(ఆంధ్రజ్యోతి - చిత్తూరు) : చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం నూనెగుండ్లపల్లెలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న అమర రాజా గ్రోత్ కారిడార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. దాదాపు రూ.4500 కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ గ్రోత్ కారిడార్ను అమరరాజా అభివృద్ధి చేసింది. ఈ పారిశ్రామిక వాడలో 20 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇతర పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో పాటు అమరరాజా గ్రూపు స్వయంగా కొన్ని యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. అమరరాజా ఏర్పాటు చేసిన ఆటోమొబైల్ బ్యాటరీల ప్లాంటును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
అమరరాజా గ్రూప్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ యూనిట్కు భూమి పూజ కూడా చేస్తున్నా రు. అమరరాజా యాజమాన్య కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి , ఆమె భర్త గల్లా రామ చంద్రనాయుడు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడాన ప్రాంతీయాభిమానంతో కూడా చిత్తూరును పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ కారిడార్కు రూపకల్పన చేశారు.
No comments:
Post a Comment