరగదు. కోర్టులు-పోలీసులు-జైళ్ళూ ఈ పేదవారి నోళ్ళు నొక్కేసి, బలవంతంగా వారి కళ్ళు మూసేసి, వారి కష్టార్జితాన్ని దనవంతుల బొక్కసాల్లోకి చేర్చడానికి వాహకాలుగా పనిచేస్తుంటాయి.
తన కష్టానికి తగిన ప్రతిఫలం అడిగినా, న్యాయంగా తనకు రావాల్సిన దాన్ని డిమాండ్ చేసినా, అన్యాయాన్ని ప్రశ్నించినా, వేలెత్తి చూపినా ఈ దేశంలో పేదవాళ్ళు తీవ్రవాదులుగా, అరాచక సంఘవ్యతిరేక శక్తులుగా ముద్రవేయబడి ప్రభుత్వంచేత, దాని సాయుధ ముకలచేత వేటాడబడ్తారు. వధించబడతారు. మరో ప్రక్కన హర్సద్ మెహతాల్లాంటి వాళ్ళు వేలకోట్లు స్వాహ చేసినా, శ్రమను నల్లదనంగా మర్చి ఇతరదేశ ఖాజనలలో దాచినా, ఆర్దిక మంత్రులు దేశాన్ని తాకట్టుపెట్టేసినా, ప్రధాన మంత్రులు, ముఖ్యమత్రులు దేశాన్ని, రాష్ట్రాలను సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టినా, ప్రజల ప్రాధమిక హక్కులైన విద్యా, వైద్యం, వ్యాపారంగా మార్చి కార్పోరేట్లకు అప్పజెప్పినా, ప్రజలకు చెందవలసిన నిత్యావసరాల దగ్గరనుండి, ప్రాజెక్టులు కట్టే సిమెంట్ వరకు కుంబకోణాలు చేసినా, కుటుంబపాలన చేస్తూ కొడుకులు, అళ్ళుళూ, కూతుళ్ళూ, దేశాన్ని రాష్ట్రాన్ని పంచుకున్నా ఈ దేశ పోలీసులూ, సైన్యాలూ, దాని రాజ్యాంగ చట్టాలు ఏమీ చేయలేవు. ఏమీ చేయవు. ఎందుకంటే ఈ చట్టాలూ, ప్రభుత్వం, రాజ్యాంగం దనవంతులదీ అవినీతిపరులది కనుక."
తన కష్టానికి తగిన ప్రతిఫలం అడిగినా, న్యాయంగా తనకు రావాల్సిన దాన్ని డిమాండ్ చేసినా, అన్యాయాన్ని ప్రశ్నించినా, వేలెత్తి చూపినా ఈ దేశంలో పేదవాళ్ళు తీవ్రవాదులుగా, అరాచక సంఘవ్యతిరేక శక్తులుగా ముద్రవేయబడి ప్రభుత్వంచేత, దాని సాయుధ ముకలచేత వేటాడబడ్తారు. వధించబడతారు. మరో ప్రక్కన హర్సద్ మెహతాల్లాంటి వాళ్ళు వేలకోట్లు స్వాహ చేసినా, శ్రమను నల్లదనంగా మర్చి ఇతరదేశ ఖాజనలలో దాచినా, ఆర్దిక మంత్రులు దేశాన్ని తాకట్టుపెట్టేసినా, ప్రధాన మంత్రులు, ముఖ్యమత్రులు దేశాన్ని, రాష్ట్రాలను సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టినా, ప్రజల ప్రాధమిక హక్కులైన విద్యా, వైద్యం, వ్యాపారంగా మార్చి కార్పోరేట్లకు అప్పజెప్పినా, ప్రజలకు చెందవలసిన నిత్యావసరాల దగ్గరనుండి, ప్రాజెక్టులు కట్టే సిమెంట్ వరకు కుంబకోణాలు చేసినా, కుటుంబపాలన చేస్తూ కొడుకులు, అళ్ళుళూ, కూతుళ్ళూ, దేశాన్ని రాష్ట్రాన్ని పంచుకున్నా ఈ దేశ పోలీసులూ, సైన్యాలూ, దాని రాజ్యాంగ చట్టాలు ఏమీ చేయలేవు. ఏమీ చేయవు. ఎందుకంటే ఈ చట్టాలూ, ప్రభుత్వం, రాజ్యాంగం దనవంతులదీ అవినీతిపరులది కనుక."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇటువంటి అభిప్రాయం ప్రజలలో పెరుగకుండా, రాజ్యాంగ వ్యవస్థ అందరిది అన్నట్లు అభివృద్ధి చెందాలి అని కోరుకోనుచున్నాము అందుకు మేము నిత్యం ప్రయత్నం చేస్తున్నాము.
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment