భాగవతము --- పోతన
శ్రీహరి యందు భక్తీ శ్రద్దలు ఉన్నవారికి, కైవల్యము ప్రాప్తించునని. కాని శ్రీహరిని మదిని తలంచుచు ఇతరమైన కోరికలు కలిగిఉన్న అట్టివారు ఎన్నివిధముల ప్రయత్నించినను మోక్షప్రాప్తి కలుగదని శ్రీ శుకుడు పరీక్షిత్తుకు చెప్పుచున్నాడు..
లెక్కకు నెక్కువై కపటులేని మహాద్భుతతేజ మెల్లెడం
బిక్కటిలం జరింతు రతిభీమబలాడ్యులు, విష్ణుదూత లా
చక్కని ధర్మశాంతు లతిసాహసవంతులు దేవపూజితుల్
గ్రిక్కిరిసీ జగంబునను గేసనసేవకరాక్షణార్ధమై !
బిక్కటిలం జరింతు రతిభీమబలాడ్యులు, విష్ణుదూత లా
చక్కని ధర్మశాంతు లతిసాహసవంతులు దేవపూజితుల్
గ్రిక్కిరిసీ జగంబునను గేసనసేవకరాక్షణార్ధమై !
అజామిళుని దేహమును గొనిపొనీకుండా అడ్డుపడిన విష్ణు దూతలపై , యమదూతలు యమధర్మరాజుకు ఫిర్యాదు చేయగా , యమధర్మరాజు వారితో ఇలా చెప్పుచున్నాడు. లెక్కలేనంతమంది విష్ణు దూతలు కళంకములేక అద్భుత మైన తేజస్సుతో సంచరించు చుందురు. వారు అతి బలశారులు. వారు సుందరులైన ధర్మ మూర్తులు . శాంతస్వరూపులు, గొప్ప సాహస వంతులు. దేవపుజితులయిన ఆ విష్ణు దూతలు విష్ణు భక్తుల నెల్లప్పుడు కాపాడుటకు ఈ విశ్వమంతయు నిండిఉందురు .
నావలనను మీవలను
దేవాసుర గణము వలన ద్రిజగంబులలో
నేవగల బొందకుండగ
గావంగలవారు పుడమిగల వైష్ణువులన్
దేవాసుర గణము వలన ద్రిజగంబులలో
నేవగల బొందకుండగ
గావంగలవారు పుడమిగల వైష్ణువులన్
ఈ భూమిమీద విష్ణుభక్తులు, నావలనగాని,( యమధర్మరాజు వలన ) మీ వలన గాని ( యమదూతల వలన ) దేవాసురుల వలనగాని, ఏ విధమయిన బాధలు పడకుండా కాపాడగల శక్తివంతులు ఆ విష్ణు దూతలు సుమా !
నాయనలారా శుభకరుడయిన శ్రీహరి నామ కీర్తన ఫలములు మిరే స్వయముగా చూచితిరిగదా ! మృత్యువు పాశ బంధము నుండి అజామిళుడు ఆ విష్ణు సంకీర్తనల వలన, స్మరణ వలన ఎలా తప్పించుకున్నాడో. కనుక భగవన్నామ స్మరణ ప్రభావము అంతగోప్పది. అని గ్రహించవలెను .అని యమధర్మ రాజు చెప్పుచున్నాడు
నాయనలారా శుభకరుడయిన శ్రీహరి నామ కీర్తన ఫలములు మిరే స్వయముగా చూచితిరిగదా ! మృత్యువు పాశ బంధము నుండి అజామిళుడు ఆ విష్ణు సంకీర్తనల వలన, స్మరణ వలన ఎలా తప్పించుకున్నాడో. కనుక భగవన్నామ స్మరణ ప్రభావము అంతగోప్పది. అని గ్రహించవలెను .అని యమధర్మ రాజు చెప్పుచున్నాడు
No comments:
Post a Comment