UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 9 March 2017

For the convenience of Telugu readers...
సాక్షి అంటే చూసింది చూసినట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పేది. దానికి ముఖ్యంగా కావలిసింది మనస్సాక్షి. కానీ సాక్షి లక్షణాలే వేరు. దానవీరశూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటుంది. 'అతి జుగుప్సాకరమైన నీ జననమెట్టిది?' అని అడుగుతారాయన. ఇప్పుడు సాక్షి మీడియాని అలాగే అడగాలి. పుట్టుకే జుగుప్సాకరం అనుకుంటే అందులో రాసే రాతలు మరింత రోత పుట్టిస్తున్నాయి.
ఎమ్మెల్సీ అఫడవిట్ లో నేను డిక్లేర్ చేసిన ఆస్తుల వివరాలను తీసుకుని చిలువలు పలువలుగా కుళ్ళు కథనాలను ప్రచారం చేస్తోంది సాక్షి ఉరఫ్ జగన్ మీడియా. ఈ రాతల వెనుక జగన్ కుట్ర ఉంటుందనీ, అవన్నీ అసత్య వార్తలని ప్రజలకు తెలుసు. అయినా ప్రజల దృష్టికి వచ్చింది కాబట్టి, ఆ ఆరోపణల మీద నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అయితే జగన్ కు ఉన్నట్టుగా నాకంటూ ఓ మీడియా లేదు. అందుకే మనందరికీ అందుబాటులో ఉండే ఈ సోషల్ మీడియాలో స్పందిస్తున్నాను.
ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిజాయితీ అన్నది చాలా ముఖ్యం. అందుకే ప్రతి సంవత్సరం మా కుటుంబ ఆస్తులను మేము ప్రకటిస్తాం. దేశంలో మరే రాజకీయ కుటుంబమూ ఇలా చెయ్యట్లేదు. హెరిటేజ్ సంస్థలో నాకు రూ.1.64 కోట్ల షేర్లు ఉన్నాయని ఇదివరకు చెప్పాను. మీకు ఒక కంపెనీలో వెయ్యి రూపాయల షేర్లు ఉంటే ఎవరైనా అడిగినప్పుడు వెయ్యి అనే చెబుతారు గానీ కిందటి నెల రెండువేలకు పెరిగిందని, ఇప్పుడు ఐదు వందలకు పడిపోయిందని చెప్పం కదా. షేర్లన్నాక రోజు రోజుకూ, గంట గంటకూ కూడా వాటి విలువ మారుతుంది. ఇదీ అంతే. మా ఆస్తులు ప్రకటించినప్పుడు షేర్లపై నా పెట్టుబడి ఎంతో అదే చెప్పాను. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ నిబంధన ప్రకారం ఇప్పుడు ఆ షేర్ల విలువ ఎంత ఉందో అది డిక్లేర్ చేశాను. అది పట్టుకుని ఇంతలోనే అంత ఎలా పెరిగిందని రాయడం బుర్ర తక్కువ వ్యవహారం కాదా? రాయమని చెప్పే వాళ్లకు తెలీదు సరే రాసేవాళ్ళయినా మీ ఆఫీసులో బిజినెస్ వార్తలు రాసే వాళ్ళను అడగొచ్చు కదా! గత పదేళ్ళుగా హెరిటేజ్ షేర్ల విలువ ఎలా మారుతూ వచ్చిందో వాళ్ళు చూసి చెప్పేవాళ్ళు కదా! సాక్షి అంటే చూసి, తెలుసుకుని చెప్పడం. అంతేకానీ కళ్ళుమూసుకుని తోచింది రాసుకోవడం కాదు.
ఇకపోతే ఈ మధ్య హెరిటేజ్ ఫుడ్స్ లో రిటైల్ విభాగాన్ని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కు అమ్మారు. కేవలం రూ.295కోట్ల విలువైన 3.65% వాటాను మాత్రం సంస్థ తన దగ్గర ఉంచుకుంది. ఈ ప్రాసెస్ లో రూ.2.52 కోట్ల విలువైన నా వాటా షేర్లు రూ.273.84 కోట్లకు పెరిగాయి. సంస్థల అమ్మకాలు లేదా విలీనాల వంటివి జరిగినప్పుడు షేర్ విలువలు పెరగడం వంటివి సహజం. అసలు ఈ అమ్మకం వెనుక కూడా ఒక కారణం ఉంది.
హెరిటేజ్ ఫుడ్స్ అనేది డైరీ, రిటైల్ ఇంకా ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థ. వీటిల్లో అంతగా లాభదాయకంగా లేని రిటైల్ విభాగాన్ని (దీని షేర్ విలువ కూడా తక్కువగా ఉండేది) రుణాలతో సహా అమ్మడం మూలంగా, హెరిటేజ్ ఫుడ్స్ వద్ద మిగిలిన డైరీ విభాగం లాభపడింది. ఈ విభాగ షేర్ మార్కెట్ విలువ పెరిగింది. దీనివల్ల ఈ విభాగం మీద ఆధారపడి ఉన్న రైతులకు ఒక భరోసా ఏర్పడింది. ఇంతగా ఇతరుల కోసం ఆలోచిస్తాం మేము. దీన్ని కూడా రచ్చ చేసి సైకో ఆనందాన్ని పొందుతోంది జగన్ మీడియా.
 రాజకీయంగా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా చూడాలనుకునే వారు సాక్షి పత్రికను గానీ ఇతర సాక్షి మాధ్యమాలను గానీ వెలివేయాలి. ఎందుకంటే వారి ప్రతిరాత, ప్రతి కథనం సిరా బదులు విషాన్ని అద్దుకుని జనాల్లోకి వస్తోంది. ప్రజల బాగు అన్నది వాళ్ళకు నచ్చని అంశం. క్విడ్ ప్రో కో అన్న పదానికి పేటెంట్ లాంటి జగన్, క్విడ్ ప్రో కో కారణంగానే పుట్టిన సాక్షి పత్రిక, క్విడ్ ప్రో కో నేరం కిందనే జైలుకెల్లొచ్చిన జగన్ అదే పచ్చకామెర్ల కంటితో అందరినీ చూస్తాడు.
అంతదాకా ఎందుకు! అవినీతి కేసుల్లో సీబీఐ వెల్లడించడం తప్ప, తనకు తానుగా వై ఎస్ జగన్ ఏ రోజైనా తన ఆస్తుల వివరాలు ప్రకటించాడా? సీబీఐ విచారిస్తోన్న 12 అవినీతి కేసులలో ఎ - 1 ముద్దాయి జగన్. తన అక్రమ సంపాదన దాచడానికి దేశవ్యాప్తంగా ఎన్నో సూట్ కేసు కంపెనీలను సృష్టించిన అంతర్జాతీయ నేరస్తుడు జగన్. ఏ విషయమైనా బహిరంగంగా చర్చిద్దాం రమ్మని ఇదివరకే పిలిచినా జగన్ పత్తాలేదు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. నాపై రాసిన రాతలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. జగన్ సిద్ధమా అని అడుగుతున్నా!

No comments:

Post a Comment