Ponnada Lakshmi
·
ఆదిపరాశక్తిని ఆరాధించే ఆదర్శభూమి. అయినా స్త్రీలపట్ల యెన్ని దురాగతాలో. యెన్ని మోసాలో.. మరెన్ని అవమానాలో.
స్త్రీలను జగన్మాత రూపాలుగా దర్శించిన శ్రీరామకృష్ణులు నడయాడిన మహొన్నత దేశం మనది; స్త్రీలను మాతృమూర్తులుగా భావించే అద్భుత సంస్కృతికి నిలయమని స్వామి వివేకానంద కీర్తించిన మాతృభూమి మనది. స్త్రీలు కన్నీరు కార్చే చోట సిరులు నిలవవనీ, స్త్రీలను వేధిస్తే అరిష్టాలు ఆవరిస్తాయనీ నమ్మిన ఆర్యభూమి మనది. విద్యదాయిని సరస్వతి, సౌభాగ్యదాయిని లక్ష్మి, శక్తిప్రదాయిని పార్వతి .. ఇలా ముగురమ్మలను ఆరాధించే దేవభూమి మనది; ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః - కనురెప్పలు తెరిచినంత మాత్రాన సృష్టి, కంటి కాంతులు ప్రసరించినంత మాత్రాన స్థితి, కనురెప్పలు మూసినంత మాత్రాన లయలను సాగించే ఆదిపరాశక్తి ఆఇర్భవించిన ఆధ్యాత్మిక భూమి మనది.
అలాంటి పుణ్యభూమి, యోగభూమి, ధన్యభూమి, ఆర్యభూమి, దేవభూమి, ఆధ్యాత్మిక భూమి అయిన భారతావనిలొ నేడు స్త్రీలు ఇంటా, బయటా వేధింపులకు గురి అవుతున్నారు. ఈ మధ్యే పోలీసులు విదుదల చేసిన ఒక నివేదికలో ప్రభుత్వ కార్యాలలో, విద్యా సంస్థలలో, I T సంస్థలలో, బహుళజాతి సంస్థలలొ, బ్యాంకులలో ఎంతో మంది స్త్రీలు వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడైంది. అలాగే మనదేశం రియో ఒలింపిక్ పతకాల పట్టికలో అట్టడుగు స్థానాన్ని కైవశం చేసుకున్నా అవినీతి, కుంభకోణాల పట్టికలో మాత్రం అగ్రస్థానాన్ని ఆక్రమించడానికి ప్రపంచ దేశాలతో పొటీపడుతూంది.
కామాసురులు, లొభాసురులు, మదాసురులు లేని సమాజాన్ని చూడాలంటే అనుగ్రహించి అభయమిచ్చిన ఆ జగన్మాతే ఆగ్రహిస్తే వినాశమవుతామన్న విషయాన్నివారు సదా గుర్తుంచుకోవాలి.
సేకరణ - రామకృష్ణ ప్రభ సంపాదకీయం నుండి.
No comments:
Post a Comment