నా ప్రాణం కాపాడిన దేవుడు
ఒకసారి చెంగల్పేట్ జిల్లా న్యాయలయ తనిఖీ కోసం చెన్నైనుండి హైకోర్టు న్యాయావాది ఒకరు వచ్చారు. మామూలుగా అతను చెయ్యవలసిన పనులు చాలా ఉంటాయి కనుక అతను ఒక నిర్దుష్టమైన ప్రణాలిక వేసుకుని వస్తుంటారు. అలా తనిఖీ కోసం వచ్చిన సందర్భంలో అతను త్వరగా చెన్నై వెళ్ళిపోవాలి. కనుక తనిఖీ తరువాత చెన్నై వెళ్తూ పరమాచార్య స్వామివారిని మాత్రం దర్శించాలని అనుకున్నారు.
కావల్సిన ఏర్పాట్లు చేసి నేను కూడా వారితో పాటు కార్లో కాంచీపురంలోని శ్రీమఠానికి వెళ్ళాను. మహాస్వామి వారిని దర్శించుకున్నాము. స్వామివారు ఆ జడ్జితో మాట్లాడిన తరువాత అతణ్ణి కంచిలోని కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు తీసుకుని వెళ్ళమని నాతో చెప్పారు.
ఈ విషయం జడ్జితో చెప్పడానికి నేను భయపడుతున్నాను. అతను వెంటనే చెన్నై వెళ్ళిపోవాలి, కాని నేను మహాస్వామి వారి ఆజ్ఞను తృణీకరించలేను. చివరికి ఎలాగో విషయాన్ని చెప్పాను. ఆయన అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు. నేను ఆయన్ని కొన్ని దేవాలయాలకు తీసుకుని వెళ్ళాను. చివరికి రెండు గంటల ఆలస్యంగా జడ్జి చెన్నైకి బయలుదేరారు.
అప్పటికే పెద్దగా గాలి వీస్తూ జోరుగా వర్షం పడుతోంది. మేము హైవే సమీపించగానే, గాలులకు రోడ్డుపై అడ్డంగా పడిన ఒక చెట్టుని తొలగిస్తున్న కొంతమంది కార్మికులని చూశాము. విషయం ఏంటని అడుగగా దాదాపు గంటన్నర క్రితం విపరీతంగా వీచిన గాలులకి ఆ పెద్ద చెట్టు పడిపోయిందని వెంటనే కొంతమంది కార్మికుల సహాయంతో దాన్ని తొలగించడానికి మొదలుపెట్టారని చెప్పారు. అప్పుడే మాకు స్వామివారి మాటల్లోని అంతరార్థం తెలిసింది.
మేము మహాస్వామివారి మాటలు కనుక పెడచెవినపెట్టి బయలుదేరిఉంటే ఆ చెట్టు మాకారు పైన పడి ఉండేది లేదా మా ప్రయాణం కొబసాగించడానికి వీలు లేకుండా అక్కడ చిక్కుకుని ఉండేవాళ్ళం. స్వామివారి కారుణ్య పలుకుల వల్ల ఆరోజు మేము రక్షింపడ్డాము. ఈ విషయాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను.
--- పి.కె. రామనాథన్, చెన్నై - 24, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2
No comments:
Post a Comment