ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో 45,027 మంది స్థూల ఆదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్లు ఉండగా.. 98,815 మంది ఆదాయం రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో సుమారు 3వేల మంది వార్షికాదాయం రూ.5కోట్లు పైబడి ఉండటం విశేషం. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే భారతీయుల ఆదాయం భారీగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో కోటీశ్వర్ల సంఖ్య 15 నుంచి 20శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.
దేశంలో వివిధ కంపెనీల సీఈవోలు ఒక దగ్గర్నుంచి వేరే చోటకు మారడం వల్ల భారీగా వేతనాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వేతనాల పెరగడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధి కూడా పెరిగినట్లుపేర్కొంటున్నారు. 2013-14 వార్షిక సంవత్సరంలో దేశం ఆర్థిక మందగమనంలో ఉండేదని.. దీంతో ద్రవ్యోల్బణం సైతం దేశానికి సవాల్గా మారడంతో అప్పట్లో వేతనాలపై ప్రభావం పడిందని చెబుతున్నారు.
ఈ తాజా గణాంకాల ప్రకారం..
* వేతనం ద్వారా ఏడాదికి రూ. 50లక్షల నుంచి రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 54,921
* కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 24,942
* దేశంలో 928 మంది రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు జీతం పొందుతుండగా.. 232 మంది రూ.10 కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు సంపాదిస్తున్నారు.
* ఏడాదికి రూ.25 నుంచి 50కోట్లు వరకూ ఆర్జిస్తున్న వారి సంఖ్య 32
* రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు సంపాదించేవారు పది మంది ఉండగా.. రూ.100 కోట్ల సంపాదనాపరులు ఇద్దరు ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి.
* వేతనం ద్వారా ఏడాదికి రూ. 50లక్షల నుంచి రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 54,921
* కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 24,942
* దేశంలో 928 మంది రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు జీతం పొందుతుండగా.. 232 మంది రూ.10 కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు సంపాదిస్తున్నారు.
* ఏడాదికి రూ.25 నుంచి 50కోట్లు వరకూ ఆర్జిస్తున్న వారి సంఖ్య 32
* రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు సంపాదించేవారు పది మంది ఉండగా.. రూ.100 కోట్ల సంపాదనాపరులు ఇద్దరు ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి.
No comments:
Post a Comment