‘ఋషిపీఠం’ పత్రిక స్థాపించిన తరువాత ఎందఱో పెద్దలు మంచి రచనలను అందించి ఆర్షవాజ్ఞ్మయ వైభవాలను ఆవిష్కరిస్తున్నారు. వారిలో శ్రీ దేవరకొండ శేషగిరిరావు గారు విశిష్టులు.
వీరి ప్రత్యక్ష పరిచయం చాలా ఏళ్ళక్రితం నిడదవోలు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు లభించింది. కానీ కార్యక్రమాల హడావిడిలో నిదానంగా మాట్లాడడం జరగలేదు. పలుమార్లు దూరవాణి ద్వారా వారి వాణి వింటున్నప్పుడు నిష్కపటమైన వారి హృదయం, భారతీయ సంస్కృతి పట్ల వారికున్న స్పష్టమైన, సంప్రదాయబద్ధమైన ఆరాధన వ్యక్తమౌతూ స్ఫూర్తిదాయకంగా ఉండేది. అయితే కార్యాల తొందరింతలో తీరికగా ప్రసంగించే సందర్భాలు అరుదే.
అయితే అంతటి మహనీయుని ఆత్మీయతకు నోచుకోవడం మహాభాగ్యంగా భావిస్తూనే ఉంటాను.
వారిది నిరంతర సారస్వత యజ్ఞం. వారి వ్యక్తిత్వాన్ని, కృషిని పరిశీలించాక “ఆర్ష వాజ్ఞ్మయ తపస్వి” అనే మాట వారికి అన్వయిస్తుందని నా భావన. ఎప్పుడు వారి గురించి పేర్కొన్నా ఆ మాటయే బిరుదనామంగా స్ఫురిస్తూంటుంది.
ఎన్నో శాస్త్ర గ్రంథాలను వీరు అనువదించారు. కానీ వీరిని ‘అనువాదకులు’ అనలేము. శాస్త్ర హృదయాన్ని ఆవిష్కరించడంలో ఆర్ష సంప్రదాయ నిష్ఠమైన అద్భుతావగాహనను ప్రధానంగా కనబరుస్తారు. కొన్నిటిని అనువదించేటప్పుడు మూల గ్రంథాలలో ఎక్కడైనా సంప్రదాయ సమ్మతం కాని కూడికలున్నప్పుడు ‘మనవి’ అంటూ వినయంగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచటం వీరి ప్రత్యేకత.
‘అనేక రామాయణాలలో సుందరకాండ’ – ఒక గొప్ప పరిశోధన, ఉపాసన. తంత్ర గ్రంథాలను అందించేటప్పుడు కూడా సాత్త్విక, తాత్త్విక రీతిలో, భక్తి జ్ఞాన ధర్మ మార్గాలతో సమన్వయిస్తూ ఉపయోగకరంగా అందించడం వీరి విశిష్టత.
అప్పయ్య దీక్షితుల ఆత్మార్పణ స్తుతి, వరదరాజ స్తవం, కాశ్మీర శైవానికి చెందినా ఉత్పల దేవుని శివ స్తోత్రావళి – గ్రంథాలకు వీరి అనువాదాన్ని ఋషిపీఠం ప్రచురించింది. ‘దశమహావిద్యల’పై వేదవేదాంత సమన్వయంతో రచించిన దర్శన గ్రంథాన్ని అందించే అవకాశం కూడా ఋషిపీఠానికి లభించింది.
సనాతన ధర్మంపై కువిమర్శలను, అవహేళనలను దీటుగా ఎదుర్కొని సూటిగా సమాధానాలు చెప్పే విజ్ఞానం వీరివద్ద ఉంది. వీరి ధర్మసందేహాలు, విగ్రహ పరమార్థం, వివిధ దేవతలపై పరిశోధనాంశాలు గొప్ప జ్ఞాన భాండాగారాలు.
‘భారతకథలు – అంతరార్థం’ వీరి రచనలలో ఒక మణి. వైదిక మంత్రదృష్టితో భారత హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఒక నిశిత భావుకత కలిగిన కవిగా భావమయం జగత్, భావాంబర విహారం – గ్రంథాలు చూపిస్తాయి. రూపగోస్వామి- పద్యావళి, వీరి రసమయ భక్తిని అనువదించింది. సూటితనంతో పాటు సున్నితమైన ఆర్ద్రహృదయం వీరి వ్యక్తిత్వ శోభ.
‘భారతీయ సంస్కారములు’ (తి.తి.దే.వారి ప్రచురణ) షోడశ సంస్కార దీపిక.
