నిజాం రాజు తలవంచిన రోజు..!
ఇటు చర్చలు.. అటు పాక్తో వ్యూహాలు
ఇటు భారత్తో చర్చలకు గడువు కోరుతూనే మరోవైపు పాకిస్థాన్కు రూ. 20 కోట్ల సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. భారత్కు వ్యతిరేకంగా కశ్మీర్లో పోరాటానికి మద్దతుగానే పాక్కు ఈ సొమ్ము ఇచ్చాడనేది బహిరంగ రహస్యం. పటేల్కు నిజాం వైఖరిపై అనుమానం రావడానికి ఇదో కారణం. దీనిమీద రహస్యంగా కూపీ లాగగా పాకిస్థాన్లోని కరాచీ పోర్టును వాడుకునేలా పాకిస్థాన్ అధ్యక్షుడు జిన్నాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు మతకల్లోలాను సృష్టించి జనాన్ని భీతావహుల్ని చేశారు. నిజాంకు నమ్మిన బంటు అయిన ఖాసిం రజ్వీ ఎలాగైనా హైదరాబాద్ను ‘ఉస్మానాబాద్’గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకనుగుణంగా నిజాంను కూడా ఒప్పించాడు. స్వాతంత్య్రానికి పూర్వం జిన్నా కాంగ్రెస్ నేతల్ని భయపెట్టడం కోసం ‘డైరెక్ట్ యాక్షన్ డే’ చేపట్టనున్నట్లు ప్రకటించినట్లుగానే రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ 2 లక్షలమంది రజాకార్లతో భారీ కవాతు నిర్వహించి ఉస్మానాబాద్ ఏర్పాటుకు ఒప్పుకోవాలంటూ భారత ప్రభుత్వానికి ఓ హెచ్చరిక పంపించాడు. హైదరాబాద్ సంస్థానానికి సరిహద్దు ప్రాంతాలకు కూడా వీరి ఆగడాలు పాకినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక ఉపేక్షించడం మంచిది కాదని నాటి ఉప ప్రధాని, హోంమంత్రి వల్లభాయ్ పటేల్ భావించారు. రజాకార్ల బీభత్సకాండకు అడ్డుకట్ట వేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఆయన నిర్ణయించారు. ఫలితంగా భారత సైన్యం పోలీసు చర్య చేపట్టింది.
* హైదరాబాద్పై పోలీసు చర్య పేరు ‘ఆపరేషన్ పోలో’. ఇది 108 గంటలు సాగింది.
* 1948 సెప్టెంబరు 13న మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో మొదలైన ఆపరేషన్ సెప్టెంబరు 18 సాయంత్రం పూర్తయింది.
* నిజానికి సెప్టెంబరు 17నే నిజాం సైన్యం భారత్ సైన్యానికి లొంగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత నిజాం లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
* 18న హైదరాబాద్లోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు.
* ఎట్టకేలకు హైదరాబాద్ సంస్థానం భారత్లో అంతర్భాగమైంది. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పమే దీనికి ప్రధాన కారణం. ఆయన చొరవ లేకుంటే దేశం గుండెల మీద ఇదో నిప్పుల కుంపటిలా నిలిచి ఉండేది.
No comments:
Post a Comment