మోదీ ప్రభుత్వం పై పెద్ద నోట్ల రద్దుకి సంబంధించి పెద్ద గొంతుతో ఆరోపణలు చేస్తున్న వారి విషయం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరి అసంతృప్తి, ఆగ్రహం ఇవాళ ఈ విషయంపై మాత్రమే వచ్చినవి కావు...
అసలు వీళ్ళకి మోదీ మొహమే నచ్చదు...
మోదీ కోటు నచ్చదు...
మోదీ పార్టీ నచ్చదు...
మోదీ పాలన నచ్చదు...
మోదీ విదేశీ పర్యటనలు నచ్చవు...
అయన పాకిస్థాన్ వెళ్లినా నచ్చదు...
పాకిస్థాన్ పై యుద్ధం చేసినా కూడా నచ్చదు...
స్వచ్ఛభారత్ అన్నా నచ్చదు...
స్వచ్ఛ పరిపాలన అన్నా నచ్చదు ...
గంగా ప్రక్షాళన అన్నా నచ్చదు ...
అసలు మోదీ గెలవడమే వీరికి నచ్చలేదు...
కానీ ఏం చేస్తారు పాపం..! అందుకే మోదీ ఏం చేసినా అన్నిటికీ అసహనమే...
మోదీ పాలన చేపట్టి రెండున్నరేళ్లు దాటింది. ఈ కాలంలో ఏనాడైనా ఈ వ్యక్తులు ఆయన పాలనని, బాటని, మాటని మెచ్చుకున్న సందర్భం కనీసం ఒక్కటైనా ఉందా? వీళ్ళకి దేశ ప్రయోజనాల కంటే మోదీ ని విమర్శించడం పైనే మక్కువ...
ఎప్పుడూ మెచ్చని వారు ఇవాళ తిడితే మాత్రం మోడీకి పోయేదేమిటి? ప్రభుత్వానికి ఊడేది ఏమిటి? మంచిని మంచిగా చెడును చెడుగా చూసి ఇస్యూ బేస్డ్ గా స్పందించే వాళ్లయితే సీరియస్ గా తీసుకోవాలి...
కానీ వీళ్ళు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఇతరత్రా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు.. లేదా ప్రత్యేకించి ఒక మతానికో వర్గానికో చెందిన వాళ్ళు.. అదే ఐడియాలజీతో నడిచే మీడియాలు.. వీళ్ళకి మోదీ ఉమ్మడి శత్రువు. బిజెపి అంటే వీళ్ళకి ఎలర్జీ. దేశం బాగుపడితే వీళ్ళకి గ్యాస్ట్రిక్. అందుకే వీళ్ళు అదే పనిగా మోదీ చర్యలపై విషం కక్కుతూ ఉంటారు...
మోదీ అసాధారణ చర్య వల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయిన వాళ్ళు కూడా ఈసారి వీరికి తోడయ్యారు. అందుకే ఈ హంగామా. నిజం చెప్పాలంటే వీళ్ళు మోదీని ఎంత గట్టిగా తిడితే మోదీ అంత బాగా పని చేసినట్టు.. వీళ్ళకి ఎంత కాలితే అంత కరెక్ట్ గా ఆయన విధానాలు అమలవుతున్నట్టు భావించాలి...
అయితే ఒక్కటి నిజం.. ఈ 30 రోజులుగా అనేకమంది వృద్ధులు, పింఛనర్లు కూడా ఏటీఎం ల వద్ద, బ్యాంకు ల్లో పలు ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండాలసింది. అలాగే వివాహాలు, వైద్య ఖర్చులకు సొమ్ము తగినంత, సకాలంలో అందక ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిల్చిన వారికి సెల్యూట్ చేయాలి...
మూడేళ్లు కావస్తున్నా మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేక అజీర్తి రోగంతో చచ్చిపోతున్న రాజకీయ పార్టీలు, వక్ర మేధావులు చివరికి మోదీ మంచోడే కానీ... వాడు చెడ్డాడు, వీడు అవినీతి పరుడు అంటూ బురద జల్లడానికి దొడ్డిదారి వెదుక్కుంటున్నాయి. నిర్ణయం మంచిదే కానీ ఏ ఇబ్బందీ లేకుండా రెడీమేడ్ గా పని జరిగిపోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు...
ఈ ప్రభుత్వం బాగా పని చేస్తోంది అని ఎవరైనా చిన్న మాట అన్నా చాలు అస్సలు తట్టుకోలేక పోతున్నాయి. ఒక్కొక్కడూ అవినీతి అక్రమార్జనలతో తెగ బలిసిపోయిన వాళ్ళు ఇవాళ అవినీతి నిర్మూలనకు ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారు.. ఇది కేవలం జనం దృష్టి డైవర్ట్ చేయడానికే. ఎందుకంటే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యాకా ఇక వీరికి మాట్లాడే ఛాన్స్ ఉండదు కదా...
అదీ అసలు భయం. నిజంగా ప్రజలపై ప్రేమే అయితే ప్రధాని చెప్పిన గడువు వరకూ వేచి ఉంది ఆ తర్వాత ఆరోపణలు చేయాలి. కానీ వీళ్ళు నవంబర్ తొమ్మిది నుంచే దాడి ప్రారంభించారంటే దురుద్దేశాలే అందుకు కారణం. మనం అలా దిగజారకూడదు.. డిసెంబర్ 30 దాటేవరకూ చూద్దాం .. ఆ తర్వాత కూడా పరిస్థితి ఇలాగె ఉంటే, ఈ ప్రయోగం విఫలం అని తేలితే అప్పుడు పరిస్థితి పూర్తిగా సమీక్షించి యుద్ధం చేద్దాం. ఇది బాధ్యత కలిగిన పౌరుడి పని అని నా అభిప్రాయం. అప్పటివరకూ ఆగినందువల్ల నష్టం గానీ.. ఈలోపే విమర్శలు గుప్పించినందువల్ల లాభం గానీ ప్రత్యేకంగా ఉండవనేది తెలిసినదే...
(Deekshitula Subrahmanyam)
(Deekshitula Subrahmanyam)
No comments:
Post a Comment