మతోన్మాదులు మతలబులతో సమాజాన్ని కుళ్ళబెడుతుంటే
కులమతాలన్నీ
నేనున్నానంటూ
కపటరాజకీయాలతో అమాయక ప్రజలను నోటు ఓటుతో మభ్యపెడుతుంటే
నిజం పెదవి చివరనే పదవిరుపుగా మిగిలిపోతుంటే
ప్రజలందరూ హోదాల వేటలో హక్కులను కోల్పోతుంటే
మీడియా కులమతాల రంగు పులుముకుని
మాఫియాల మత్తులో
జోగుతుంటే
అంతరాళాల నిండా ఆవేశమున్నా
ఆచరణ ముందడుగు వేయనీయక సతమతమౌతూనే ఉన్నది..రేపు..మాపంటూ..
రూపు రేఖలు లేని అదృశ్యశక్తొకటి ఆవహించాలి..సమస్తమానవాళినీ మేల్కొల్పడానికి
ప్రజాస్వామ్యం అక్షరజ్ఞానమున్న నిరక్షరాస్యతవుతుంటే
విద్యాలయాలు నైతికవిలువలను మరచి
నిర్భయచట్టాన్ని సైతం నడిరోడ్డుమీద నగ్నంగా నిలబెడుతుంటే
న్యాయదేవత అన్యాయానికి పట్టం కడుతుంటే
చట్టం కళ్ళకు గంతలు కట్టి డబ్బుకు దాసోహం చేస్తుంటే
నేలను నమ్ముకున్న రైతన్న మేనిలో ప్రభుత్వ పధకాలు శూలాలు దించుతుంటే
పలుగు పారను చేతబట్టే శక్తిలేక
చేసిన అప్పు ఉరితాడై మెడను ముద్దాడుతుంటే
ఊరిచివరి గుడిసెలో అవ్వను అంటరాని దానివని వర్ణభేదం చూపుతుంటే
మరుభూమి ముసిముసిగా నవ్వుతోంది ..తానే గెలిచానని..మానవత్వమా నీ చిరునామా ఎక్కడని ?
No comments:
Post a Comment