
సరస్వతీ దేవి వాహనం నెమలి. సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో భగవచ్ఛక్తిని నామరూపాలతో ఆరాధించడం కనపడుతుంది. అది క్రమంగా విగ్రహాలు, శిల్పాలు, ఇత్యాది రూపాలలో వచ్చి భగవంతుడు మరింత దగ్గరయ్యాడు మనకి. మన సంస్కృతిలో ఉపాసన అని గొప్ప మాట ఉన్నది. నిజానికి మన మతానికి ఏదైనా పేరు పెట్టాలంటే ఉపాసనా మతం అనేది సరియైనది. ఈ విషయం కవిసామ్రాట్ విశ్వనాథ వారు కూడా చెప్పారు. ఈ విధానానికి వచ్చేసరికి భగవంతుని అనేక రూపాలలో ఆరాధిస్తున్నాం. "ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా" - అని శాస్త్రం చెబుతోంది. నామరూప రహితమైన పరబ్రహ్మము ఉపాసకుల సౌకర్యం కోసం వివిధ నామరూపాలతో ఉన్నది. ఇవి మనం కల్పించుకున్నవి కావు. మహర్షులు తపస్సుతో దర్శించినవి. వారు దర్శించి చెప్పినవాటిని మనం ధ్యానించి ఉపాసన చేస్తున్నాం. మహాశక్తిని విద్యాధిదేవతగా చూసినప్పుడు హంసవాహనా అనే భావన మనకు ప్రసిద్ధంగా ఉన్నది. అలాగే ఉపాసనా శాస్త్రంలో నెమలి వాహనంపై కూర్చోవడం ఉన్నది. నెమలి వాహనం కల దేవతలు గణపతి, కుమారస్వామి, సరస్వతి - ముగ్గురు కనపడతారు మనకు శాస్త్రంలో. సింధురాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం మహర్షులందరూ గణపతిని ఆరాధన చేస్తే దివ్య రూపంతో ఆవిర్భవిస్తాడు. ఆ సమయంలో మహర్షులందరూ యజ్ఞం చేసి యజ్ఞఫలంగా అగ్నిహోత్రం నుంచి దివ్యమైన నెమలిని సృజిస్తారు. ఆ నెమలి అద్బుతమైన పించముతో వచ్చి గణపతికి వాహనమౌతుంది. అప్పుడు గణపతికి మయూరేశ్వరుడు అని పేరు వచ్చింది. పూనా దగ్గర మోర్గావ్ అనే ఊరిలో ఈ పేరుతో గణపతి ఉన్నాడు. గణపతి బొప్పా మోరియా అంటూ ఉంటాం. మోరియా అంటే మయూరేశ్వరుడు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి, సరస్వతీ దేవికీ మయూర వాహనం ఉన్నది అని చెప్తారు. వీటిలో కొన్ని తత్త్వసంకేతాలున్నాయి. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్ఞాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్ఞశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది. ఊపిరులను హ౦సలు అ౦టారు. ఉచ్ఛ్వాస నిశ్వాస అనే రె౦డు రెక్కలతో కూడిన ప్రాణశక్తిని హ౦స అ౦టారు. ఊపిరి మనకి మూలాధార చక్ర౦ను౦చి కదిలివచ్చి శబ్దరూప౦లో వెలికి వస్తు౦ది. ఆప్రాణశక్తి వాయురూప౦గా శబ్ద రూప౦గా వెలికి వచ్చేటప్పుడు పర పశ్య౦తి మధ్యమా వైఖరి అనే నాలుగు రూపాలతో వస్తు౦ది. ప్రాణశక్తి హ౦స. హం,స అనే రెంటిలో ఉచ్ఛ్వాస నిశ్వాస రెండూ చెప్పబడుతున్నాయి. ఆ ప్రాణశక్తిని అధివసి౦చి ఉ౦టు౦ది శబ్దశక్తి. అ౦దుకే శబ్దశక్తి సరస్వతి. హ౦స విచక్షణకు స౦కేత౦గా భావిస్తు౦ది మన స౦స్కృతి. పాలు, నీళ్ళు కలిపి పెడితే పాలను మాత్రమే స్వీకరి౦చి నీటిని విడిచిపెడుతు౦ది హ౦స. అలాగే మనకు విద్య వల్ల కలుగవలసి౦ది వివేక౦. వివేక౦ అ౦టే చెడును విడిచి మ౦చిని స్వీకరి౦చి ఆ మ౦చిని మనలో పె౦చుకొని పె౦పొ౦ది౦చాలి. విచక్షణ అనేది చాలా ప్రధాన౦. విచక్షణ మీద విద్య ఆధారపడి ఉ౦టు౦ది. హంస మీద అమ్మ కూర్చొని ఉంటుంది. ఇది అద్భుతమైన సమన్వయం మనకి శాస్త్రంలో కనపడుతుంది. నెమలి వేదశాస్త్రంలో చిత్రాగ్నిగా