హైదరాబాద్ బ్యూరో : కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం గత నాలుగు రోజులుగా చేస్తున్న అమరననిరాహాకదీక్ష నేటితో ముగియనున్నది. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. తూర్పు గోదావరిజిల్లా కు చెందిన తోట త్రిమూర్తులు,బొడ్డు భాస్కరరావు మధ్యవర్తుల మధ్య సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుండి తెలుగుదేశంపార్టీ అంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు, అచ్చంనాయుడులు రాయబారులుగా వచ్చిన ముద్రగడ ముందు మూడు ప్రతిపాదనలను ఉంచారు. కాపు రిజర్వేషన్ నిర్ధారణ కమిటీ లో ఒక సభ్యుడిని ముద్రగడ అనుమతితో నియమించడం, ముంజానాధన్ కమిటికి నిర్థిష్ట కాలపరిమితిని నిర్ణయించడం, కాపు కార్పోరేషన్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి రుణం అందిస్తామని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడంతో ముద్రగడ కీలకమైన
నిర్ణయం తీసుకొనున్నారు.
నిర్ణయం తీసుకొనున్నారు.
No comments:
Post a Comment