కొంతకాలం క్రితం నిడదవోలు నుండి కాకినాడకు మకాం మార్చారు.
కాకినాడ వెళ్ళినప్పుడు వీరిని ప్రత్యక్షంగా కలిసి ఆశీస్సులను పొందాలని భావించాను. ఆ అవకాశం కొద్ది నెలల క్రితం లభించింది.
ఆ మహాశయుని ఇంటికి చేరగానే – ఆది దంపతుల్లా వారిరువురూ ఎంతో వాత్సల్యాన్ని వర్షించారు. ఆర్ష భారతిని ఆరాధిస్తూ జీవితాన్ని అక్షర తపస్సుగా మలచుకున్న వారిని చూడగానే నాలో పూజ్యభావం, దివ్యానుభూతి కలిగాయి.
కొద్దికాలం నుండి ఇంతవరకూ తెలుగులోకి రాని – కంచి పరమాచార్య మహాస్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి వచనాలను ఆంధ్రీకరిస్తూ ఆ అపర దక్షిణామూర్తి వాజ్ఞ్మయమూర్తిని ఉపాసిస్తున్నారు. పరమాచార్యుని స్మరణతోనే వీరి గొంతు గద్గదమౌతుంది – నేత్రాలు సజలాలౌతాయి. ప్రస్తుతం ఆ ఆరాధన కొనసాగుతోంది.
కొన్ని గ్రంథాలను ‘విజ్ఞాన మంజూష’ వారు ప్రచురించారు.
ప్రాచీన కాలపు మంచి విలువలతో, ఆర్ష విజ్ఞాన దీధితితో ప్రకాశిస్తున్న వీరు, తన డెబ్భై ఆరు వసంతాల వయస్సులో కూడా ఆరోగ్యం సహకరించకున్నా, అవిశ్రాంత రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు.
బ్రహ్మశ్రీ శేషగిరిరావు గారి వ్యక్తిత్వం యువతరానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. తన ఉనికిని సార్ధకం చేసుకుంటూ, ఎందరినో తరింపజేస్తూ, నిరాడంబర జీవనాన్ని సాగిస్తున్న వీరి శ్రమకు తగిన గౌరవాలు ప్రతిష్ఠంగా లభించకున్నా, పరమేశ్వర కారుణ్యమే లక్ష్యంగా శ్రమించడం కృతకృత్యత.
నిరపేక్షమైన తపస్సు ఒక యోగం. ఆ యోగాన్ని పండించుకున్న యోగి ఈ మహాత్ములు.
వీరి ప్రత్యక్ష పరిచయం చాలా ఏళ్ళక్రితం నిడదవోలు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు లభించింది. కానీ కార్యక్రమాల హడావిడిలో నిదానంగా మాట్లాడడం జరగలేదు. పలుమార్లు దూరవాణి ద్వారా వారి వాణి వింటున్నప్పుడు నిష్కపటమైన వారి హృదయం, భారతీయ సంస్కృతి పట్ల వారికున్న స్పష్టమైన, సంప్రదాయబద్ధమైన ఆరాధన వ్యక్తమౌతూ స్ఫూర్తిదాయకంగా ఉండేది. అయితే కార్యాల తొందరింతలో తీరికగా ప్రసంగించే సందర్భాలు అరుదే.
అయితే అంతటి మహనీయుని ఆత్మీయతకు నోచుకోవడం మహాభాగ్యంగా భావిస్తూనే ఉంటాను.
వారిది నిరంతర సారస్వత యజ్ఞం. వారి వ్యక్తిత్వాన్ని, కృషిని పరిశీలించాక “ఆర్ష వాజ్ఞ్మయ తపస్వి” అనే మాట వారికి అన్వయిస్తుందని నా భావన. ఎప్పుడు వారి గురించి పేర్కొన్నా ఆ మాటయే బిరుదనామంగా స్ఫురిస్తూంటుంది.
ఎన్నో శాస్త్ర గ్రంథాలను వీరు అనువదించారు. కానీ వీరిని ‘అనువాదకులు’ అనలేము. శాస్త్ర హృదయాన్ని ఆవిష్కరించడంలో ఆర్ష సంప్రదాయ నిష్ఠమైన అద్భుతావగాహనను ప్రధానంగా కనబరుస్తారు. కొన్నిటిని అనువదించేటప్పుడు మూల గ్రంథాలలో ఎక్కడైనా సంప్రదాయ సమ్మతం కాని కూడికలున్నప్పుడు ‘మనవి’ అంటూ వినయంగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచటం వీరి ప్రత్యేకత.
