విజ్ఞాపన : ముద్రగడగారి దీక్షపై మీడియాలో అరుపులు, వ్యంగ భాష్యాలు, ఇక్కడ సాంఘిక మాధ్యమాలలో పోస్టులు గమనిస్తున్నాను. నేను చెప్పేది అటూ ఇటూ ఉద్వేగాలు ఉన్నప్పుడు నచ్చకపోవచ్చు. యదార్ధవాది ప్రధమార్ధః లోకవిరోది. నిజమే.
-
ఇప్పుడు సమాజానికి కావలసింది దీక్ష విరమణ వార్తలపై ముద్రగడ గారిని హేళన చేసే వారు, కొద్దిమంది కాపు నాయకులని దూషించేవారు లేదా ప్రభుత్వం/తెదేపా, ప్రతిపక్షాలైన వైకాప, వామపక్షాలపై వెకిలిగా వ్యాఖ్యానించేవారు కాదు. తిట్టడం, రెచ్చగొట్టడం, చిచ్చుపెట్టడానికి ధైర్యవంతులు అవసరం లేదు. పరిస్థితులు విషమంగా ఉన్నప్పుడు మాటపడినా, నిగ్రహంగా ఉండి పరిష్కరించడానికి గుండె ధైర్యం కావాలి. ఇక ఇప్పుడు మనం అత్యవసరంగా కేంద్ర బడ్జెట్ విషయంలో రాష్ట్రం ఒక్కటై దానికిముందే మనం హోదా మరియు పాకేజీ మొదలగునవి అన్నీ సాధించుకోవడంపై వత్తిడి తేవాలి. అదే సమయంలో ఈ కాపు రిజర్వేషన్ల విషయంలో చేతనైతే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తమవంతు సలహా ఇవ్వడం అవసరం. సలహాలు ఇక్కడే ఇవ్వనక్కరలేదు. పరిచయం ఉన్న కాపు నాయకులు, సంఘాలకు, లేదా ప్రభుత్వాలలో ఆయా మంత్రులకి, సంభందితులకు అంతరంగికంగా కూడా చెప్పవచ్చు. ఎలా సాధ్యమో- ఎంతవరకో, అదీ ఇతరులకి నష్టం కలగకుండా ఎలాగో చెప్పాలి. నేను అదే పని చేస్తున్నాను. ద్వేషాగ్నిలో చలిమంట ఆస్వాదించేవారు అవసరం లేదు. ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంచండి. అవసరమైతే విజ్ఞానదాయకమైన చర్చలు చేయండి. కులాభిమానం, మతాభిమానం, భాషాభిమానం, ప్రాంతాభిమానం తప్పుకాదు. చూపించండి. ఫర్వాలేదు. కాని ఇతరులపై దురభిమానం తప్పు. సరికాదు. అది దాటిపోయిు ఇతరులపై విద్వేషాన్ని, హింసావాదాన్ని వెళ్ళగక్కే మనస్తత్వం ఉన్నవారిని దూరంగా ఉంచండి. ఆ వాదాన్ని ఎట్టిపరిస్థితులలోనూ సమర్ధించకండి. నమస్కారం. - చలసాని
-
ఇప్పుడు సమాజానికి కావలసింది దీక్ష విరమణ వార్తలపై ముద్రగడ గారిని హేళన చేసే వారు, కొద్దిమంది కాపు నాయకులని దూషించేవారు లేదా ప్రభుత్వం/తెదేపా, ప్రతిపక్షాలైన వైకాప, వామపక్షాలపై వెకిలిగా వ్యాఖ్యానించేవారు కాదు. తిట్టడం, రెచ్చగొట్టడం, చిచ్చుపెట్టడానికి ధైర్యవంతులు అవసరం లేదు. పరిస్థితులు విషమంగా ఉన్నప్పుడు మాటపడినా, నిగ్రహంగా ఉండి పరిష్కరించడానికి గుండె ధైర్యం కావాలి. ఇక ఇప్పుడు మనం అత్యవసరంగా కేంద్ర బడ్జెట్ విషయంలో రాష్ట్రం ఒక్కటై దానికిముందే మనం హోదా మరియు పాకేజీ మొదలగునవి అన్నీ సాధించుకోవడంపై వత్తిడి తేవాలి. అదే సమయంలో ఈ కాపు రిజర్వేషన్ల విషయంలో చేతనైతే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తమవంతు సలహా ఇవ్వడం అవసరం. సలహాలు ఇక్కడే ఇవ్వనక్కరలేదు. పరిచయం ఉన్న కాపు నాయకులు, సంఘాలకు, లేదా ప్రభుత్వాలలో ఆయా మంత్రులకి, సంభందితులకు అంతరంగికంగా కూడా చెప్పవచ్చు. ఎలా సాధ్యమో- ఎంతవరకో, అదీ ఇతరులకి నష్టం కలగకుండా ఎలాగో చెప్పాలి. నేను అదే పని చేస్తున్నాను. ద్వేషాగ్నిలో చలిమంట ఆస్వాదించేవారు అవసరం లేదు. ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంచండి. అవసరమైతే విజ్ఞానదాయకమైన చర్చలు చేయండి. కులాభిమానం, మతాభిమానం, భాషాభిమానం, ప్రాంతాభిమానం తప్పుకాదు. చూపించండి. ఫర్వాలేదు. కాని ఇతరులపై దురభిమానం తప్పు. సరికాదు. అది దాటిపోయిు ఇతరులపై విద్వేషాన్ని, హింసావాదాన్ని వెళ్ళగక్కే మనస్తత్వం ఉన్నవారిని దూరంగా ఉంచండి. ఆ వాదాన్ని ఎట్టిపరిస్థితులలోనూ సమర్ధించకండి. నమస్కారం. - చలసాని
(సమాజంలో అగ్రవర్ణాలలోకూడా పేదలు ఉన్నారు. అనేక సర్వేల ప్రకారం కాపులలో అత్యంత సంపన్నులు, ధనవంతులు, తరతరాల నాయకులు, జమీందార్లు ఉన్నా అత్యధికంగా పేదలు ఉన్న సంగతి వివరాలతో సహా జోగయ్య గారు చెప్పేవారు. అది వాస్తవం కూడా. వారికి అంటే ముఖ్యంగా కాపులలో మధ్యతరగతి, పేదలకు అన్యాయం జరగటానికి వీల్లేదు. అలాగే సమాజంలో ఎవ్వరికీ కూడా జరగకూడదు. ఈ సమయంలో ముద్రగడ గారి కొంత ఆవేశాపరుడే కాని నిజాయితీపరులు. వారి దీక్షపై నేను రెండు పోస్టులు పెట్టాను. ఇప్పుడు తుని గొడవ, ఎవరేం చేసారో ఎవరు రాజకీయాలకు వాడుకున్నారో అన్నీ ప్రజలు చూసారు. భావోద్వేగాలు తగ్గిన తరువాత మిగిలిన అందరూ అర్ధం చేసుకుంటారు ఇప్పుడు వారు దీక్ష విరమించినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్దిష్ట కాలపరిమితితో న్యాయం ఎలా చేస్తారో ప్రభుత్వం హామీ మేరకు చేయాలి. అఖిలపక్షం వేయాలి. ఏవి సాధ్యమవుతాయో ఆ రీతిలో అన్ని పక్షాలు వాస్తవాలని పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలి.)
No comments:
Post a Comment