హైదరాబాద్ : ఏడు పదుల వయసులోనూ సైక్లింగ్.. స్విమ్మింగ్, రన్నింగ్ పోటీల్లో చురుగ్గా రాణిస్తున్నాడు. పోటీల్లో అందరికంటే.. ముందుంటూ వాహ్ అనిపిస్తున్నాడు. ప్రశంసలూ అందుకుంటున్నాడు. యువతను ప్రోత్సహించడానికి నగదు అందజేస్తూ అందరికీ ఇన్స్పైర్గా నిలుస్తున్నాడు. ఇంతకి ఎవరీ క్రీడాకారుడు అనుకుంటున్నారా..? నగరశివారు కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి. పదుల సంఖ్యలో యువతీ, యువకులు పోటీలలో పాల్గొన్నా అధైర్య పడకుండా వారిని ప్రోత్సహిస్తూనే సునాయసంగా గెలుస్తున్నాడు. దీనికంతటికి కారణం వ్యాయామం, మితాహారం తీసుకోవడమేనని చెబుతున్నాడు. విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించినట్లయితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు సూచిస్తున్నాడు. ఇందులో భాగంగానే నగర శివారులో అనేక స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు. ప్రతిభ కలిగి నిరుపేదలెందరికో ఉచితంగా విద్యనందిస్తున్నాడు.
సాధించిన విజయాలు
* గతేడాది జూన్లో జరిగిన రన్నింగ్ పోటీలలో ప్రతిభ కనబర్చి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు.
* ఏటా గచ్చిబౌలి నుంచి మెదక్ వరకు జరిగే సైకిల్ పోటీలలో పాల్గొంటుండడంతో జాతీయ స్థాయి పరుగు పందెంలో అవకాశం లభించింది.
* నగరంలో పర్యావరణ పరిరక్షణ, క్రీడలు వంటి అవగాహన సదస్సులకు హాజరై యువతను చైతన్య పర్చడం అతని నైజం.
No comments:
Post a Comment