ఇరవై తొమ్మిదవ రోజుకు చేరిన జి పి కార్మికుల సమ్మె
మోత్కూర్ : గ్రామ పంచాయితీలో పని చేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయితీ వర్కర్స్ యునియన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె బుధ వారం నాటికి ఇరవైతోమ్మిదవ రోజు కు చేరుకుంది.. గ్రామ పంచాయితీలో యస్ సి, బి సి , మైనరిటిలు పనిచేస్తున్నారని, అతి తక్కువ వేతనాలతో కుటుంబాలు వీడిన పడుతున్నాయని, పెరిగిన దరలకు అనుగుణంగా కనీస వేతనం పది హేను వేలు ఇవ్వాలని, . అర్హులైన వారికి గ్రామపంచాయితీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని సి ఐ టి యు మండల కార్యదర్శి మెంట. ఎల్లయ్య డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.. ఈ సమ్మెలో గ్రామ పంచాయితీ మండల అద్యక్ష కార్యదర్శులు హెచ్ ఎన్ చారి, పి.బంగారు, కె.శాంతమ్మ, మెంట .యాదగిరి, బుర్ర రాము, బుర్ర సంతు, బుర్ర రాంబాబు, పి.లక్ష్మి నర్సయ్య , బి వెంకటయ్య, కె.లక్ష్మి, లింగమ్మ, సోమనర్సయ్య, కె.ముత్తమ్మ, యం.ఐలయ్య, టి.యాదయ్య, కె.ఎల్లయ్య, సి హెచ్ యాదగిరి, వి.లింగయ్య, యం.మొగులయ్య, డి.కిష్టయ్య, జి.నర్సింహ, బి.మల్లయ్య, జి.వెంకన్న తదితరులు పాల్గోన్నారు
No comments:
Post a Comment