UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 24 October 2016


అమరావతి నిర్మాణంలో ఆధారాలతో సహా బట్టబయలైన భారీ కుంభకోణం


అమరావతి నిర్మాణంలో ఆధారాలతో సహా బట్టబయలైన భారీ కుంభకోణం
విషయం — అమరావతి తాత్కాలిక రాజధాని నిర్మాణం .
కుంభకోణం విలువ – కనీసం 550 కోట్లు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని వెనక్కి నెట్టి కేవలం రెండేళ్లలో అవినీతిలో మన రాష్ట్రం నెంబర వన్ ఎలా అయిందో తెలుసు కోవాలనుందా! అయితే జాగ్రత్తగా ఈ కుంభకోణం గురించి చదవండి.
కట్టేది తాత్కాలిక రాజధాని అయినా, దోపిడీ మాత్రం నిత్య నూతనంగా, బరితెగింపుకి పరాకాష్టగా జరుగుతుంది. తాత్కాలిక రాజధాని నిర్మాణం ఆలోచన వచ్చినప్పటి నుండి, స్థలాలని ఎంపిక వరకు, కాంట్రాక్టర్లని నిర్ణయించటం నుండి నిధుల విడుదల వరకు మొత్తం అవినీతి మయం. సర్వం బినామీ కంపనీలకి దోచి పెడుతున్న వైనం మీరే చూడండి.
ముందుగా ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం రాష్ట్రంలో కాని దేశంలో కాని నిర్మాణ ఖర్చులు చూద్దాం. ఈ రోజుకి మార్కెట్ ధరలు ప్రకారం చదరపు అడుగు నిర్మాణానికి 1100 రూపాయల నుండి 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బాగా క్వాలిటీతో కట్టే అపార్ట్మెంట్లు కూడా 1500 కావటం లేదు (కేవలం నిర్మాణ ఖర్చులు మాత్రమె, స్థలం కాదు). స్థలంతో కలుపుకొంటే రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఉన్న విజయవాడ, గుంటూరు, ఆఖరికి హైదేరాబద్లో కూడా అపార్ట్మెంట్ ధరలు చరుపు అడుగు (sft ) కి 3500 నుండి 4000 వరకు ఉన్నాయి. అనగా స్థలం 1500 + నిర్మాణం 1500 + లాభం 1000. ఇది 1000 sft ఉన్న single bed room 40 లక్షల లెక్క ప్రకారం వేసుకొంటే. ఇది కూడా మనం అత్యధిక ధర వేసుకొని లాభం తగ్గించుకొంటే (అపార్ట్మెంట్లు కట్టించిన వాళ్లకి, కొన్న వాళ్లకి ఈ లెక్కలు సులభంగా అర్థం అవుతాయి). కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది కట్టేది ఇల్లు కాదు పెద్ద పెద్ద ఆఫీసులు నిర్మాణం, ఇంటికి ఉండాల్సిన హంగులు ఉండవు, చుట్టూ గోడలు పెట్టి వదిలేస్తారు (5 బిల్డింగ్లు 5 అంతస్తులు). ఇంటితో పోల్చుకొంటే ఆఫీస్ నిర్మాణం ఇంకా చాలా తక్కువ కావాలి. దానికి తోడూ నిర్మాణానికి కావాల్సిన ఇసుక ఉచితం, కరెంటు ఉచితం, నీళ్ళు ఉచితం, రోడ్లు, డ్రైనేజీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొంది, నిర్మాణ సంస్థకి ఎటువంటి సంభంధం లేదు.
మనం రాష్ట్రంలో ఉన్న అత్యధిక ధర ప్రకారమే లెక్క వేసుకొందాము. ఇప్పుడు చదరపు అడుగుకి 1500 నిర్మాణానికి ప్రభుత్వం లెక్క గట్టింది అనుకొందాము. మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం, స్థలం కాంట్రాక్టర్ కి ఉచితంగా ప్రభుత్వం సమకూర్చింది. కాబట్టి కాంట్రాక్టర్ చేయవలసింది కేవలం నిర్మాణం మాత్రమే.
