పర్సంటేజ్లు తీసుకోకుంటే బతకలేరా..?
04-11-2016 21:05:49
హైదరాబాద్: పర్సంటేజ్లు తీసుకోకుంటే బతకలేరా? అని ఉద్యోగులను సీవీ ఆనంద్ ప్రశ్నించారు. ఉద్యోగులు చేస్తున్న అవినీతి దందాలన్నీ తెలుసని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఉద్యోగులకు ఇదే చివరి అవకాశమని.. తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని సీవీ ఆనంద్ హెచ్చరించారు. నేను కఠినంగా వ్యవహరిస్తుంటే ఏకంగా మిల్లర్ల నుంచి పర్సంటేజ్ల రేటు పెంచుకుంటారా? అంటూ ఆయన ప్రశ్నించారు. 30 శాతం మంది ఉద్యోగులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని కమిషనర్ తెలిపారు. తన దగ్గర ఏసీబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ నివేదికలున్నాయని ఆయన చెప్పారు. మిల్లర్లతో ఉద్యోగులు చేతులు కలపొద్దు.. డిన్నర్లు చేయొద్దని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
No comments:
Post a Comment