బ్యాంకాక్: సుదీర్ఘకాలంపాటు థాయ్లాండ్కు రాజుగా కొనసాగుతున్న భూమిబోల్ అదుల్యదేజ్(88) గురువారం కన్నమూశారు. ఆయన వయసు 88. 1946 సోదరుడి మృతితో థాయ్ సింహాసనాన్ని అధిరోహించిన ఆయన దివ్యాంశ సంభూతుడిగా...సాక్షాత్ భగవత్ స్వరూపంగా ప్రజల నుంచి అపార గౌరవాన్ని అందుకున్నారు. ఆయన.. థాయ్లాండ్ను అత్యధిక కాలం పరిపాలించిన రాజుగా ప్రత్యేకత సాధించారు. సుమారు 70 ఏళ్లపాటు పరిపాలించిన ఆయనను 'రామా 9'గా కూడా వ్యవహరిస్తారు. ఎంతో కాలం నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.52 గంటలకు మరణించినట్లు రాజప్రాసాదం విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.
Read more at: http://telugu.oneindia.com/news/international/thai-king-world-s-longest-serving-monarch-dies-185990.html
Read more at: http://telugu.oneindia.com/news/international/thai-king-world-s-longest-serving-monarch-dies-185990.html
No comments:
Post a Comment