శ్రీ మరుమాముల వెంకట రమణ గారు,
సంపాదకులు, దర్శనం, ఆధ్యాత్మిక మాస పత్రిక
హైదరాబాద్,
నమస్తే.
(చాలామంది "నమస్తే" అనగానే పెద్దవారికి మాత్రమే పెట్టాలని అంటుంటారు. కాని నేను నమ్మే దానిప్రకారం.... నమః + తే అనే రెండు పదాంశాల సంగమం నమస్తే. నమః ... శుభం కలుగు గాక; తే... నీకు లేదా మీకు; అంటే మీకు శుభం కలుగు గాక అనే అర్ధం ఒకటి. కాగా భౌతిక ప్రపంచంలో మీరు వేరు నేను వేరు కావచ్చు కాని ఆ పరమాత్మ సన్నిధానం లో మీరూ నేనూ ఒక్కటే అనే భావాన్ని వ్యక్తం చేస్తూ రెండు చేతులనూ ఒకటిగా జోడిస్తాము. కాబట్టి అక్కడ చిన్నా పెద్దా ... అదీ వయసుతో సంబంధం లేదు)
సంపాదకులు, దర్శనం, ఆధ్యాత్మిక మాస పత్రిక
హైదరాబాద్,
నమస్తే.
(చాలామంది "నమస్తే" అనగానే పెద్దవారికి మాత్రమే పెట్టాలని అంటుంటారు. కాని నేను నమ్మే దానిప్రకారం.... నమః + తే అనే రెండు పదాంశాల సంగమం నమస్తే. నమః ... శుభం కలుగు గాక; తే... నీకు లేదా మీకు; అంటే మీకు శుభం కలుగు గాక అనే అర్ధం ఒకటి. కాగా భౌతిక ప్రపంచంలో మీరు వేరు నేను వేరు కావచ్చు కాని ఆ పరమాత్మ సన్నిధానం లో మీరూ నేనూ ఒక్కటే అనే భావాన్ని వ్యక్తం చేస్తూ రెండు చేతులనూ ఒకటిగా జోడిస్తాము. కాబట్టి అక్కడ చిన్నా పెద్దా ... అదీ వయసుతో సంబంధం లేదు)
ఈ నెల దర్శనం లో మీ సంపాదకత్వాన్ని చదివాను. చక్కగా వివరించారు. గురువును వ్యక్తిగా చూచే సంస్కారం మనలో అంతరించనంత వరకు ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆస్వాదించలేము. గురువు వ్యక్తికాదు అది ఒక మండలం. అక్కడ వ్యక్తి ఆరాధనకు తావులేదు. మన సాధనా పటిమను బట్టి మన స్థానం నిర్ణయింపబడుతుంది. ఆ స్థానానికి మనకు మార్గ దర్శకులుగా అంతకు ముందే అక్కడకు చేరిన దివ్యాత్మలు మన గమనంలో వెలుగులు నింపుతావి. అలా వెలుగులు నింపే దివ్యాత్మలు ఎవరో మనకు తెలియక పోవచ్చు లేదా మనమెవరమో ఆ దివ్యాత్మలకూ తెలియకపోవచ్చు. ఇది ఆధ్యాత్మిక ధర్మం అంటాము. నిజమైన ఆధ్యాత్మికా జిజ్ఞాసతో తపించే సాధకుని గమనంలో ఎదురయ్యే అవరోధాలు తొలగిస్తూ అతని సాధనలో అతని ప్రగతికి దోహద పడేందుకు దివ్యాత్మ శక్తులు అనుక్షణం సన్నద్ధమై యుంటాయి. మరొక్క మాట... ఎంత వరకైతే మూర్తినే ఆరాధిస్తుంటామో.... మన ప్రగతి అక్కడి వరకే పరిమిత మౌతుంది. పరిమితత్త్వం నుండి అపరిమితత్త్వం దాకా సాగాల్సిన మన యానం పరిమితమౌతే అభ్యుదయం కుంటుపడుతుంది. అందుకే మన వేద సాహిత్యం అంతా "పూర్ణమదం, పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే" అంటూ.... అపరిమిత తత్త్వాన్ని తెలుసుకునేందుకే మనకు ప్రేరణ నిస్తుంది... అటు వైపే గమించమంటుంది. అయితే తెలియని అపరిమిత తత్త్వాన్ని ఊహించడం... దాన్ని లక్ష్యంగా చేసుకొని ఆవైపు పయనించడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఒక పరిమిత మూర్తిని చూపి దానిని అర్ధంచేసుకొని అంతకన్నా ఉన్నతమైన దానిని... అంతకన్నా సమున్నతమైన దానిని లక్ష్యంగా చేసుకోండని ప్రబోధించారు దార్శనికులైన మహాఋషులు.
నా పుస్తకం "గంగావతరణం" పద్య కావ్యం లో ఈ క్రింది పద్యం వ్రాయడం జరిగింది, అదీ 2002 లో.
నా పుస్తకం "గంగావతరణం" పద్య కావ్యం లో ఈ క్రింది పద్యం వ్రాయడం జరిగింది, అదీ 2002 లో.
సాధనంబె గాని సాధ్యంబు కాబోడు
ప్రగతి మార్గమందు పరమ గురువు
సాధ్య మెపుడు నిత్య సత్యమౌ బ్రహ్మంబె
యనెడి జ్ఞాన దీప్తి నాత్మ నిలుపు!
ప్రగతి మార్గమందు పరమ గురువు
సాధ్య మెపుడు నిత్య సత్యమౌ బ్రహ్మంబె
యనెడి జ్ఞాన దీప్తి నాత్మ నిలుపు!
గురువు మార్గం చూపుతాడు కాని ఆ మార్గాన్ని అనుసరిస్తూ మన "యెఱుక" ననుసరించి మనకొక మార్గాన్ని ఏర్పరచుకోవలసిన బాధ్యత మనదే అనేది నా నమ్మకం.
పై విషయం మీకు నచ్చకపోతే పట్టించుకోకండి. నాకు అనిపించింది సమాన ఆలోచన కలవారితో పంచుకోవడం నా అలవాటు.
కృతజ్ఞతలతో....
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment