UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 30 July 2016

సగం మందితోనే పరిసమాప్తి!


Kumar Velmula



మిగిలింది... ఒక్క రోజే..!
గడువు ముంగిట పంటల బీమా
సగం మందికీ చేరని ఫసల్‌ యోజన లక్ష్యం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం
బీమా ఉంటే చాలు రైతులు ధీమాగా ఉండవచ్చనే భావనతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఫసల్‌ బీమా పథకం జిల్లాలో నీరుగారిపోతోంది. పంటల బీమాతో పాటు రైతుల వ్యక్తిగత, వాతావరణ ఆధారిత బీమాను జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం సగం మంది రైతులకు అందని ద్రాక్షే అవుతోంది. రైతుల్లో అవగాహన లోపం, వ్యవసాయశాఖ బాధ్యతారాహిత్యం, బీమా కంపెనీ అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం అన్నీ కలిపి బృహత్తర లక్ష్యానికి తూట్లు పొడిచింది. జులై నెలాఖరుతో గడువు ముగుస్తుండడం, శుక్రవారం బ్యాంకర్లు సమ్మె చేయడం, చివరి రోజు అదివారం కావడం, శనివారం ఒక్క రోజే మిగిలి ఉండడంతో సగానికి పైగా రైతులు ఇప్పుడు నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. బీమా మార్గదర్శకాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని పాలనాధికారులు, పాలకులు చేసిన సమీక్షలన్నీ అన్నదాతకు సాయం అందించలేకపోయాయి.
సగం మందితోనే పరిసమాప్తి!
జిల్లాలో సుమారుగా 2,90,990 రైతు కుటుంబాలకు సంబంధించి దాదాపుగా 4.5 లక్షల మంది రైతులున్నారు. ఇందులో ఏటా 3.75లక్షల మంది మాత్రమే పంట రుణాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌నకు రూ.1,950 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాలను నిర్దేశించింది. అయితే జూన్‌ నెల ప్రారంభమయ్యే సీజన్‌ మొదలుకొని రుణాల పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టాలి. అయితే పదేపదే పాలనాధికారిణి బ్యాంకర్లతో సమావేశం పెట్టి, వ్యవసాయాధికారులను పిలిచి రైతులను చైతన్యం చేయమని ఎంతగా హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు జిల్లాలో కొత్త రైతుల మాట అటుంచి, పాతవారికి 3.7లక్షల మంది రైతులకు కేవలం 1.85లక్షల మందికే రుణాలు రెన్యువల్‌ చేశారు. ఈ నెల 25న జిల్లా పాలనాధికారిణి యోగితారాణా బ్యాంకర్లతో సమీక్షించినప్పుడు 1.59 లక్షల మందికి మాత్రమే రూ. 712 కోట్లు పంపిణీ చేశారు. నిర్దేశిత లక్ష్యంలో 36.53 శాతమే చేరడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయినా అధికారుల తీరులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. రైతులందరికి రుణాలిచ్చి బీమా కింద చేర్చాలని కలెక్టర్‌ ఆదేశిస్తే కేవలం 1441 మందికే అవకాశం కల్పించారు. ఒక ఒక్క రోజే మిగిలివున్న తరుణంలో ఎంతమందికి రుణాలిచ్చి బీమా కట్టిస్తారనేది వేచిచూడాలి.
సమన్వయలోపం.. రైతులకు శాపం..!
రెండేళ్ల కరవుతో చిక్కిశల్యమైన అన్నదాతలు పంట రుణాలను రెన్యువల్‌ చేసుకునే స్థితిలో లేరు. గతంలో ఏటా పంట రుణం తీసుకుని బీమా ప్రీమియం చెల్లించినా ఏనాడు పరిహారం అందలేదని, కరవు తీవ్రంగా ఉన్నా బీమా కంపెనీలు ఇసుమంత సాయం చేయలేదని రైతులు మదనపడుతున్నారు. దీనిపై కేంద్రం ఈసారి బీమా పథకంలో మార్పులు-చేర్పులు చేసి ఫసల్‌ బీమాను అమల్లోకి తెచ్చింది. జిల్లాకు వ్యక్తిగతంగా రైతులతో పాటు అతనికి సంబంధించి పంటకు, రైతులు వాడే యంత్రాలకు, పశువులకు ఇలా ఎవరికి నష్టం కలిగినా పరిహారం ఇప్పించేందుకు ఏకీకృత పాలసీని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఈ బృహాత్తర పథకానికి మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులందరికి న్యాయం చేయాలనే లక్ష్యంతో కలెక్టర్‌ ఎన్నిసార్లు సమీక్షలు పెట్టినా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. వ్యవసాయశాఖ రైతువారీగా సర్వే చేసి పంట రుణాలు తీసుకునేలా చైతన్యం చేయాలని, లేకపోతే నేరుగా బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బ్యాంకర్లు కూడా రైతులకు సమాచారం ఇచ్చి పాతవారివి రెన్యువల్‌ చేయాలని సూచించింది. రైతులను చైతన్యం చేసేందుకు రెవెన్యూ, డీఆర్‌డీఏ శాఖలను రంగంలోకి దించింది. ఇవేవి ఫలితాలివ్వలేదు. కనీసం బీమా సంస్థలు సైతం రైతులకు అవగహన కల్పించే ప్రయత్నం చేయలేదు. ఆయా శాఖలు ఎవరికివారుగా సమన్వయం లేకుండా పనిచేయడంతో ఇప్పుడు సగం మంది రైతులు ఫసల్‌ బీమా పథకానికి దూరమయ్యారు.
బ్యాంకుకు మొఖం చాటేస్తున్న రైతులు..
ఎప్పటిలాగే బ్యాంకులకు వెళ్లి రుణాలు రెన్యువల్‌ చేసుకునే రైతులు సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు బ్యాంకు అధికారుల తీరుకు పొంతన లేకుండా పోయింది. ఏడాదిలోపు రెన్యువల్‌ చేసుకుంటే వడ్డీ వసూలు చేయవద్దని ఎంత చెప్పినా కొన్ని ప్రధాన బ్యాంకర్లు తమ తీరు మార్చుకోలేదు. పంట రుణ మాఫీ నిధులు ఖాతాల్లో చేరకపోవడంతో రైతులు నిరుత్సాహంలో ఉన్నారు. ఎక్కడ రెన్యువల్‌ చేసుకుంటే మాఫీ నిధులు రావనే భావనతో మొఖం చాటేశారు.
మార్గమార్గదర్శకాలు ఆలస్యంగా రావడంమే కారణం
- వెంకటేశ్వర్లు, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌
సీజన్‌ ప్రారంభానికి ముందే మార్గదర్శకాలు వస్తే బాగుండేది. జూన్‌ 2న రావడంతో వాటిని రైతులకు చేరవేయడంలో ఆలస్యమైంది. అలాగే గడువు తేదీ దగ్గరలో ఉండటంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. గత ఏడాది ఇదే సమయానికి రూ.480 కోట్లు రుణాలిచ్చిన బ్యాంకులు ఈసారి రెట్టింపుగా రూ.830 కోట్లు ఇచ్చాయి. బీమా సంస్థలు, సంబంధితశాఖలు రైతు చైతన్య కార్యక్రమాలు చేస్తే మరింత ఫలితముండేది.

No comments:

Post a Comment