Venkata Butchi Raju Bojja
స్టువర్ట్ పురం దొంగలనే దోచుకున్న మహ గజదొంగలున్నారు.. చీ.... చెప్పడానికే సిగ్గేస్తుంది... దొంగలను సత్పురుషులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పదకం లోబాగంగా అందజేసిన భూములను ఆ ప్రాంతానికి చెందిన రాజకీయనాయకులు కబ్జా చేసేసారట.... ఇంకా చేస్తూనే వున్నారట.... ఎదురు తిరిగిన లబ్దిదారులను రాజకీయగజదొంగలు పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి వేదిస్తున్నారట... దొంగలు మారుతున్నా మన నేతల బుద్ది మాత్రం మారడం లేదు.... తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం స్టువర్ట్ పురం ను "సువార్తపురం" గా మార్చమని గ్రామస్తులు కొరుతున్న నేపధ్యం లో టివి5 ఈ రొజు 11.30 వార్తలలో మాజీ దొంగల పై ప్రసారం చేసిన మంచి కధనాన్ని చూసే అవకాశం నాకు లభించింది. ఆ రిపొర్టర్ కమేరా మన్ లను అభినందించాలి. బ్రిటిష్ కాలం నుండి దారి దొపిడిలకు, దొంగ తనాలకు పాల్పడుతూ దక్షిణ భారతదేశాన్ని గజగజలాడించిన గజదొంగలను వారి "ఖర్మ" కు వదిలేయకుండా 'చర్చ్' దశాబ్దాలుగా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వంతో కలసి కృషి చేస్తూనే వున్నది. భొదనలు వారిలో మానసిక వికాసాన్ని కలిగించాయి. ప్రభుత్వ స్వచ్చంద సంస్థల ఆర్దిక సహాయం వారి పొట్టనింపాయి. కులవృత్తి గా వున్న దొంగతనంను తమ వారసులకు అంటించకుండా విద్యావంతులను చేసారు. గ్రామస్తులు దొంగతనానికి దూరంగా వున్నారని పొలీసులు చెబుతున్నారు. అయితే స్టువర్టు పురం అనే పేరు తమకు శాపంగా మిగిలిందని, ఆ పేరు కారణంగా తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని విధ్యావంతులైన యువకులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊరు పేరు మార్చాల్సిందే. యువకులకు ఉపాధి చూపాలి. పునరావాసం క్రింద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన భూములను రాజకీయ గజదొంగల చెర నుండి విడిపించి లబ్ధిదారులకు తిరిగి అప్పగించండి... బాబూ....!
No comments:
Post a Comment