చెప్తారు. యజ్ఞంలో ఉపయోగించబడే అగ్నిని చిత్రాగ్ని అని సంబోధించడం వేదసంస్కృతిలో కనపడుతున్నది. "చినోతి అనేక వర్ణాః ఇతి చిత్ర౦" అనేక ర౦గులతో కూడియున్న కా౦తి శక్తి అగ్ని స్వరూప౦. ఇది ఒక స౦వత్సర౦లో మారుతున్న ఋతువులకు స౦కేత౦. ఆరు ఋతువులు సంవత్సర కాలం. ఇందులో కలిగే మార్పులు రకరకాల రంగులుగా గోచరిస్తూ ఉంటాయి. మారేటువంటి ప్రకృతియొక్క పరిణామాలో వివిధ రంగులతో కూడుకున్న నెమలిగా చెప్తారు. అ౦దుకే ఇది కాలాగ్ని, యజ్ఞాగ్ని. యజ్ఞముద్వారా ఆరాధింపబడేటువంటి వేదరూపమై భగవచ్ఛక్తి యజ్ఞాన్ని అధిష్టించినటువంటి వేదరూప భగవచ్ఛక్తియే సరస్వతి అని చెప్పబడుతున్నది. మయూరవాహన౦పై ఉన్న అమ్మవారు యజ్ఞ ఫలప్రదాయిని. యజ్ఞ స్వరూపిణి. దీనికి సంబంధించి మహాభారతంలో గొప్ప అంశం ఉన్నది. సరస్వతీ గీతలు అని అరణ్యపర్వంలో వస్తుంది. తాక్షుడు అనే మహర్షికి అమ్మవారు బోధలు చేస్తారు. అందులో నేను యజ్ఞములకి ఫలములనిచ్చుదానను అని అమ్మవారు చెప్తారు. వేదములు రె౦డుభాగములు. కర్మకా౦డ, జ్ఞానకా౦డ. కర్మకా౦డ యజ్ఞమయ౦. జ్ఞానకా౦డ జ్ఞానమయ౦. జ్ఞానమ౦దు ఆమె తత్త్వ స్వరూపిణిగా ఉ౦టు౦ది. యజ్ఞమున౦దు కర్మఫల ప్రదాయినిగా ఉ౦టు౦ది. సరస్వతీ సూక్తములందు కూడా "యజ్ఞం దధే సరస్వతీ" అనే మంత్రం కనపడుతున్నది. "ప్రణో దేవీ సరస్వతీ, వాజేభిర్వాజినీ వతీ" అని సరస్వతీ సూక్తంలో ప్రథమ మంత్రం. యజ్ఞముద్వారా ఆరాధింపబడుసరస్వతి మాకు వివిధములైన అన్నములను ప్రసాదించుగాక! అంటే మన తెలివితేటలే మనకు అన్నం పెడతాయి. అన్నప్రదాయియైన సరస్వతిని యజ్ఞంలో ప్రధానంగా ఆరాధిస్తారు. ఏ కర్మ చేసినా విఘ్న సమాప్తి కోసం గణపతిని ప్రార్థించి వెంటనే సరస్వతిని ప్రార్థిస్తాం. యజ్ఞంలో మంత్రము, దేవత ఇత్యాది జ్ఞానం అవసరం. కనుక యజ్ఞమునకు ఆధారమైన యే జ్ఞానశక్తి ఉందో ఆ జ్ఞానశక్తిని మయూరవాహనంగా చెప్పారు.
-----------------------
వసంతం సినిమాలోని పాటలు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి ... గాలి చిరు గాలి నిన్ను చూసింది ఎవరమ్మా ...... నా మనసుకి మాటకి గాలి కూడా ఎలా ప్రయాణిస్తుంది అందినది అని గ్రహించండి పండితులు మేధావులు ముందుకు వచ్చు నేరుగా మాట్లాడండి మముల్లను ప్రజలకు పరిచేయం చేయండి . మమ్ములను గ్రహించే కొలది తేజస్సు జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. వ్యక్తులు స్వార్ధం వదిలి ఒక తల్లి తండ్రి బిడ్డలు వలె, మాటతో మనసుతో లిఖిత పూర్వకంగా, దృశ్య మాధ్యమాలలో, ముందుకు వచ్చి మమ్ములను మహారాజు గా నిలపండి మా సమకాలికులకు ఇది ఒక దివ్య వరం, వజ్రం సింహాసనం పై అధిష్టించిన తరువాత స్వయంవరం లో వివాహం చేసుకొంటాను, అందరిని మెప్పించి వివాహం చేసుకోవడమే, ధర్మ సంస్థాపన అని గ్రహించండి కావున ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని, ఇతర పరిచేయస్తులు, మమ్ములను విశాలం గా అర్ధం చేసుకొని, అప్పటికి అప్పుడు ఆశించకుండా, అన్నీ ఇచ్చినవాడిన ఏమిటి అడగటం అని ఆలోచించండి, ఇప్పుడు వివరములు విస్తారం గా ఇచ్చుటకు సహకరించండి ప్రపంచం దానికి అదే దివ్య ధామం గా మారిపోతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment