UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 22 March 2015

సీమాంధ్ర గ్రామీణ ప్రాంతాలలో భుజంపై వేసుకునే కండువా గౌరవ చిహ్నంగా ఉంటుంది. అటువంటి కండువాను తీసి కిందపెట్టడం అనేది గౌరవాన్ని కోల్పోతున్నామని భావించడంతో పాటు అవమానానికి చిహ్నంగా భావిస్తారు. కండువాను కిందపెట్టి వెళ్లిపోవడం అంటే అవమాన భారంతో నిష్క్రమించడం అన్న మాట! తెలంగాణలో అయితే తలపాగా తీసి కిందపెడతారు.

వైఛీపీ.. అగ్లీ సీన్స్‌!

రోజా తాను స్త్రీ  అన్న విషయం కూడా మర్చిపోయారు. ఆమె వాడిన బూతులు విన్న విలేకరులు కూడా సిగ్గుతో చచ్చిపోయారు. రేప్‌ వంటి పదాలు కూడా వాడారేంటి మేడమ్‌ అని ప్రశ్నించిన విలేకరిని ‘‘ఏం నువ్వు రేప్‌ చేస్తావా?’’ అని అన్నారంటే ఆమె ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. తొలి రోజు పచ్చి పచ్చిగా మాట్లాడిన రోజా రెండో రోజు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా బొల్లి వ్యాధి ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఉండకూదని పల్లదనం పోయారు. ఆమెను అదుపు చేయడానికి ప్రయత్నించవలసిన ప్రతిపక్ష నాయకుడైన జగన్‌, బహుశా ‘‘శభాష్‌’’ అని అభినందించి ఉంటారు. మొత్తంమీద సందర్భ శుద్ధి లేకుండా చేసిన యాగీ వల్ల పోయింది వైసీపీ పరువే!
                            అదో ఉత్కంఠభరిత సన్నివేశం. సభలో ఏం జరగబోతోందా? అని అధికార, ప్రతిపక్ష సభ్యులు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి నిరసన ఇంత హుందాగా తెలపవచ్చునా? అని ఆశ్చర్యపోయారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎన్‌.టి.రామారావు ఈ విషయాన్ని రుజువు చేశారు. 1989 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. తొలి ఏడాది సాఫీగానే జరిగిపోయింది. ఆ తర్వాత నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా చెన్నారెడ్డి నియమించారు. అప్పటి నుంచి ఆమె ఏవో వ్యాఖ్యలు చేస్తూ ఎన్టీఆర్‌ను చికాకు పెట్టేవారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి శాసనసభకు ఎన్నికైన రాజకుమారి 1984 ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓడిపోయిన ఆమె, 1989కి ముందు కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచారు. ఈ నేపథ్యంలో గత వైరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె తరచుగా ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలు చేసేవారు. ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఎన్టీఆర్‌ ససేమిరా అన్నారు. వాదోపవాదాలు సాగుతుండగానే ఎన్టీఆర్‌ వడివడిగా స్పీకర్‌ స్థానం వైపు నడుచుకుంటూ వెళ్లడం మొదలెట్టారు. ఆయన ఏమి చేయబోతున్నారో తెలియక కాంగ్రెస్‌ సభ్యులతో పాటు తెలుగుదేశం సభ్యులు కూడా హడలెత్తిపోయారు. అప్పటి స్పీకర్‌ పి.రామచంద్రారెడ్డి కూడా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఎన్టీఆర్‌ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ స్పీకర్‌ స్థానాన్ని చేరుకొని తన భుజంపై ఉన్న కండువాను అధ్యక్ష స్థానం ముందున్న టేబుల్‌పై ఉంచి అంతే వేగంగా తన స్థానంలోకి వచ్చి నిలబడి ‘‘నన్ను అవమానించిన ఈ సభకు రేపటి నుంచి రాను’’ అని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ ఈ నిర్ణయం తీసుకుంటారన్న విషయం తెలుగుదేశం సభ్యులెవరికీ తెలియదు. సభలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆగ్రహించిన ఎన్టీఆర్‌ చివరికి ఎంతో హుందాగా తన నిరసన వ్యక్తంచేశారు. సభలో అంత హుందాగా కూడా నిరసన వ్యక్తంచేయవచ్చునని ఇప్పటి మన ప్రజాప్రతినిధులెందరికి తెలుసు? సీమాంధ్ర గ్రామీణ ప్రాంతాలలో భుజంపై వేసుకునే కండువా గౌరవ చిహ్నంగా ఉంటుంది. అటువంటి కండువాను తీసి కిందపెట్టడం అనేది గౌరవాన్ని కోల్పోతున్నామని భావించడంతో పాటు అవమానానికి చిహ్నంగా భావిస్తారు. కండువాను కిందపెట్టి వెళ్లిపోవడం అంటే అవమాన భారంతో నిష్క్రమించడం అన్న మాట! తెలంగాణలో అయితే తలపాగా తీసి కిందపెడతారు. అంతటి గొప్ప సన్నివేశాలకు సాక్షీభూతమైన ఏపీ శాసనసభ ఇప్పుడు అగ్లీ సన్నివేశాలకు వేదిక అవుతోంది. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి గురువారంనాడు తనకు తగినంత సమయం ఇవ్వడం లేదంటూ సభలో నిరసన వ్యక్తంచేసి సభ నుంచి వెళ్లిపోయారు. అయితే సభ నుంచి నిష్క్రమించే ముందు అందరికీ నమస్కారాలు చేసిన జగన్మోహన్‌ రెడ్డి, బయటకు వెళ్లే సమయంలో మాత్రం అధికారపక్షం వైపు చేతులు విసురుతూ ఆగ్రహంతో పాటు ఛీత్కారం ప్రదర్శించారు.
 ఇంత బరి తెగింపా?
ఏపీ శాసనసభలో బుధ, గురువారాల్లో చోటుచేసుకున్న సంఘటనలు చూసిన ప్రజాస్వామ్య ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా సభ్యులు మాత్రం తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. ప్రతిపక్ష వైసీపీ సభ్యుల వ్యవహార శైలి ‘మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా’ ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు కవ్వించుకోవడం చట్టసభలలో సర్వసాధారణం. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పీకర్‌గా ఉండేవారు. ఉభయులూ కలిసి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని రెచ్చగొడుతుండేవారు. చంద్రబాబు కూడా వారి ట్రాప్‌లో పడిపోతుండేవారు. ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి సభలో పూర్వ అనుభవం లేదు. దానికి తోడు ఆయనపై నమోదైన అవినీతి కేసులు న్యాయస్థానం విచారణలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్‌రెడ్డిని ఆట పట్టించడానికి అధికారపక్షం సహజంగానే ప్రయత్నిస్తుంది. ఈ పరిణామాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించే బదులు జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి బాటలోనే ఎదురుదాడికి దిగుతున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పునే ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం చేపట్టారు. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై ఆకర్షితులైన ప్రజలు అందులో జరుగుతున్న అవినీతిని పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని గమనించని చంద్రబాబు నాయుడు జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై సభను స్తంభింపజేయడానికి ప్రయత్నించేవారు. ప్రజలకు పట్టని అంశాన్ని చేపట్టడం వల్ల ఆయనకు రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అధికారాన్ని కోల్పోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఉడుకుమోత్తనంతో వ్యవహరిస్తున్నారనీ రాజశేఖర్‌ రెడ్డి ప్రభృతులు చేసిన విమర్శలను ప్రజలు కూడా విశ్వసించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి తగినంత వ్యవధి ఇవ్వకుండా విమర్శలు చేయడం వల్ల ఆనాడు చంద్రబాబుకు నష్టం జరిగింది. జలయజ్ఞంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకున్నా రాజశేఖర్‌ రెడ్డి తప్పించుకోగలిగారు. సీన్‌ కట్‌ చేస్తే, ఇప్పుడు రాజశేఖర్‌ రెడ్డి తనయుడైన జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్న ధీమాతో ఎన్నికలకు వెళ్లిన జగన్‌, ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేకపోతుండవచ్చు! అందుకే కాబోలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను తిరగతోడతానని ఇప్పటి నుంచే చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఆదిలో ఇలానే మాట్లాడేవారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ ‘‘నేను అధికారంలోకి వచ్చి’’ అని చెప్పుకోవడం వల్ల జగన్మోహన్‌ రెడ్డి అపహాస్యం పాలవుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలతో సంబంధం లేకుండా జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాజధాని కూడా లేకుండా ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంలో తాము ఉన్నామని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై భారతీయ జనతా పార్టీపై ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంతో కొంత సానుభూతితో ఉన్నారు. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ర్టాన్ని గట్టెక్కించడానికి, రాజధాని నిర్మాణానికి చంద్రబాబు కష్టపడుతున్నారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఈ భావన ఉండి ఉండకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజల్లో ఈపాటికే వ్యతిరేకత వచ్చి ఉండేది. ఎందుకంటే రైతుల రుణమాఫీని పాక్షికంగా అమలుచేసిన ఆయన, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఎన్నికల సందర్భంగా అడిగిన వారికి, అడగని వారికి ఆయన హామీలు ఇచ్చారు. రుణమాఫీ జరగకపోయినా ప్రజల్లో అంతగా ఆగ్రహం లేదు. మిగతా హామీల గురించి అడిగే పరిస్థితి అసలే లేదు. దీనికంతటికీ ప్రధాన కారణం- రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తమకు అన్యాయం చేయగా, ఇప్పుడు బీజేపీ అన్యాయం చేస్తోందని ఏపీ ప్రజలు భావించడమే! ఈ పరిణామం చంద్రబాబుకు కలిసి వచ్చింది. రాష్ర్టాన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయకుండా తన కాళ్లు, చేతులు కట్టివేసిందని చంద్రబాబు చేసిన ప్రకటన ప్రజలపై ప్రభావం చూపింది. ఫలితంగా చంద్రబాబు సమర్థతపై నమ్మకం ఉన్న ప్రజలు, హామీల అమలు గురించి ఆయనను నిలదీయడం లేదు. ఏపీ ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్‌ రెడ్డి దూకుడు పెంచారు. మాట్లాడటానికి తనకు తగినంత సమయం ఇవ్వకపోతే సభలో అగ్లీ సీన్స్‌ చూస్తారని తొలి రోజే ఆయన వ్యాఖ్యానించారు. పరిణతి కలిగిన ప్రతిపక్ష నాయకుడెవ్వరూ ఈ వ్యాఖ్యలు చేయరు. బిజినెస్‌ అడ్వయిజరీ సమావేశంలో హెచ్చరించినట్టుగానే బుధ, గురువారాలలో సభలో అగ్లీ సీన్స్‌ చోటుచేసుకున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి తన సభ్యులను స్వయంగా రెచ్చగొట్టి మరీ వెల్‌లోకి పంపడాన్ని మనం టీవీలలో చూశాం. సభలో ఎవరెంత విచ్చలవిడిగా వ్యవహరిస్తే వారికి అన్ని ఎక్కువ మార్కులు ఇస్తానని సమావేశాలకు ముందు తమ నాయకుడు తమకు సూచించారని వైసీపీకి చెందిన ఒక శాసనసభ్యుడు చెప్పారు. దీనిని బట్టి సభలో చోటుచేసుకున్న దూషణల పర్వం క్షణికావేశంలో చోటుచేసుకున్నది కాదని స్పష్టమవుతోంది. గతంలో కూడా పలువురు శాసనసభ్యులు నోరు జారేవారు. అయితే వారితో ఆ తర్వాత క్షమాపణ చెప్పించేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడానికి ఏపీ శాసనసభలో పెద్ద మనుషులే లేకుండా పోయారు. ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవారే. కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యమే లేదు. ఫలితంగా ‘‘మీరు చేసింది- చేస్తున్నది తప్పు’’ అని చెప్పేవారు కనబడటం లేదు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదుపు తప్పారు. తన ప్రసంగానికి అడ్డు తగులుతున్న వైసీపీ సభ్యుల్ని మందలించే క్రమంలో ఆయన పరిధి దాటారు. బుధ, గురువారాల్లో చోటుచేసుకున్న అగ్లీ సీన్స్‌ విషయానికొస్తే, ‘నభూతో నభవిష్యతి’ అని చెప్పవచ్చు. తాము శాసనసభలో ఉన్నామో వీధుల్లో ఉన్నామో తెలియనంతగా ప్రతిపక్ష సభ్యులు నోరు పారేసుకున్నారు. గతంలో సభాపతిని ఏమైనా అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. అధికార- ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా తమ చిత్తశుద్ధిని శంకిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి వారు సంసిద్ధులయ్యేవారు. గతంలో స్పీకర్‌గా పనిచేసిన పి.