1 చదరపు అడుగు నిర్మాణానికి (sft) = 1500 అనుకొందాము, ఇది కూడా అన్ని ఉచితాలని దృష్టిలో పెట్టుకొని కూడా అత్యధిక ధరలు వేసుకొంటే….
ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే, కాంట్రాక్టర్ కి ఉచితంగా నిర్మాణానికి అవసరం అయ్యే ఇసుక, కరెంటు, నీళ్ళు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. వాటికి కాంట్రాక్టర్ నయా పైసా చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాదు, ఆ భవనాలకి కావాల్సిన డ్రైనేజీ, రోడ్లు మొత్తం కూడా ప్రభుత్వంమే సమకూరుస్తుంది. నిజానికి అపర్ట్మెంట్లు కాని, షాపింగ్ కాంప్లెక్స్ కట్టే బిల్డర్స్ కి అవి అన్ని ఉచితంగా రావు, వారు పైన మనం వేసుకొన్న 1500 ధరలోనే అవి అన్ని కలిసి ఉంటాయి. అవి అన్ని కలిస్తేనే అదీ అన్ని ధరలు ఎక్కువ ఎక్కువ వేసుకొంటేనే 1500 అవుతుంది. అన్ని ఉచితాలని లెక్కలోకి తీసుకొంటే నిర్మాణ వ్యయం 1100 రూపాయలకి మించదు, అయినా కూడా మనం 1500 లెక్క వేసుకొందాం.
ఇప్పుడు అసలు మొత్తం ఎంత స్థలంలో నిర్మాణం చేస్తున్నారు, ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు, ఎంత మొత్తం కేటాయించారో చూద్దాం. ఇక్కడ ఉన్న అంకెలు లెక్కలు అన్నీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో ఉన్నవే, ఫోటోలలో చూడండి .
తాత్కాలిక రాజధానికి రెండు విడతలలో రెండు జీవోలు ఇచ్చారు. మొదటి జీవో ప్రకారం నిర్మాణ వ్యయం 180 కోట్లు, నిర్మాణ విస్తీర్ణం 58,655 sqm (స్క్వేర్ మీటర్లు). మొదటిసారి ఇచ్చిన జీవో కి అదనంగా మళ్ళీ రెండో సారీ ఇచ్చిన జీవో ప్రకారం నిర్మాణ వ్యయం 570 కోట్లు, నిర్మాణ విస్తీర్ణం 69,988 sqm. రెండు జీవోలని కలిపి మొత్తం ప్రభుత్వ విడుదల చేసిన నిధులు అక్షరాల 750 కోట్లు.
మొత్తం స్థలం – 58655 + 69988 = 128644 sqm (స్క్వేర్ మీటర్లు)
ఒక sqm (స్క్వేర్ మీటర్) = 10.7 sqf (చదరపు అడుగులు)
అంటే మొత్తం నిర్మాణ స్థలం 128644×10.7 = 1376490 చదరపు అడుగులు.
మొత్తం నిధులు 180 కోట్లు + 570 కోట్లు = 750 కోట్లు.
ఇప్పుడు చదరపు అడుగుకి ఎంత పడిందో చూద్దాం.
750 కోట్లు ÷ 1376490 చదరపు అడుగులు, అనగా
7500000000 ÷ 1376490 = 5448 రూపాయలు.
ఈ లెక్క ప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే ధర అక్షరాల 5448 రూపాయలు. ఇది కేవలం నిర్మానానికి మాత్రమే, స్థలం ప్రభుత్వానిదే.
మనం పైన చెప్పుకొన్న మార్కెట్ ధరల ప్రకారం అత్యధికంగా వేసుకొంటేనే చదరపు అడుగు నిర్మాణానికి 1500 అవుతుంది, అదీ బిల్డర్ లాభంతో కలుపుకొని.
దాని ప్రకారం చూసుకొంటే
1376490 × 1500 = 2064735000 అనగా అక్షరాల 206 కోట్లు.