‘అనేక రామాయణాలలో సుందరకాండ’ – ఒక గొప్ప పరిశోధన, ఉపాసన. తంత్ర గ్రంథాలను అందించేటప్పుడు కూడా సాత్త్విక, తాత్త్విక రీతిలో, భక్తి జ్ఞాన ధర్మ మార్గాలతో సమన్వయిస్తూ ఉపయోగకరంగా అందించడం వీరి విశిష్టత.
అప్పయ్య దీక్షితుల ఆత్మార్పణ స్తుతి, వరదరాజ స్తవం, కాశ్మీర శైవానికి చెందినా ఉత్పల దేవుని శివ స్తోత్రావళి – గ్రంథాలకు వీరి అనువాదాన్ని ఋషిపీఠం ప్రచురించింది. ‘దశమహావిద్యల’పై వేదవేదాంత సమన్వయంతో రచించిన దర్శన గ్రంథాన్ని అందించే అవకాశం కూడా ఋషిపీఠానికి లభించింది.
సనాతన ధర్మంపై కువిమర్శలను, అవహేళనలను దీటుగా ఎదుర్కొని సూటిగా సమాధానాలు చెప్పే విజ్ఞానం వీరివద్ద ఉంది. వీరి ధర్మసందేహాలు, విగ్రహ పరమార్థం, వివిధ దేవతలపై పరిశోధనాంశాలు గొప్ప జ్ఞాన భాండాగారాలు.
‘భారతకథలు – అంతరార్థం’ వీరి రచనలలో ఒక మణి. వైదిక మంత్రదృష్టితో భారత హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఒక నిశిత భావుకత కలిగిన కవిగా భావమయం జగత్, భావాంబర విహారం – గ్రంథాలు చూపిస్తాయి. రూపగోస్వామి- పద్యావళి, వీరి రసమయ భక్తిని అనువదించింది. సూటితనంతో పాటు సున్నితమైన ఆర్ద్రహృదయం వీరి వ్యక్తిత్వ శోభ.
‘భారతీయ సంస్కారములు’ (తి.తి.దే.వారి ప్రచురణ) షోడశ సంస్కార దీపిక.
కొంతకాలం క్రితం నిడదవోలు నుండి కాకినాడకు మకాం మార్చారు.
కాకినాడ వెళ్ళినప్పుడు వీరిని ప్రత్యక్షంగా కలిసి ఆశీస్సులను పొందాలని భావించాను. ఆ అవకాశం కొద్ది నెలల క్రితం లభించింది.
ఆ మహాశయుని ఇంటికి చేరగానే – ఆది దంపతుల్లా వారిరువురూ ఎంతో వాత్సల్యాన్ని వర్షించారు. ఆర్ష భారతిని ఆరాధిస్తూ జీవితాన్ని అక్షర తపస్సుగా మలచుకున్న వారిని చూడగానే నాలో పూజ్యభావం, దివ్యానుభూతి కలిగాయి.
కొద్దికాలం నుండి ఇంతవరకూ తెలుగులోకి రాని – కంచి పరమాచార్య మహాస్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి వచనాలను ఆంధ్రీకరిస్తూ ఆ అపర దక్షిణామూర్తి వాజ్ఞ్మయమూర్తిని ఉపాసిస్తున్నారు. పరమాచార్యుని స్మరణతోనే వీరి గొంతు గద్గదమౌతుంది – నేత్రాలు సజలాలౌతాయి. ప్రస్తుతం ఆ ఆరాధన కొనసాగుతోంది.
కొన్ని గ్రంథాలను ‘విజ్ఞాన మంజూష’ వారు ప్రచురించారు.
ప్రాచీన కాలపు మంచి విలువలతో, ఆర్ష విజ్ఞాన దీధితితో ప్రకాశిస్తున్న వీరు, తన డెబ్భై ఆరు వసంతాల వయస్సులో కూడా ఆరోగ్యం సహకరించకున్నా, అవిశ్రాంత రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు.
బ్రహ్మశ్రీ శేషగిరిరావు గారి వ్యక్తిత్వం యువతరానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. తన ఉనికిని సార్ధకం చేసుకుంటూ, ఎందరినో తరింపజేస్తూ, నిరాడంబర జీవనాన్ని సాగిస్తున్న వీరి శ్రమకు తగిన గౌరవాలు ప్రతిష్ఠంగా లభించకున్నా, పరమేశ్వర కారుణ్యమే లక్ష్యంగా శ్రమించడం కృతకృత్యత.
నిరపేక్షమైన తపస్సు ఒక యోగం. ఆ యోగాన్ని పండించుకున్న యోగి ఈ మహాత్ములు.
No comments:
Post a Comment