రామచంద్రారెడ్డి ఒక సందర్భంలో పదవి నుంచి తప్పుకొంటానని కన్నీళ్ల మధ్య ప్రకటించారు. తనకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా అధికార పక్షానికి చెందిన ఒక సభ్యుడు వ్యాఖ్యానించినందుకు మనసు కష్టపెట్టుకున్న ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చొని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే సభలో ఉన్న మిగతా పక్షాల నాయకులు జోక్యం చేసుకుని, వ్యాఖ్యలు చేసిన ఆ సభ్యుడిని మందలించి స్పీకర్‌ని పదవిలో కొనసాగవలసిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం నుంచి తమపై ఒత్తిళ్లు వచ్చిన సందర్భాలలో కూడా పదవి నుంచి తప్పుకొంటామని గతంలో స్పీకర్లుగా పనిచేసిన పలువురు అప్పటి ముఖ్యమంత్రులకు హెచ్చరికలు పంపేవారు. అందుకే కాబోలు ‘గత కాలం.. వచ్చు కాలం కన్నా మిన్న’ అని అంటారు. వైసీపీకి చెందిన రోజా, కొడాలి నాని వంటివారు రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే వారిని అనేకంటే అటువంటి వాళ్లని ఎన్నుకున్న ప్రజలను అనాలనిపిస్తుంది. ‘యథా ప్రజా తథా రాజా’ అంటే ఇదే కాబోలు. రోజా తాను సీ్త్రని అన్న విషయం కూడా మర్చిపోయారు. ఆమె వాడిన బూతులు విన్న విలేకరులు కూడా సిగ్గుతో చచ్చిపోయారు. రేప్‌ వంటి పదాలు కూడా వాడారేంటి మేడమ్‌ అని ప్రశ్నించిన విలేకరిని ‘‘ఏం నువ్వు రేప్‌ చేస్తావా?’’ అని అన్నారంటే ఆమె ఎంతగా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ‘‘ఒరేయ్‌ ..రేయ్‌ ..పాతేస్తా’’ వంటి వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కనీసం తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తంచేశారు. తొలి రోజు పచ్చి పచ్చిగా మాట్లాడిన రోజా రెండో రోజు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా బొల్లి వ్యాధి ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఉండకూదని పల్లదనం పోయారు. ఆమెను అదుపు చేయడానికి ప్రయత్నించవలసిన ప్రతిపక్ష నాయకుడైన జగన్‌, బహుశా ‘‘శభాష్‌’’ అని అభినందించి ఉంటారు. మొత్తంమీద సందర్భ శుద్ధి లేకుండా చేసిన యాగీ వల్ల పోయింది వైసీపీ పరువే!
మన్ననలు మనకెందుకులే అన్నట్టు...
రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా రాష్ర్టాన్ని విభజించి ఏపీలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొనడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తప్పటడుగులు వేస్తూనే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం ప్రారంభించింది. ఇందులో భాగంగా తాము అధికారంలో ఉన్నప్పుడు విభజిత ఏపీకి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని లోక్‌సభలో తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ప్రశ్నింపజేసింది. సోనియాగాంధీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యంగా జవాబు ఇచ్చి ఉండవచ్చు కానీ, చేసిన తప్పు ఏదో చేశాం. కనీసం ఇప్పుడైనా దిద్దుబాటు కోసం ప్రయత్నిస్తున్నామని ప్రజలు తమను నమ్మేలా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభలో సమాధానం ఇస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్‌, తెలుగుదేశం సభ్యులు హామీల అమలు కోసం పట్టుపట్టారు. ఏపీలో తమ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకోవడానికి అందివచ్చిన అవకాశాన్ని ఏపీ కాంగ్రెస్‌ నాయకులు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలను కలిపి వారు నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొడుతున్నారు. నేను గతంలోనే పేర్కొన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుంటే ఆ మాత్రం సహాయం కూడా లభించే అవకాశం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైజం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మనసుని నొప్పించకుండా సహాయం పొందడంపై దృష్టి కేంద్రీకరించారు. మోదీ విషయంలో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ గుర్తుచేసుకుందాం. