అమెరికా కాంగ్రెస్ లో అదరగొట్టిన మోడీ..!!!
అదో సభా ప్రాంగంణం.. అక్కడ మోడీ ఉద్వేగంగా ప్రసంగిస్తున్నారు. ఆయన మాట మాటకు చప్పట్లు మారుమోగిపోతున్నాయి.. ఒక్కోసారి మోడీ ప్రసంగానికి ఉత్తేజభరితులై లేచి నిల్చుని మరీ చప్పట్లు కొడుతున్నారు.. మోడీ నోటి నుంచి మాట రావడమే ఆలస్యం చప్పట్లు మోగిపోతున్నాయి. సభాప్రాంగణమంతా మోడీ ఫీవర్ ఆవహించింది.
ఇంతకూ అదేమీ బీజేపీ బహిరంగసభకాదు. ఓట్ల కోసం తరలించిన జనంతో జరిగే సభ అంతకన్నా కాదు.. ఆ చుట్టూ ఉన్నవాళ్లు మోడీ ప్రసంగానికి ముగ్దులైన వాళ్లు సాధారణ జనం కాదు.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు. అది అమెరికా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం.. మోడీ ప్రసంగం వారిని అంతగా ఆకట్టుకుంది. ఆయన ప్రతి మాటా వారి హృదయాలను తాకింది.
ప్రధాని మోడీ ప్రసంగిస్తుంటే.. అమెరికా కాంగ్రెస్ అంతా మంత్రముగ్ధమైపోయింది. మోడీ 45 నిమిషాల ప్రసంగంలో 40 సార్లు చప్పట్లు మారుమోగాయి. దాదాపు 10 సార్లవరకూ అమెరికా సభ్యులు లేచి నిల్చుని మరీ చప్పట్లు చరిచారు. మోడీ ప్రసంగం కాసేపు ఉత్తేజభరితంగా.. మరికాసేపు హాస్యభరితంగా సాగింది. ప్రత్యేకించి అమెరికా- భారత్ సంబంధాల గురించి మోడీ చెప్పిన తీరు వారిని అలరించింది.
మోదీ తన ప్రత్యేకమైన తెల్ల కుర్తా, పైజామాలపై నలుపు రంగు చేతులు లేని కోటును ధరించి హాజరయ్యారు. సభ్యులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న మోదీ.. ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలపై.. భవిష్యత్ మార్గంపై.. ప్రపంచంలో ఉమ్మడిగా పోషించగల పాత్రపై.. ఉగ్రవాదం విషయంలో అనుసరించాల్సిన విధానంపై అనర్గళంగా ఉపన్యసించారు. మధ్యమధ్యలో తనదైన శైలిలో చతురోక్తులతో సభ్యులను నవ్విస్తూనే.. అంతలోనే గంభీర అంశాలను ప్రస్తావిస్తూ వారిని సమ్మోహితులను చేశారు.
..... జై భారత్.
ఇంతకూ అదేమీ బీజేపీ బహిరంగసభకాదు. ఓట్ల కోసం తరలించిన జనంతో జరిగే సభ అంతకన్నా కాదు.. ఆ చుట్టూ ఉన్నవాళ్లు మోడీ ప్రసంగానికి ముగ్దులైన వాళ్లు సాధారణ జనం కాదు.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు. అది అమెరికా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం.. మోడీ ప్రసంగం వారిని అంతగా ఆకట్టుకుంది. ఆయన ప్రతి మాటా వారి హృదయాలను తాకింది.
ప్రధాని మోడీ ప్రసంగిస్తుంటే.. అమెరికా కాంగ్రెస్ అంతా మంత్రముగ్ధమైపోయింది. మోడీ 45 నిమిషాల ప్రసంగంలో 40 సార్లు చప్పట్లు మారుమోగాయి. దాదాపు 10 సార్లవరకూ అమెరికా సభ్యులు లేచి నిల్చుని మరీ చప్పట్లు చరిచారు. మోడీ ప్రసంగం కాసేపు ఉత్తేజభరితంగా.. మరికాసేపు హాస్యభరితంగా సాగింది. ప్రత్యేకించి అమెరికా- భారత్ సంబంధాల గురించి మోడీ చెప్పిన తీరు వారిని అలరించింది.
మోదీ తన ప్రత్యేకమైన తెల్ల కుర్తా, పైజామాలపై నలుపు రంగు చేతులు లేని కోటును ధరించి హాజరయ్యారు. సభ్యులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న మోదీ.. ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలపై.. భవిష్యత్ మార్గంపై.. ప్రపంచంలో ఉమ్మడిగా పోషించగల పాత్రపై.. ఉగ్రవాదం విషయంలో అనుసరించాల్సిన విధానంపై అనర్గళంగా ఉపన్యసించారు. మధ్యమధ్యలో తనదైన శైలిలో చతురోక్తులతో సభ్యులను నవ్విస్తూనే.. అంతలోనే గంభీర అంశాలను ప్రస్తావిస్తూ వారిని సమ్మోహితులను చేశారు.
..... జై భారత్.
No comments:
Post a Comment