దేవీ నవరాత్రులు సందర్భముగా దసరా లలో అమ్మ వారికి ప్రతి రోజు ఏ ఏ నైవేద్యములు పెడతారు ?
1. ప్రథమ శైలపుత్రి దేవి: మొదటి రోజు అమ్మవారు ప్రథమ శైలపుత్రిగా అంటే శ్రీబాలా త్రిపురసుందరి దేవిగా అలంకారముగా అవతరిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మ దుర్గాదేవికి సమర్పించుకొనే నైవేద్యం కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు.
2. బ్రహ్మ చారిణి దేవి: రెండవ రోజు అమ్మవారిని ఉమ లేదా బ్రహ్మ చారిణి అనగా శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. తరువాత నైవేద్యం రూపంలో పులిహోర మరియు నిమ్మకాయ పులిహోర భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు
. 3. చంద్రఘంటా దేవి: మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటా అనగా గాయత్రీ శ్రీదేవి రూపంముగా అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం మరియు కొబ్బరి పాయసం సమర్పించుకుంటారు
. 4. కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి: ఈ ఉత్సవాలలో నాలుగువ రోజు అమ్మవారిని కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి రూపంముగా అలంకరిస్తారు. సింహాం మీద కూర్చొని, ఎడురకాల ఆయుధాలను ఆమె ఎనిమిది చేతుల్లో ఉన్నట్లు అవతరిస్తుంది. ఆ రోజు నైవేద్యంగా మినప గారెలు లేదా మొక్కజొన్న గారెలు లేదా మసాలా మినప గారెలు మరియు పెసర గారెలు భక్తిశ్రద్ధలతో పెడతారు.
5. స్కంధమాత: ఐదవ రోజు దుర్గాదేవిని స్కంధమాత సరస్వతి దేవిగా అలంకరిస్తారు. ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నంను సమర్పించుకుంటారు.
6. కాత్యాయనీ మాత: ఆరవ రోజు దుర్గా దేవిని కాత్యాయనీ శ్రీలలితాదేవి రూపముగా అలంకరిస్తారు ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని ప్రసాదంగా పెడుతారు.
7.కాళరాత్రి మాత: ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి శ్రీ దుర్గాదేవి రూపముగా అలంకరణ చేస్తారు కనకదుర్గ దేవికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు ను ప్రసాదంగా పెడుతారు.
8. మహాగౌరీ మాత: ఎనిమిదవ రోజు అమ్మవారిని మహాగౌరి శ్రీ మహిషాసుర మర్దనీ దేవిగా అలంకరణ చేస్తారు నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి మరియు చక్కర పొంగల్ ని పెడుతారు.
9. సిద్ధిరాత్రి మాత: తొమ్మిదవ రోజు దుర్గాదేవిని సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు ఆరోజు నైవేద్యంగా సేమ్య పాయసం లేదా క్యారెట్ పాయసం లేదా కొబ్బరి గసగసాల పాయసం లేదా అన్నం పరవాన్నం లేదా పెసరపప్పు పాయసం లేదా కొబ్బరి పాల పాయసంను భక్తులు ప్రసాదంగా పెడుతారు.
No comments:
Post a Comment