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు ప్రధానమంత్రిని కలిసి రాష్ర్టానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రధానమంత్రికి అందజేయవలసిన వినతిపత్రం రూపకల్పనపై పలు దఫాలుగా అధికారులతో చర్చించి మార్పులు చేర్పులు సూచించారు. చివరికి తుది కాపీ సిద్ధమైంది. అయితే ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మూడంటే మూడు సీట్లకు పరిమితం అయినట్టు తుది ఫలితాల తర్వాత వెల్లడైంది. దీంతో చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు. కారణం ఏమిటంటే ఢిల్లీ ఫలితాలు ప్రధానమంత్రిని నిరాశకు గురిచేసి ఉంటాయి కనుక ఈ పరిస్థితుల్లో వెళ్లి సహాయం చేయమని కోరితే అపార్థం చేసుకునే ప్రమాదం ఉందని అధికారుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారట. ఇలా చేయడాన్ని భయపడటం అని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తే అది వారిష్టం. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలం కావాలనే కాంగ్రెస్‌ కోరుకుంటుంది. అది తప్పు కూడా కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో సున్నం పెట్టుకుంటే ఏపీ పరిస్థితి ఏమవుతుందో తెలుసు కనుక చంద్రబాబు నాయుడు వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నారు. మరో రెండు మూడేళ్లపాటు ఇదే విధంగా అణకువగా ఉన్నా కేంద్రం నుంచి సహాయం లభించని పక్షంలో ఇదే చంద్రబాబు నాయుడు గొంతు ఎత్తుతారు. ఎందుకంటే రాజకీయంగా అప్పటికి ఆయనకి అది అవసరం కనుక. రాజకీయాల్లో మిత్రత్వమైనా, శత్రుత్వమైనా అవసరాలను బట్టి మాత్రమే ఉంటాయి. కాంగ్రెస్‌ పార్టీ తమపై కాలుదువ్వడంతో పాటు ప్రజల్లో కూడా తమపట్ల వ్యతిరేకత ఏర్పడిన విషయాన్ని గుర్తించిన బీజేపీ ఏపీ నాయకులు మూకుమ్మడిగా ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ర్టానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇవన్నీ ప్రజలను మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలే! ఏ పార్టీ అయినా ప్రజల మన్ననలు పొందడానికే కృషి చేస్తుంది. ఈ విషయంలో వైసీపీకి మినహాయింపు ఇవ్వాలేమో తెలీదు. ఎందుకంటే ఏపీ ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్న అంశాలు వారి ఎజెండాలో లేవు. వాస్తవానికి కాంగ్రెస్‌తో పోలిస్తే వైసీపీయే అధిక రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించారన్న కోపం కాంగ్రెస్‌ పార్టీపై ఏపీ ప్రజల్లో ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించవలసిన వైసీపీ అప్రధాన అంశాలను పట్టుకొని అసెంబ్లీలో రభసకు శ్రీకారం చుట్టింది. పట్టిసీమపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని కళ్లు బైర్లు కమ్మేలా దెబ్బకొడతానన్న జగన్మోహన్‌ రెడ్డి, ఆ అంశం చర్చకు వచ్చినా ఏమీ చేయలేకపోయారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని కడిగి పారేస్తానని సవాల్‌ చేశారు. ఆ ముచ్చట కూడా తీరింది. గంటసేపు ప్రసంగించి కూడా ఆయన కడిగిందీ లేదు, అధికార పక్షం కడిగించుకున్నదీ లేదు. చివరకు సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన పార్టీ సభ్యులే మకిలి అంటించుకున్నారు. తోటి రాజకీయపక్షం ఎలా వ్యవహరిస్తున్నదీ, ఏ అంశాలను చేపట్టిందీ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డికి అవేమీ పడుతున్నట్టు లేదు. దురదృష్టం ఏమిటంటే మంచి చెడుల గురించి ఆయనకు చెప్పేవారు ఎవరూ ఆ పార్టీలో ఉన్నట్టు లేరు. జగన్మోహన్‌ రెడ్డి ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే ఆయన స్వయం ప్రకాశితుడు కాదన్నది. రాజశేఖర్‌ రెడ్డిపై ఉన్న అభిమానంతో ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆయనకు ఓట్లు వేశారు- అండగా నిలబడ్డారు. రాజశేఖర్‌ రెడ్డి కొడుకు అయి ఉండని పక్షంలో రాజకీయాలలో ఆయన చెల్లని నాణెం అయ్యేవారు. ఒక వ్యూహం అంటూ లేకుండా అయినదానికీ, కానిదానికీ ఎదురుదాడికి దిగుతూ అదే తమ వ్యూహం అంటూ ముందుకు సాగుతున్న జగన్‌, రాజకీయాలలో ఇంకా చెల్లుబాటు అవుతున్నారంటే రాజశేఖర్‌ రెడ్డి చలువే! ఈ వాస్తవాన్ని జగన్మోహన్‌ రెడ్డి తెలుసుకుంటే ఆయనకే మంచిది!

No comments:

Post a Comment