UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 1 August 2015

ఆదాయం కాదు.. ప్రాణాలే ముఖ్యం

  • నూతన ఆబ్కారీ విధానం లక్ష్యమిదే
  • మంచి కల్లు అందుబాటులోకి..
  • చెరువుల కింద ఈత మొక్కలు
  • అక్రమ సారా.. నాన్‌ పెయిడ్‌
  • మద్యం రవాణాకు కళ్లెం: సీఎం
హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గుడుంబాను సమూలంగా నిర్మూలించే విధంగా నూతన ఆబ్కారీ విధానాన్ని ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అక్టోబర్‌ నుంచి నూతన ఆబ్కారీ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానం అత్యంత ఆచరణాత్మకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని సీఎం నిర్దేశించారు. ముఖ్యంగా, ఆదాయంపై కాకుండా ప్రజలకు హాని తలపెట్టని విధంగా నూతన విధానాన్ని గట్టిగా అమలు చేయాలన్నారు. ‘‘కాయకష్టం చేసిన ప్రజలు సేద తీరడం కోసం కొంత మద్యం తీసుకొంటారు. అలాంటివారి ఆరోగ్యానికి, ప్రాణానికి హాని తలపెట్టని రీతిలో మద్యాన్ని అందించాల్సి ఉంది. దానికి అవసరమైన విధానాన్ని రూపొందించాలి’’అని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఆబ్కారీ విధానం పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు రూ. 28వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ సంక్షేమంగా ఉండాల్సిన ప్రజలు గుడుంబా బారినపడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఆబ్కారీ విధానం అమల్లో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గుడుంబా కారణంగా ఇంటి యజమానులు మృత్యువాత పడడం వల్ల మహిళలు చిన్నతనంలోనే వితంతువులుగా మారుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గుడుంబాను పూర్తిగా లేకుండా చేయడానికి అవసరమైన విధానాన్ని ఖరారు చేయాల్సి ఉన్నదన్నారు. దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని, నూతన విధానం రూపకల్పనలో ఈ విషయాన్నీ జ్ఞప్తిలో ఉంచుకోవాలన్నారు.
సివిల్‌తో ఎక్సైజ్‌ సమన్వయం
గ్రామాల్లో అక్రమసారా తయారీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్న నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యానికీ కళ్లెం వేయాలని ఆదేశించారు. ఇదంతా జరగాలంటే ఆబ్కారీ శాఖను బలోపేతం చేయాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. దానికోసం ‘‘ఎక్సైజ్‌ శాఖకు సివిల్‌ పోలీసుల సహకారం అందిస్తాం. దీనిపై త్వరలో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేద్దాం’’ అని తెలిపారు. తెలంగాణలో ప్రజలకు మంచి కల్లుని అందుబాటులో ఉంచాలని సూచించారు. వచ్చే ఏడాది నాటికి అన్నిచెరువుల వద్ద సుమారు 5 కోట్ల ఈత మొక్కలు పెంచాలని, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటుచేసుకోవాలని నిర్దేశించారు. సమర్థ పర్యవేక్షణ కోసం.. ఎక్సైజ్‌ శాఖకు ప్రత్యేకంగా ఇద్దరు డీఎ్‌ఫఓలను కేటాయించనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో మంత్రి పద్మారావు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా, చంద్రవదన్‌ పాల్గొన్నారు.

No comments:

Post a Comment