UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 20 November 2016

పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, నకిలీ కరెన్సీ ఆర్థిక వ్యవస్థ నుంచి తుడిచిపెట్టుకుపోతాయా? ఈ చర్య వల్ల ప్రయోజనాలేమిటీ, ప్రతికూలతలేమిటి? కరెన్సీ డీమానిటైజేస్‌ ఇదే మొదటిసారా? నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని నిలువరించాలంటే ఏం చేయాలి?
 
ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల చట్టబద్ధంగా మార్పిడి అయిన కరెన్సీ పోను 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల నల్లధనం మురిగిపోతుందని అంచనా. ఆర్‌బిఐ పద్దుల్లోకి వచ్చే ఈ సొమ్ముపై ప్రభుత్వానికి డివిడెండు లభిస్తుంది గనుక ఆ సొమ్ముతో ప్రభుత్వ విత్తలోటును పూడ్చుకోగలుగుతుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన వనరులను అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించడం వల్ల అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధిరేటు దిశగా పరుగులు తీయగలుగుతుంది. మరోపక్క ద్రవ్యోల్బణం తగ్గి ప్రజల స్థితిగతులు మెరుగుపడడం, బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరగడం వల్ల రుణాలు తేలిగ్గా అందుబాటులోకి రావడం, ఫలితంగా వడ్డీరేట్లు తగ్గడం ఇతర సానుకూల ఫలితాలు. మనీ, ఈక్విటీ, డెట్‌ మార్కెట్లకు కూడా ఇది శుభపరిమాణమే. బంగారం ధరలు ప్రస్తుతానికి పెరిగినా ప్రజల దగ్గర నగదు నిల్వలు తగ్గడం వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది గనుక భవిష్యత్తులో ధరలు అదుపులోకి వస్తాయి. బంగారం దిగుమతులు తగ్గుతాయి. ఆర్థిక రంగంలో స్థిరత్వం కారణంగా ఎఫ్‌డిఐల రాక పెరుగుతుంది. రియల్టీ ధరలు తగ్గి సగటు జీవికి అందుబాటులోకి వస్తాయి. అయితే వచ్చే రెండు త్రైమాసికాల వరకు వృద్ధిరేటు తగ్గడం ప్రధాన ప్రతికూలత. అలాగే కొన్ని రంగాల్లో మొండిబకాయిలు పెరగవచ్చు. ప్రజల చేతిలో నగదు నిల్వలు లేకపోవడం వల్ల ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులు, కార్లు, స్కూటర్లు, ఎసిలు, ఎలక్ర్టానిక్‌ వస్తువుల కొనుగోళ్ళు తగ్గి ఉత్పత్తి తగ్గవచ్చు. వ్యాపార రంగానికి ఇది నష్టం. 
 
అమెరికాలోనూ చేశారు..
పెద్ద నోట్ల రద్దు మనకిగాని, ప్రపంచానికి గాని ఇదేమీ కొత్త కాదు. అమెరికాలో నిక్సన్‌ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో 1969లో ఐదు వేలు, పది వేలు, వెయ్యి, ఐదు వందల డాలర్లను రాత్రికి రాత్రి రద్దు చేశారు. అప్పుడు అక్కడ కూడా ప్రజలు మూడు నాలుగు నెలల పాటు ఇబ్బందులు పడాల్సివచ్చింది. కాని దాని వల్ల అవినీతి అంతమై వైట్‌ మనీ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చింది. మన దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు 1946 జనవరిలో వెయ్యి, ఐదువేలు పదివేల నోట్లను రద్దు చేశారు. 1954లో తిరిగి వాటిని ప్రవేశపెట్టారు. 1978లో మరోసారి అధిక విలువ గల కరెన్సీ నోట్లన్నింటినీ రద్దు చేశారు. జనవరి 16 నిర్ణయం తీసుకుని 17వ తేదీ బ్యాంకింగ్‌ లావాదేవీలు ముగిసిన సమయం నుంచి దాన్ని అమలుపరిచారు. కానీ ఈ సారి ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడమే కొంత ఇబ్బందికరం అయింది. కాని ముం దుగా నోటీసు ఇచ్చి ఉంటే బడా పెద్దలందరూ సర్దుకునే అవకాశం ఉన్నందు వల్ల నే ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవలసివచ్చింది. 
 
ఏం చేస్తే బాగుంటుంది..
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమన్వయంతో పని చేసినప్పుడే వ్యవస్థ నుంచి నల్లధనం నిర్మూలించే వీలు కలుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌లో నల్లధనం ప్రవాహం అధికంగా ఉంటుంది. ప్రస్తుత ఆదాయం పన్ను రేట్లు కూడా నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 30 నుంచి 35 శాతం మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చాలా బాధతో పన్ను చెల్లిస్తున్నారన్నది వాస్తవం. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంస్కరణలు కూడా వేగంగా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు ఈ చర్యలను చేపట్టాలి. 
  • రియల్‌ ఎస్టేట్‌ విలువలను మార్కెట్‌ విలువలకు చేరువగా తీసుకురావాలి.
  • 11 నుంచి 15 శాతం మధ్య ఉన్న స్టాంప్‌డ్యూటీని తగ్గించి వాస్తవిక విలువతో రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు ప్రజలను ప్రోత్సహించాలి.
  • ఆదాయం పన్ను రేట్లు తగ్గించి శ్లాబ్‌లు పెంచాలి.
  • ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జిఎ్‌సటిని జాప్యం లేకుండా అమల్లోకి తేవాలి.
  • ఎన్నికల వ్యయాలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చే విధానం ఉండాలి. పార్లమెంటు, అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల్లో నల్లధనం దందాను అరికట్టగలుగుతారు.
  • నకిలీ కరెన్సీపై ప్రజల్లో చైతన్యం పెంచాలి. పెద్ద కరెన్సీ నోట్ల సీరీ్‌సను తరచుగా మార్చడం కూడా నకిలీ నట్ల నిరోధానికి అవసరం.
  • ఇప్పుడు వచ్చిన రెండు వేల రూపాయల కరెన్సీ నోటును చాలా ఆధునిక విధానాలతో ముద్రించారు. ఈ నోట్లు ముద్రించేందుకు తేలిగ్గా ఎవరికీ అందుబాటులో లేని ఇంక్‌ ఉపయోగించారు. ఇతర నోట్లు కూడా ఇదే పద్ధతిలో ముద్రించాలి.
  • ఇది కూడా చేయగలిగితే గ్లోబల్‌ కరప్షన్‌ ఇండెక్స్‌లో మన స్థానం గణనీయంగా మెరుగుపడుతుంది. 2014లో ఈ సూచిలో మనం 200 స్థానంలో ఉండగా ఇప్పుడది 76కి తగ్గింది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తే ఇది మరింతగా తగ్గే ఆస్కారం ఉంటుంది.

No comments:

Post a Comment