.
సంసారం లో భార్యా భర్త లిద్దరూ సమస్యల, కష్టాల రూపంలో అనేక పరీక్షల నెదుర్కొం టున్నప్పటికినీ, పురుషుడి కంటె స్త్రీయే ఎక్కువ ఓర్పును, నేర్పునూ ప్రదర్శించి అనుభవిస్తూ ఉంటుంది. అసలు ఈ ఆధునిక జీవితంలో సాధారణ గృహిణియే అష్ట కష్టావధానం చేస్తుంటుంది. ఆ సందర్భాన్ని మహా సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు ఎలా వర్ణించారో చూడంది.
.
సీ. అడుగడుగున నిషేధఆఙ్ఙ జారీచేయు - భర్త నిషిధ్ధాక్షరిగ దోప
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ - మాసమ్ము గడుప సమస్య కాగ
అది సర్దు మిది సర్దుమని చంపు కాన్వెంటు - దత్తుండు దత్త పదంబు కాగ
ముద్దులొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి - వర్ణనీయాంశమై వరలు చుండ
పాలు, కూరలు, పండ్ల బండ్ల వారల రాక - ఆశుధారా కవిత్వార్ధమనగ
అత్తయ్య వేసెడి అక్షింతలవి యన్ని - పాత పురాణంపు పఠనమనగ
.
పోనీని రానీని ఫోను మ్రోతల రోత - ఘంటికా గణనమ్ము కరణి దోప
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి - అధిక ప్రసంగమై అడ్డు పడగ
.
తే.గీ. దినము దినమిట్లు వనితలు తిప్పలుపడి - పూటపూట కు అవధాన పూర్ణ సిధ్ధి
తనరు చుండగ పురుషావధానులేల ? వర సహస్రావధానులీ పడతులెల్ల!!
.
No comments:
Post a Comment