UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 6 November 2014

ఆర్ధికంగా అభివృద్ధి చెంది, మనకంటే విలాస జీవితాన్ని గడుపుతున్నంత మాత్రాన పాశ్చాత్యులను, పాశ్చాత్య దేశాలను గొప్పగా ఊహించుకుని, వారినే నాగరికులుగా, వారిదే అసలైన నాగరికతగా భ్రమించి, మన పరిణతి చెందిన నాగరికతని చిన్న చూపు చూసి, మన సనాతన ధర్మం ప్రసాదించిన ధర్మబద్దమైన జీవితాన్ని విడిచి, వారిని అనుకరించడమే మన ఈ వెనుకబాటుకు కారణం. ఒకనాడు ప్రపంచ దేశాలు సమస్తం భారత దేశానికి వలస మార్గం పట్టడం చరిత్ర చెబుతున్న నిజం. కారణం ఇది జ్ఞాన మరియు ఆర్ధిక సంపన్న దేశం కావడమే. వలస వచ్చిన సంస్కృతులు ఇక్కడి నుండి జ్ఞానాన్ని పొంది, సంపదను పొంది, అభివృద్ధి చెంది, వారి అజ్ఞానాన్ని ఇక్కడ ప్రజలపై రుద్ది, ఇప్పుడు వారే అసలైన నాగరికులుగా, భారతీయులు అనాగరికులుగా ప్రచారంచేసినంత మాత్రాన మన సంస్కృతికి వచ్చిన ఇబ్బందేమీలేదు.


పాశ్చాత్యవిష సంస్కృతి
**********************
మనకు స్వాతంత్య్రం రాక ముందు నుంచి మన సంస్కృతి, విలువలను చక్కగా పాటించేవాళ్లము. కానీ గత అరవై ఐదేళ్లుగా మనం ఎంతో నష్టపోయాము.ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతి జాడ్యం పట్టి పీడిస్తోంది.
పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పిల్లలపై సినిమాలు బాగా ప్రభావం చూపుతున్నాయి. అంతకంతకూ ప్రేమ పేరిట పైత్యం ముదిరిపోతోంది. ప్రేమమైకంలో మునిగితేలుతున్న యువకులు ఏం చేస్తున్నారో తెలీని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
నాగరికత, అభివృద్ధి పేరిట సంస్కృతీ విలువలు అనే గీతను దాటడం వలన అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లో మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి.
లక్నోలో పదిహేనేళ్ల బాలికపై యువకుడు తరగతి గదిలోనే కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్నాడు. యువకుడు మృతి చెందగా, బాలిక చికిత్స పొందుతోంది.
బాలిక తరగతి గదిలోకి వెళ్లిన కాసేపటికే ఆమెకు బంధువైన యువకుడు ఆమె కడుపు భాగంలో కాల్పులు జరిపాడు. తరువాత తన తలకి గురిపెట్టి కాల్చుకున్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించగా బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె నెమ్మదిగా కోలుకుంటోంది.
మాదకద్రవ్యాల మత్తులో జోగుతూ యువత నిర్వహించుకుంటున్న రేవ్పార్టీలు ఇటీవల సర్వసాధారణమయ్యాయి. యువత అశ్లీల నృత్యాలతో ఒళ్ళూపై తెలియకుండా రేవ్పార్టీలు ఎంజాయ్ చేసే వరకు దిగజారింది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, జలపాత హోరు మాదిరి సంగీతంతో పాటు లిప్తపాటులో నిషా ఎక్కించే కొకైన్, ఎల్సిడి వంటి మాదకద్రవ్యాలు ఇంకేముంది మత్తులో యువత చిత్తవుతున్నారు. ఏదో లోకంలో విహరిస్తున్నట్లు అనుభూతి పొందుతూ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు చాలా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగులకు వారాంతమైన శని, ఆదివారాలు సెలవు ప్రకటించడం, చిరుప్రాయంలోనే వేలకొద్దీ వేతనాలు చేతికందడంతో యువత పట్టపగ్గాల్లేకుండా పోతోంది.
వారాంతాలు ఎంజాయ్ చేద్దామనుకునే ధోరణి దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఎంజాయ్ అంటే ఏ సినిమా చూడడమో, షికారుకెళ్ళడమో కాదు సుమా చక్కటి చుక్కను తీసుకుని బైకుపైనో, కార్లోనో రయ్యిన దూసుకెళ్ళి పబ్ల్లో మందేస్తూ చిందులేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అమ్మాయిలు కూడా పాశ్చాత్య సంస్కృతి హోరులో కొట్టుకుపోతున్నారు.
నిబంధనలకు తిలోదకాలిస్తూ...
గతంలో అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు బయటకు వెళ్లే వారు.. స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. మానవ విలువలు, మనోద్వేగాలు క్షీణించి పోతున్నాయి.
భారతీయ సంస్కృతిని ఈనాడు అదే సంస్కృతిలో బతుకుతు న్నా
కొంతమంది విమర్శించడం ఎంత అజ్ఞానం?
ఆర్ధికంగా అభివృద్ధి చెంది, మనకంటే విలాస జీవితాన్ని గడుపుతున్నంత మాత్రాన పాశ్చాత్యులను, పాశ్చాత్య దేశాలను గొప్పగా ఊహించుకుని, వారినే నాగరికులుగా, వారిదే అసలైన నాగరికతగా భ్రమించి, మన పరిణతి చెందిన నాగరికతని చిన్న చూపు చూసి, మన సనాతన ధర్మం ప్రసాదించిన ధర్మబద్దమైన జీవితాన్ని విడిచి, వారిని అనుకరించడమే మన ఈ వెనుకబాటుకు కారణం.
ఒకనాడు ప్రపంచ దేశాలు సమస్తం భారత దేశానికి వలస మార్గం పట్టడం చరిత్ర చెబుతున్న నిజం. కారణం ఇది జ్ఞాన మరియు ఆర్ధిక సంపన్న దేశం కావడమే. వలస వచ్చిన సంస్కృతులు ఇక్కడి నుండి జ్ఞానాన్ని పొంది, సంపదను పొంది, అభివృద్ధి చెంది, వారి అజ్ఞానాన్ని ఇక్కడ ప్రజలపై రుద్ది, ఇప్పుడు వారే అసలైన నాగరికులుగా, భారతీయులు అనాగరికులుగా ప్రచారంచేసినంత మాత్రాన మన సంస్కృతికి వచ్చిన ఇబ్బందేమీలేదు.
కానీ మనమే ఆ ప్రచారానికి ప్రభావితమై, మనమే ప్రచారకులుగా మారడం, ముఖ్యంగా యువత ఆ మార్గాన్ని పట్టడం ఆందోళనకరం. ఈరోజున సనాతన ధర్మానికి అర్ధాన్ని వెతిక్కోవాల్సిన దుస్థిలో భారతీయ యువత నిలబడడం శోచనీయం.
:--క్రాంతి619
------------------------------------------

వ్యాసం బాగున్నది 


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 



No comments:

Post a Comment