మార్కెట్లో ఇప్పుడున్న అత్యధిక ధరల ప్రకారం చూసుకొన్న ఎట్టి పరిస్థితులలో కూడా లాభాలతో కలుపుకొని కూడా 200 కోట్లకి మించదు. 200 కోట్లు విలువ చేసే పనికి ప్రభుత్వం ఇచ్చినది అక్షరాల 750 కోట్లు. అనగా దోపిడీ 550 కోట్లు.
ఈ కాంట్రాక్టు ఇచ్చింది ఎవరికో కాదు, చంద్రబాబు జేబు సంస్థ అయినా ఎల్ అండ్ టీ మరియు తన బినామీ కంపెనీ అయిన షాపూరజీ కంపెనీకి. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం కూడా ఎల్ అండ్ టి కే ఇచ్చాడు, అప్పుడు కూడా ఇలానే అంచనాలు పెంచి ఇచ్చాడు, దానికి ప్రతిఫలంగా హైద్రాబాద్లో 300 కోట్లు విలువ చేసే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉచితంగా ఎల్ అండ్ టీ నిర్మాణం చేసి ఇచ్చింది. అలాంటి క్విడ్ ప్రో కో లో భాగంగానే ఈసారి కూడా అదే పద్దతిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లు నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నారు. దానికోసమే జీవో జారీ చేసి రాజధానిలో 4 ఎకరాలు, ప్రతిజిల్లాకి 2 ఎకరాలు, అనగా మొత్తం 30 ఎకరాలు టీడీపీ కి కేటాయిస్తూ చంద్రబాబు జీవో ఇచ్చాడు. ఇప్పుడు ఒప్పందంలో భాగంగా అన్ని జిల్లాలలో ఎల్ అండ్ టీ వాళ్ళు ఉచితంగా పార్టీ ఆఫీస్లు కట్టి ఇవ్వాలి.
మొత్తం మిగిలిన 550 కోట్లలో 450 కోట్లు చినబాబుకి పోగా, మిగిలిన 100 కోట్లతో పార్టీ ఆఫీసులు నిర్మాణం చేయాలి అదీ చంద్రబాబు స్కెచ్.
పైన చెప్పిన అన్ని లెక్కలకి , అంకెలకి స్వయంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలే ఆధారం .
— 1,2 ఫోటోలు చూడండి, 58655 sqm కి 180 కోట్లు కేటాయిస్తూ కేంద్రానికి క్లియరెన్స్ కోసం పంపిస్తే, వచ్చిన అప్రూవల్.
— 3,4 ఫోటోలు చూడండి మొదటి పంపిన 58655 sqm కి అదనంగా మరో 69988 Sqm ని అదనంగా చేర్పించిన ఆధారం , మొత్తం నిర్మాణ స్థలం 128644 sqm లుగా ఫోటోలో చూడొచ్చు.
— 5,6 ఫోటోలలో పైన పంపిన రెండు ప్రతిపాదనలకి కేంద్రం నుండి వచ్చిన అప్రూవల్.
— 7 వ ఫోటోలో బిల్డింగ్లు ఎలా కట్టాలి, అలాగే కేటాయించిన మొత్తం 750 కోట్లు ఈ ఫోటోలో చూడొచ్చు. ఇక్కడ మొదటి ప్రతిపాదన + రెండో ప్రతిపాదన రెండు కలిపి వివరంగా పట్టిక రూపంలో ఇచ్చారు గమనించండి.
180 కోట్లు + 570 కోట్లు = 750 కోట్లు.
— 8 వ ఫోటో లో 180 కోట్లు రిలీజ్ చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 32 (G.O.RT.No.32)
— 9 వ ఫోటోలో 530 కోట్లు రిలీజ్ చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 242 (G.O.MS.No.242)
— 10 వ ఫోటోలో క్విడ్ ప్రోకో పథకంలో భాగంగా రాజధాని ప్రాంతంలో 4 ఎకరాలు, మిగతా అన్ని జిల్లా కేంద్రాలలో 2 ఎకరాలు చొప్పున మొత్తం 30 ఎకరాలు ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 340 (G.O.MS.No.340).
