UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 12 December 2016


ధర్మాస్పత్రుల్లో అవస్థలు

హైదరాబాద్,ఆంధ్రజ్యోతి,12-12-2016:ధర్మాస్పత్రుల్లో రోగులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కరెంట్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఒకసారి ఉస్మానియాలో..మరోసారి సుల్తాన్‌బజార్‌.ఇంకోసారి నిలోఫర్‌ ఆస్పత్రిలో..కరెంట్‌ కోతలతో రోగులు అవస్థలు పడుతున్నారు. గాంధీలో వైద్యుల రాకపోకలకు వేళాపాళలేకుండా పోతోంది.10 గంటలకు తాపీగా వస్తున్న వైద్యులు 12 గంటలకే చెక్కేస్తున్నారు. దీంతో ఓపీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ టైం దాటితే కొందరు రోగులు మరుసటి రోజువరకు ఆస్పత్రి ఆవరణలో మగ్గుతున్నారు. ఉస్మానియాలో ఓపీ సమయం వరకే ల్యాబ్‌ పరీక్షలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుతుల్లో ప్రైవేట్‌కు పరుగు తీయాల్సిన దుస్థితి నెలకొంది. 24 గంటల ల్యాబ్‌ సదుపాయం ఇప్పటికే ఏర్పాటు చేయలేదు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత అంతరాయాలు 
ఉస్మానియా, సుల్తాన్‌బజార్‌, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో తాతాల కాలం నాటి విద్యుత వైరింగ్‌ వల్ల అంతరాయం ఏర్పడుతోంది.  వీటికి తాత్కాలిక మరమ్మత్తులు చేయిస్తున్నారే... తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదు. దీంతో ఆస్పత్రుల్లో తరచూ అంధకారం నెలకొంటోంది.
జనరేటర్లు ఉన్నప్పటికీ.... 
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్‌ కోతతో అవస్థలు పడుతున్నారు. ఆయా ఆస్పత్రు ల్లో జనరేటర్లు ఉన్నప్పటికీ అవి కేవలం శస్త్ర చికిత్సల వరకే ఉపయోగిస్తున్నారు. కొన్నిరకాల అత్యవసర చికిత్సలు, సిటీస్కాన్‌, ఎక్స్‌రే వంటి వాటిని జనరేటర్లతో నడుపుతున్నారు. జనరేటర్ల సామా ర్థ్యం అంతంత మాత్రమే. దీంతో అన్ని వార్డులకు పూర్తిస్థాయిలో కరెంట్‌ సరఫరా కావడంలేదు. కొన్ని వార్డుల్లో వెలుగులు, మరికొన్ని వార్డుల్లో అంధకారం నెలకొంటోంది. జనరేటర్లు ఆన్‌చేసిన సమయంలో కొన్నిఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లను ఆపేస్తు న్నామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. కరెంట్‌ కోతతో మైనరు ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు.
గాంధీలో వేళాపాళాలేని కోతలు 
గాంధీ ఆస్పత్రిలో కరెంట్‌ సరఫరా ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు ఉదయం, మరికొన్నిసార్లు సాయంత్రం లేకపోతే రాత్రి8 గంటల తరువాత విద్యుత కోత విధిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో కరెంట్‌ కోతకు వేళాపాళా ఉండడంలేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతు న్నారు. నిలోఫర్‌, పేట్ల బురుజు, సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రిల్లో నూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాతకాలం నాటి వైరింగ్‌తో ఇబ్బందులు నెలకొంటు న్నాయి. తాత్కాలిక మరమ్మత్తులు చేయిస్తున్నారే... తప్ప కొత్తగా వైరింగ్‌ చేయడం లేదు. 

ఉస్మానియాలో ఓపీ టైమ్‌లోనే ల్యాబ్‌ పరీక్షలు 

అత్యవసర కేసుల్లో అవస్థలు జూ 24 గంటల ల్యాబ్‌ సదుపాయం ఏదీ..? 

ఉస్మా నియా ఆస్పత్రిలో ల్యాబ్‌ పరీక్షలకు రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రక్తపరీక్ష కోసం రోగులు పరుగులు పెట్టాల్సిందే. మధ్యాహ్నం ఓపీ సమయం దాటితే ఇక ఇంటికి వెళ్లా ల్సిందే. ఉస్మానియాలో మధ్యాహ్నం 2 గంటలు దాటితే ల్యాబ్‌కు తాళం పడుతోంది. ఓపీ సమయంలోనే ల్యాబ్‌ పనిచేస్తోంది. తరువాత పరీక్షలకోసం ప్రైవేట్‌కు పరుగు తీయాల్సిన దుస్థితి నెలకొంది.

ఓపీకి నిత్యం 2 వేల రోగులు 
ఉస్మానియాలో ప్రతిరోజు 2 వేల మంది ఔట్‌ పేషెంట్లు, 12 వందల మంది ఇన్‌ పేషెంట్లు చికిత్సలు పొందుతుంటారు. పాత భవనంలోని వెనక భాగంలో ఎండోస్కోపీ, డయాలసిస్‌ తదితర వ్యాధినిర్ధారణ పరీక్షలు జరుగుతుంటాయి. వీటితోపాటు కలర్‌ డాప్లర్‌, ఈసీజీ వంటి పరీక్షలకు రోగులు ఆయా విభాగాలకు వెళ్లాల్సివస్తుంది. వీరం దరికీ 12 గంటల లోపు వస్తేనే చేస్తారు.
అత్యవసర కేసుల్లో అంతే... 
ఉస్మానియా ఆస్పత్రికి అత్యవసర కేసుల వారికి వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరు. ఈరోజు అడ్మిట్‌ అయితే మరుసటి రోజేచేస్తారు. రోడ్డు ప్రమా దాల్లో గాయాలపాలై, వచ్చినవారి పరిస్థితి మరింతఘోరంగా ఉంది. అవసరమైతే వీరిని ప్రైవేటు ల్యాబ్స్‌కు పంపిస్తుంటారు. ఇక ఉస్మానియాలో సీటిస్కాన్‌ ఎప్పుడు పాడవుతుందో తెలియని పరిస్థితి.
అంతా గందరగోళం
ఉస్మానియాలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేస్తారో ఎవరికీ తెలియదు. ఈ ఆస్పత్రిలో మూడు భవనాలు ఉండడంతో ఏ పరీక్షలు ఎక్కడ చేస్తారో చెప్పే వారు లేరు. బోర్డులు కనిపించవు, ఆస్పత్రి బయట బోర్డులు ఏర్పాటు చేసినప్ప టికీ అవి ఎవరికీ కనిపించే దారిలో పెట్ట లేదు. దీంతో రోగులు, వారి కుటుంబీకులకు అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.  


ఎమర్జెన్సీ ల్యాబ్‌ ఎక్కడ...? 
ఉస్మానియాకు నిత్యం అనేక మంది క్షత గాత్రులు వస్తుంటారు. వీరికి అత్యవసరంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే 24గంటల ల్యాబ్‌ ఇక్కడ అవసరం. కానీ ఆ స్థాయిలో పనిచేసే ల్యాబ్‌ ఇక్కడలేదు. అటువంటి సదుపాయం ఇంతవరకూ కల్పించలేదు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అయినా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. 

No comments:

Post a Comment