1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. 52 రోజుల తర్వాత డిసెంబరు 15న అమరులయ్యారు. ఆయన ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తెలుగువారందరినీ ఉద్యమాలకు పురికొల్పింది. అప్పటివరకు తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా అభివర్ణించి అయిష్టతను చూపిన నెహ్రూకు మెట్టు దిగక తప్పలేదు. 1952, డిసెంబరు 19న మద్రాసును విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని పార్లమెంటులో ప్రకటించారు. ఫలితంగా 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా , 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. విజయనగరం(1979), ప్రకాశం(1970) జిల్లాలు ఆ తర్వాత ఏర్పడ్డాయి.
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమరజీవియైన మహాపురుషుడిగానే పొట్టి శ్రీరాములును అందరూ పరిగణిస్తారు. అంతకుమించి మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు, పొట్టి శ్రీరాములు. ఆయన అంతకుముందు కూడా 1946లో హరిజనుల ఆలయ ప్రవేశంకోసం నిరాహారదీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. ఆనాడు శ్రీరాములు చేత దీక్ష విరమింపచేయడానికి స్వయంగా గాంధీజీనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు"
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమరజీవియైన మహాపురుషుడిగానే పొట్టి శ్రీరాములును అందరూ పరిగణిస్తారు. అంతకుమించి మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు, పొట్టి శ్రీరాములు. ఆయన అంతకుముందు కూడా 1946లో హరిజనుల ఆలయ ప్రవేశంకోసం నిరాహారదీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. ఆనాడు శ్రీరాములు చేత దీక్ష విరమింపచేయడానికి స్వయంగా గాంధీజీనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు"
No comments:
Post a Comment