Pasam Jagannadham Naidu
ఇరుగు పొరుగు తో సహా అందరూ బాగుండాలని కోరుకునేవారు అరుదుగా ఉంటారు.అలాంటి వారు సమాజ వ్యతిరేకులు కారు.
అలాంటి వారిని ఎవరూ పట్టించు కోకపోయినా
పరవాలేదు...వారి సేవా నిరతిని ఆకాశానికి ఎత్తక్కరలేదు.అలాంటి వారిని సన్మానించక్కరలేదు.
సమాజంలో పదిమంది మేలు కోరే వారిని,,మనం పొగడకపోయినా పరవాలేదు.ఆదరించక పోయినా
ఓకే..సమాజ శ్రేయస్సు కోరే వారిని మనమందరం సమర్ధించ క పోయినా పరవా లేదు
.వారినిఎవ్వరూ అందలం ఎక్కించ క పోయినా ఇబ్బంది లేదు.అయితే,వారిని వారి
సేవా భావాన్ని,మంచి తనాన్ని చులకన చేసి మాటలాడ కండి.అవమానించ కండి
.వారి మనసును గాయ పరచకండి.ఎందుకంటే అలాంటి వారిని చిన్న బుచ్చడం వల్ల
,మనమే సమాజంలో మంచివారు సేవా భావం ఉన్నవారు లేకుండా వారిని వెళ్ళ గొట్టిన వారవుతాము.వారిని అవమానిస్తే సమాజం కోసం,మంచికోసం,పది మంది కోసం ఆలోచించే
వారు గానిఇక ఉండరు.సమాజం కోసం ,పనిచేసే వారుమిగలరు.,నీతి నిజాయితీల కోసం
నిలబడే వారు గాని ఆతరువాత మనకు దొరకరు.న్యాయం కోసం మాటలాడే వారు ఇక
ఉండరు.అది సమాజానికి ఎంతో ప్రమాదకరం.రేపు నీకోసం ఎవ్వరూ మాటాడరు.ఆపరిస్తితి తెచ్చు కో
వద్దు.నీవు కూర్చున్న కొమ్మను నీవే నరుక్కోవద్దు..
No comments:
Post a Comment