.....ఓం సద్గురు సాయిరాం.....
"పితృదేవతగా బాబా "
👉 ఉపాసిని అయిన ఒక శాస్త్రి తన తమ్ముడు ఊరు వదిలి వెళ్లిపొతే... తన తమ్ముడి కొసం వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు... ఆ సందర్భంగా ఆయన "గయ" చేరుకున్నారు... అక్కడ నివశిస్తున్న సాధువులుని తన తమ్ముడి గురించి ప్రశ్నిస్తుండగా... ఒక సాధువు ఆయన చెప్పిన ఆయన తమ్ముడి పొలికలు శ్రద్దగా విని... "షిరిడి"లొ మసీదులొ సాయిబాబా వున్నారు... ఆయన గొప్ప యోగిరాజు... సిద్దపురుషులు... ఆయన్ని దర్శించుకొండి మీ సమస్య తీరుతుంది... అని సలహా ఇచ్చాడు... మసీదులొ బాబా అనగానే ఆయన ముస్లీం అని శాస్త్రికి అర్థమైంది... శొత్రీయ బ్రాహ్మణ వంశంలొ పుట్టిన తన తమ్ముడి గురించి బాబా ఏమీ చెప్పలేడన్న అవిశ్వాసంతొ శాస్త్రిగారు షిరిడీ వెళ్లే ఆలొచన కూడా చెయ్యలేదు...
👉 శాస్త్రిగారు గయలొ వుండగానే... ఆయన తన తండ్రికి శ్రాద్దం పెట్టాల్సి వచ్చింది... త్రివేణి సంగమం వద్ద... శ్రాద్ద విధులు సక్రమంగా నిర్వర్తించాక పిండాలను నదిలొ కలపడానికి... శాస్త్రిగారు నదిలొకి దిగాడు... అతను మంత్రాలు చదువుతూ నీళ్లల్లొ పిండాలు వదలబొతున్నాడు... అంతలొ హఠాత్తుగా....
👉 నదీ ప్రవాహం క్రిందనించి... నీళ్లని చీల్చుకుంటూ... రెండు చేతులు పైకి వచ్చాయి... శాస్త్రిగారు ఉలిక్కిపడ్డాడు... భయం భయంగా పిండాలు జార విడచాడు... ఆ పిండాల్ని చటుక్కున అందుకొని స్వీకరించాయి హస్తాలు... మరుక్షణం.....
👉 శాస్త్రిగారు విభ్రాంతుడై చూస్తుండగానే పిండాలతొ సహా ఆ హస్తాలు నీళ్లలొ మునిగి ఆదృశ్యమయ్యాయి... శాస్త్రి భయంతొ... విష్మయంతొ నిశ్చేష్టుడైపొయాడు...
👉 బాబా అంటే ముస్లీం అనే భావం నశించి భగవంతుడే అన్న విశ్వాసంతొ... షిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు శాస్త్రిగారు... ఆ క్షణంలొ అతనికి బాబాలొ ధివ్యమైన ప్రకాశం గొచరించింది....
👉 త్రిమూర్తులకే మూలమైన పరబ్రహ్మమే ఆ ప్రకాశమని... ఆ పరబ్రహ్మ అవతారమే బాబా అని గ్రహించి... తన్మయత్వానందంతొ... చేతులు జొడించి నమస్కరించాడు శాస్త్రిగారు... బాబా మందహాసం చేసి... తన చేతులను అతనికి చూపిస్తూ... నీవు గయలొ నీ పితృదేవతలకు పిండప్రదానం చేసినపుడు స్వీకరించిన చేతులివే... అని చెప్పారు... బాబాయే తన పితృదేవతల రూపంలొ పిండాలని స్వీకరించారని గ్రహించిన శాస్త్రిగారు... కన్నీరు కారుస్తూ... భక్తితొ బాబాకి పాదాబి వందనం చేసుకున్నాడు...
......ఓం సాయిరాం.....
No comments:
Post a Comment