తిరుమలలోని శ్రీవారికి ముస్లిమ్ భక్తుని విరాళం రూ.30లక్షలు
30-12-2015
తిరుమల, డిసెంబరు 30 : తిరుమలలోని శ్రీవారికి ఓ ముస్లిమ్ భక్తుడు రూ.30 లక్షల రూపాయల విరాళం అందించి వార్తల్లోకి ఎక్కారు. తిరుమల శ్రీవారి భక్తుడైన చెన్నైకు చెందిన అబ్దుల్ ఘనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.30 లక్షలు విలువచేసే లారీని విరాళంగా అందించారు. ఓ ముస్లిమ్ భక్తుడు టీటీడీకి విరాళం ఇవ్వడం ద్వారా మతసామరస్యాన్ని చాటారు. అబ్దుల్ ఘనీ గతంలోనూ తిరుపతిలోని శ్రీవారి ఆసుపత్రికి వైద్యపరికరాలు అందించి తన భక్తిని చాటుకున్నారు. టీటీడీకి విరాళం అందించిన అబ్దుల్ ఘనీని టీటీడీ అధికారులు సత్కరించారు.
No comments:
Post a Comment