ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, తమిళంలో సూపర్ మెలోడీ అందించలేదన్న అసంతృప్తి ఇన్నాళ్లూ ఉండేదని, ‘పులి’లో విజయ్, శ్రుతిహాసన్ పాడిన ‘ఏండీ.. ఏండీ...’ పాటతో ఆ బాధ తీరిపోయిందని చెప్పారు. ఈ చిత్రంలో బాణీలు కట్టడానికి దర్శకుడు శింబుదేవన్ గీసిన స్కెచ్లు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. ఆయన ఆర్టిస్టు కూడా కావడంతో నటీనటులు ఆహార్యాలు ఎలా ఉంటాయో స్కెచ్ వేసి చూపించేవారని, వాటిని చూసే పాటలు కంపోజింగ్ చేశానన్నారు. ఇక డ్రీమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పులి’లో ఇంతమంది స్టార్లు నటించడానికి కథే కారణమని దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు పీటీ సెల్వకుమార్, శిబు తమీమ్, దర్శకుడు శింబు దేవన్, సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యన్, కళా దర్శకుడు ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ కమల్కన్నన్లు పాల్గొని, ‘పులి’లో తమ అనుభవాలను పంచుకున్నారు.
No comments:
Post a Comment