అన్ని జిల్లా కేంద్రాలలో టీడీపీ పార్టీ ఆఫీసులు నిర్మాణం ఎల్ అండ్ టి కి అప్పగించిన చంద్రబాబు, ఇది పూర్తిగా ఫ్రీ గా చేస్తున్నారు. రాజధాని కాంట్రాక్టు ఇచ్చినందుకు టీడీపీకి దక్కే ప్రతిఫలం. నిజమైన క్విడ్ ప్రోకో అంటే ఇదే.
— 11 వ ఫోటోలో గతంలో ఇలాగే హైటెక్ సిటీ నిర్మాణంకోసం ఎల్ అండ్ టి కి స్థలం అప్పగించినప్పుడు, దానికి ప్రతిఫలంగా హైద్రాబాద్లో ఉచితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మించిన ఎల్ అండ్ టి, ఇది తెహెల్కా ఇచ్చిన రిపోర్ట్ ఆధారం.
— 12 వ ఫోటో ఒక చదరపు అడుగుకి (1 sft) కి 1400 రూపాయలు అయితే మంచి క్వాలిటీ తో నిర్మాణం చేయొచ్చు అనే నివేదిక చూడండి. పైగా ఇసుక, కరెంటు, నీళ్ళు అవీ ఏవి ఫ్రీ కాకపోతేనే ఆ ధర.
— 13 వ ఫోటో వెలగపూడి లో పని చేస్తున్న ఎల్ అండ్ టి కార్మికులు.

Extravagant scam unearthed in AP Capital Amaravati construction

Extravagant scam unearthed in AP Capital Amaravati construction
Picture 1 of 13
ప్రజాలారా ఒక్క నిమిషం ఆలోచన చేయండి, మీరు అందరూ కూడా ఎదో ఒక సందర్భంలో ఇల్లు, అపర్ట్మెంట్లు కట్టటమో, అమ్మాటమో, కొనటమో చేసి ఉంటారు. ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం కాకుండా ఇంకా కొంచం అధిక ధరలే వేస్తేనే మొత్తం 550 కోట్లు కుంభకోణం కనిపిస్తుంది. అసలు వాస్తవ ధరలు వేస్తే మొత్తం నిర్మాణం 150 కోట్లు కూడా కాదు, ఆఫీస్ నిర్మాణం, ఇంటి నిర్మాణం ఒకటి కాదు, ఆఫీసులకి ఇంట్లో ఉండే హంగులు ఉండవు, చుట్టూ గోడలు పెట్టి వదిలేస్తారు. ఇంటితో పోల్చుకొంటే కనీసం చదరపు అడుగుకి ఇంకో 500 రూపాయిలు తక్కువ పడుతుంది. అలా చూస్తే ఇప్పుడు చేస్తున్న నిర్మాణం మొత్తం 130 కోట్లలో పూర్తి అవ్వాలి.
పట్టపగలే ఇంత దారుణమైన దోపిడీ మరే దేశంలో జరిగినా వెంటనే జైల్లో పెట్టేవాళ్ళు. మన ఖర్మ ఏమిటంటే అన్ని లెక్కలు వివరంగా చెప్పాల్సిన మీడియానే ఈ దోపిడిలో భాగస్వామ్యం కావటం.
కొసమెరుపు — ఈ తాత్కాలిక నిర్మాణంలో జరిగే దోపిడీ ఇంతటితో ఆగటం లేదు. మొన్ననే కేంద్రం రాజధాని కోసం 2500 కోట్లు ఇచ్చింది అని అరుణ్ జేట్లే చెప్పాడు. ఇప్పడు 750 కోట్లుకి లెక్క పోను, మిగతా డబ్బులకి 1500 కోట్లు పెట్టి మొత్తం స్థలాన్ని 25 మీటర్లు ఎత్తు పెంచుతామని నిన్ననే చంద్రబాబు చెప్పాడు. అంటే మొత్తం 2500 కోట్లు ఈ తాత్కాలికం పేరుతోనే నాకేస్తారు.
– మణి అన్నపురెడ్డి

No comments:

Post a Comment