లెక్చర్ "వెంకటేశ్వర్లు", ఉషారాణి రూం మేట్స్ ని మచ్చిక చేసుకొని, వారి ద్వారా ఉషారాణి అర్ధ నగ్న ఫోటోలు తీయించి, మనోవేదన కి గురిచేసిన వారి రూం మేట్స్ కి కూడా కఠిన కారాగార శిక్ష పడితే కాని సభ్య సమాజం కొంతమేరకైనా బాగుపడుతుంది. బాబు పాలన లో మితి మీరుతున్న అరాచకాలు...
======================================
కర్నూలు: RGM College, Kurnool ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
బీరం జయరామిరెడ్డి, జయమ్మ దంపతుల రెండవ సంతానం బీరం ఉషారాణి (18).
.
పాఠాలు చెప్పాల్సిన లెక్చర్ "వెంకటేశ్వర్లు" ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో ఉషారాణి బలవర్మణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. ఉషారాణి కాలేజీలో చేరినప్పటి నుంచి వెంకటేశ్వర్లు అనే లెక్చరర్ ఆమెపై కన్నేశారు. ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఉషారాణి నిరాకరించింది. దీంతో ఆకీచక అధ్యాపకుడు ఏ గురువు చేయకూడని పని చేశాడు. ఆ పనే విద్యార్థిని ప్రాణాలు తీసుకునేలా చేసింది. ప్రేమ పేరుతో తాను చేస్తున్న ప్రతిపాదనను తిరస్కరిస్తుందని లెక్చరర్ వెంకటేశ్వర్లు ఉషారాణిని బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు.
.
హాస్టల్లో ఉండే ఉషారాణి రూమ్మేట్స్ను మచ్చిక చేసుకున్నాడు. వారితో సంప్రదింపులు చేస్తూ ఉషారాణికి తెలియకుండా ఫోటోలు తీయించాడు. బట్టలు మార్చకుంటున్నప్పుడు, ఆద మరిచి నిద్రపోతున్నప్పుడు తోటి వారే ఉషారాణి ఫోటోలు తీసి ఆ కీచకుడికి పంపారు. ఉషా స్నేహితుల ద్వారా సేకరించిన ఫోటోలను వెంకటేశ్వర్లు తిరిగి ఇంత జరిగితే కాలేజీ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు స్పందించింది. వేధింపులు ఆమె చావుకు కారణం కానేకాదని తేల్చిచెప్పింది. అనారోగ్యం కారణంగా ఆమె సెలవుపై వెళ్లిందని ఇంటి దగ్గర ఏదో జరిగి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందని చెబుతోంది కళాశాల యాజమాన్యం. ఇప్పటి దాకా పోలీసులు కానీ, కాలేజీ యాజమాన్యం గానీ లెక్చరర్ వెంకటేశ్వర్లు కోణాన్ని మీడియా ముందు పెట్టడం లేదు. ఈ ఘోరాన్ని ఓ సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
.
ఆమె ఫోన్కే వాట్సప్ చేశారు. నీచుట్టూ ఉన్న ప్రపంచమంతా నా సొంతం అని వెకిలి సందేశాలతో వేధించారు. లెక్చరర్ పంపిన ఫోటోలను చూసి ఉషారాణి షాక్ తిన్నది. అయినా సరే లెక్చరర్తో పోరాడింది. కానీ అతను మాత్రం ఉషారాణిని వదిలిపెట్టలేదు. తనను అంగీకరించకపోతే ఆ ఫోటోలను కాలేజీలోని అందరికీ మెసేజ్ చేస్తానని బెదిరించాడు. వార్నింగ్లతో వేధించాడు.
.
ఈ ఘటన జరిగాక కాలేజీలో ఉండలేకపోయిన ఉషారాణి దీపావళి సెలవులు రాగానే ఇంటికి వెళ్లిపోయింది. తన కుటుంబసభ్యులకు విషయం మొత్తం చెప్పింది. మళ్లీ కాలేజీకి వచ్చినప్పుడు తండ్రితో కలిసి వచ్చింది. ఉషారాణి తండ్రే కాలేజీ ప్రిన్సిపాల్కు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కళాశాల యాజమాన్యం ఉషారాణి తండ్రికి నచ్చజెప్పి పంపారు. ఉషారాణి ఎప్పటిలాగే తన హాస్టల్కు వెళ్లిపోయింది. అయితే తండ్రి ఇంటికి చేరకముందే ఉషారాణి ప్రాణాలు వదిలేసింది. ఇంటినుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచింది. స్నేహితుల నమ్మకద్రోహం, కాల్చుకుతిన్న లెక్చరర్ వేధింపులు ఉషారాణిని చంపేశాయి. హాస్టల్లో ఉండనని ఎంత మొండికేసినా తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపారు. వేధించే లెక్చరర్ వద్ద చదవుకొనసాగించలేక, తనకు తెలియకుండా తన ఫోటోలు తీసి పంపిన స్నేహితులతో కలిసి ఉండలేక ఉషారాణి పురుగులమందు డబ్బాను ఆశ్రయించింది. ఈ ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కీచక లెక్చరర్ వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు , ఉషా కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
======================================
కర్నూలు: RGM College, Kurnool ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
బీరం జయరామిరెడ్డి, జయమ్మ దంపతుల రెండవ సంతానం బీరం ఉషారాణి (18).
