సి.ఎం.ఓ. లో ఒకే కులం ఆధిపత్యం!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెనకేసుకొచ్చే విషయంలో మీడియా అధిపతులే కాకుండా, అందులో పనిచేసే విలేకరులు కూడా కీలకమైనపాత్రే పోషిస్తున్నారు. సి.ఎం.ఓ.లో వార్తలు కవర్ చేసే విలేకర్లలో ఎక్కువ మంది ఒకే సామాజికవర్గానికిచెందిన వారు ఉండటం,వారు ఏకతాటిపైన ఉండి,తమ నాయకుడు చంద్రబాబుపై ఈగవాలకుండా చేయడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. ముఖ్యమంత్రి జరిపే సమీక్షలు,కీలకనిర్ణయాలు ముందే వారికి తెలుస్తాయి. రోజువారీ ముఖ్యమంత్రి పర్యటనా వివరాలు తెలిసిపోతాయి. ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశం నిర్వహిస్తే విలేకర్లు ప్రశ్నలు వేయడం సహజం. ఎవరి విధానంలో వారు కావాల్సిన సమాధానం కోసం ప్రశ్నవేయడం,దానికి సి.ఎం. నుంచి సమాధానం రాబట్టుకొని సంబంధిత అంశాన్ని హైలెట్ చేసుకోవడం సహజం. కానీ ఎ.పి.సి.ఎం.ఓలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి అనుచరగణం, బలమైన సామాజిక వర్గం ఏకమై, విలేకర్లు ఎలాంటి ప్రశ్నలు వేయాలో, ఏమి వేయకూడదో కూడా నిర్దేశించే పరిస్థితులు సి.ఎం.ఒలో కొనసాగుతున్నాయి. బలమైన సామాజికవర్గం విలేకర్లు దందా హద్దుమీరుతోంది. అదేమంటేసంబంధిత విలేకర్లపై మేనేజ్మెంట్లకు ఫిర్యాదులు చేయించడం, వారిని సంబంధింత బీట్లనుంచి తొలగిస్తామని బెదించే పరిస్థితులు కూడా నెలకొన్నాయంటే సామాజికవర్గ ఆదిపత్యం ఏస్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
గతంలో చంద్రబాబు కూడా ఎవరైనా విలేకరి ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తే గదమాయించేవాడు, నీ పేరు ఏమిటి? ఏ సంస్థ? మీ ఓనర్తో మాట్లాడుతా…. అనేవాడు. ఇప్పుడు ఆయనకు ఆ ఇబ్బంది లేకుండా ఆయన చుట్టూతా ఉన్న ఆయన సామాజిక వర్గ విలేకరులే ఆయన పనిని చేస్తున్నారు.
కులాధిపత్యం ఎన్నాళ్లు!
సి.ఎం.ఓ.లో ఒకే సామాజికవర్గాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం పెంచిపోషిస్తోంది. దీనికి ఆయా యాజమాన్యాలు కూడా వంత పాడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే పాలనా పరమైన కేంద్రబిందువు. ఇక్కడ అనేక అంశాలకు తెరతీస్తారు. రాష్ట్ర భవిష్యత్ అంతా ఇక్కడే రూపుదిద్దుకుంటుంది. అనేక పైరవీలు,అరాచకాలకు కూడా నెలవుగా సి.ఎం.ఓ. ఉంటుంది. ఇలాంటి కేంద్రబిందువు నుంచి వార్తల సేకరణ అంటే కీలకమైన విషయమే. అందుకే ఎలాంటి విషయమైన లీక్ అయితే,మీడియాలో ప్రాధాన్యంతో ప్రచురితం అయితే ప్రభుత్వానికి లేనిపోని అపకీర్తి.అందుకే సంబంధిత బీట్చూసే వ్యక్తులు తమ సామాజిక వర్గానికి చెందిన వారిని సి.ఎం.ఒ. ఎంపిక చేసుకొని పోస్టింగ్స్ ఇప్పించుకునే పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇలా వచ్చిన వారు సి.ఎం.కి మీడియా సెక్యూరిటీగా నిలుస్తున్నారే తప్ప నిఖార్సయిన జర్నలిస్టుగా రాణించలేకపోతున్నారు.ఒకే సామాజిక వర్గానికిచెందిన వారు సి.ఎం.ఒ.లో ఆధిపత్యం చెలాయించడం వల్ల మైనార్టీగా ఉన్న కొన్ని మీడియాలకు చెందిన వారు ఈసురోమనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటర్వ్యూల్లోనూ పక్షపాతం!
ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలోన్లూ కులాలపరంగానే ప్రాధాన్యం ఇస్తున్నారు. నిత్యం వార్తల్లో ఉండే చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకొని కొన్ని అంశాలపై ప్రత్యేక ఇంటర్య్వూలు ఇస్తారు. అది కూడా ఎవరికి ఎంత సమయం, ఏరోజున ఇంటిర్వ్యూ ఇవ్వాలనే అంశాన్ని కూడా నిర్దారిస్తారు. ఇలా చేసే అనేక సందర్భాల్లో సామాజిక ప్రాధాన్యం స్పష్టంగా కన్పిస్తుంది. ఇలా చేయడం వల్ల కొన్ని మీడియాలు చంద్రబాబుకు పూర్తిగా దూరంగా జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మీడియాపై కక్షకట్టినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రెండు పత్రికలు అనేవారు. ఇపుడు పరిస్థితులు మారాయి. అవే రెండు పత్రికలు,ఛానెళ్లు ఇపుడు చంద్రబాబు కదిలినా,మెదిలినా విశేషంగానే ప్రచురించే పని భుజానికి ఎత్తుకున్నాయి. అమరావతిలో ఏదో జరిగిపోతుందనే భ్రమలు కల్పించే పరిస్థితుల్ని కొన్ని మీడియా సంస్థలు భుజానికి ఎత్తుకోవడంతో వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియకుండా పోతోంది.ఇదే విధానం కొనసాగితే ఫోర్త్ ఎస్టేట్ను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారు.
No comments:
Post a Comment