కోడూరి విజయకుమార్
' కోర్టులలో పేరుకుపోయిన కేసుల పని భారానికి తగినట్లు న్యాయమూర్తుల పోస్టులను పెంచి, న్యాయ వ్యవస్థల యంత్రాంగాలను పటిష్టం చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి' ... అని సాక్షాత్తు సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగారు ఈ దేశప్రధాని సమక్షంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారని అన్నిరకాల మీడియా లలో వార్తలు వచ్చాయి!
అయితే, ఆయన మరొక మాట కూడా అన్నారు-
నిజానికి, ఆయన మాటలలో అదే ముఖ్యమైన అంశం ... మీడియా హైలైట్ చేయవలసిన అంశం!
ప్రభుత్వ వ్యవస్థలు చిత్తశుద్ధితో పనిచేస్తే చాలా సమస్యలు ప్రభుత్వ అధికార వ్యవస్థల స్థాయి లోనే పరిష్కరింప బడతాయి!
దురదృష్టవశాత్తూ, ప్రభుత్వ అధికార వ్యవస్థలు చాలా సమస్యల విషయంలో (మరీ ముఖ్యంగా, 'తమకేమీ విషయంలేదు' అనిపించే విషయాలలో) 'మనకెందుకొచ్చిన తలనెప్పి?' అని ఆ సమస్యలను కోర్టు లలోకినెట్టివేస్తాయి.
అసలే పేరుకుపోయిన కేసులతో సతమతమయ్యే కోర్టులు, ఆ సమస్యను అర్థం చేసుకుని, ఆ సమస్యకు చెందిన అందరి వాదనలూ విని, పరిష్కారం చూపెసరికి పుణ్యకాలం గడిచిపోతుంది.
ప్రభుత్వ అధికార వ్యవస్తలలోని ఈ తరహా ధోరణి వల్ల కోర్టులలో పెరిగే కేసులసంఖ్య చాలా ఎక్కువ అని చెప్పడానికి ఇటీవలి మంచి ఉదాహరణ .... మన రాష్ట్ర విభజనకు సంబంధించి కోర్టులలో పెరిగిపోతున్న కేసులు !
అయితే, ఆయన మరొక మాట కూడా అన్నారు-
నిజానికి, ఆయన మాటలలో అదే ముఖ్యమైన అంశం ... మీడియా హైలైట్ చేయవలసిన అంశం!
ప్రభుత్వ వ్యవస్థలు చిత్తశుద్ధితో పనిచేస్తే చాలా సమస్యలు ప్రభుత్వ అధికార వ్యవస్థల స్థాయి లోనే పరిష్కరింప బడతాయి!
దురదృష్టవశాత్తూ, ప్రభుత్వ అధికార వ్యవస్థలు చాలా సమస్యల విషయంలో (మరీ ముఖ్యంగా, 'తమకేమీ విషయంలేదు' అనిపించే విషయాలలో) 'మనకెందుకొచ్చిన తలనెప్పి?' అని ఆ సమస్యలను కోర్టు లలోకినెట్టివేస్తాయి.
అసలే పేరుకుపోయిన కేసులతో సతమతమయ్యే కోర్టులు, ఆ సమస్యను అర్థం చేసుకుని, ఆ సమస్యకు చెందిన అందరి వాదనలూ విని, పరిష్కారం చూపెసరికి పుణ్యకాలం గడిచిపోతుంది.
ప్రభుత్వ అధికార వ్యవస్తలలోని ఈ తరహా ధోరణి వల్ల కోర్టులలో పెరిగే కేసులసంఖ్య చాలా ఎక్కువ అని చెప్పడానికి ఇటీవలి మంచి ఉదాహరణ .... మన రాష్ట్ర విభజనకు సంబంధించి కోర్టులలో పెరిగిపోతున్న కేసులు !
No comments:
Post a Comment