.
పాఠాలు చెప్పాల్సిన లెక్చర్ "వెంకటేశ్వర్లు" ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో ఉషారాణి బలవర్మణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. ఉషారాణి కాలేజీలో చేరినప్పటి నుంచి వెంకటేశ్వర్లు అనే లెక్చరర్ ఆమెపై కన్నేశారు. ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఉషారాణి నిరాకరించింది. దీంతో ఆకీచక అధ్యాపకుడు ఏ గురువు చేయకూడని పని చేశాడు. ఆ పనే విద్యార్థిని ప్రాణాలు తీసుకునేలా చేసింది. ప్రేమ పేరుతో తాను చేస్తున్న ప్రతిపాదనను తిరస్కరిస్తుందని లెక్చరర్ వెంకటేశ్వర్లు ఉషారాణిని బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు.
.
హాస్టల్లో ఉండే ఉషారాణి రూమ్మేట్స్ను మచ్చిక చేసుకున్నాడు. వారితో సంప్రదింపులు చేస్తూ ఉషారాణికి తెలియకుండా ఫోటోలు తీయించాడు. బట్టలు మార్చకుంటున్నప్పుడు, ఆద మరిచి నిద్రపోతున్నప్పుడు తోటి వారే ఉషారాణి ఫోటోలు తీసి ఆ కీచకుడికి పంపారు. ఉషా స్నేహితుల ద్వారా సేకరించిన ఫోటోలను వెంకటేశ్వర్లు తిరిగి ఇంత జరిగితే కాలేజీ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు స్పందించింది. వేధింపులు ఆమె చావుకు కారణం కానేకాదని తేల్చిచెప్పింది. అనారోగ్యం కారణంగా ఆమె సెలవుపై వెళ్లిందని ఇంటి దగ్గర ఏదో జరిగి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందని చెబుతోంది కళాశాల యాజమాన్యం. ఇప్పటి దాకా పోలీసులు కానీ, కాలేజీ యాజమాన్యం గానీ లెక్చరర్ వెంకటేశ్వర్లు కోణాన్ని మీడియా ముందు పెట్టడం లేదు. ఈ ఘోరాన్ని ఓ సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
.
ఆమె ఫోన్కే వాట్సప్ చేశారు. నీచుట్టూ ఉన్న ప్రపంచమంతా నా సొంతం అని వెకిలి సందేశాలతో వేధించారు. లెక్చరర్ పంపిన ఫోటోలను చూసి ఉషారాణి షాక్ తిన్నది. అయినా సరే లెక్చరర్తో పోరాడింది. కానీ అతను మాత్రం ఉషారాణిని వదిలిపెట్టలేదు. తనను అంగీకరించకపోతే ఆ ఫోటోలను కాలేజీలోని అందరికీ మెసేజ్ చేస్తానని బెదిరించాడు. వార్నింగ్లతో వేధించాడు.
.
ఈ ఘటన జరిగాక కాలేజీలో ఉండలేకపోయిన ఉషారాణి దీపావళి సెలవులు రాగానే ఇంటికి వెళ్లిపోయింది. తన కుటుంబసభ్యులకు విషయం మొత్తం చెప్పింది. మళ్లీ కాలేజీకి వచ్చినప్పుడు తండ్రితో కలిసి వచ్చింది. ఉషారాణి తండ్రే కాలేజీ ప్రిన్సిపాల్కు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కళాశాల యాజమాన్యం ఉషారాణి తండ్రికి నచ్చజెప్పి పంపారు. ఉషారాణి ఎప్పటిలాగే తన హాస్టల్కు వెళ్లిపోయింది. అయితే తండ్రి ఇంటికి చేరకముందే ఉషారాణి ప్రాణాలు వదిలేసింది. ఇంటినుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచింది. స్నేహితుల నమ్మకద్రోహం, కాల్చుకుతిన్న లెక్చరర్ వేధింపులు ఉషారాణిని చంపేశాయి. హాస్టల్లో ఉండనని ఎంత మొండికేసినా తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపారు. వేధించే లెక్చరర్ వద్ద చదవుకొనసాగించలేక, తనకు తెలియకుండా తన ఫోటోలు తీసి పంపిన స్నేహితులతో కలిసి ఉండలేక ఉషారాణి పురుగులమందు డబ్బాను ఆశ్రయించింది. ఈ ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కీచక లెక్చరర్ వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు , ఉషా కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
No comments:
Post a Comment