హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ హాస్యనటుడు ఎమ్ఎస్ నారాయణ(63) కన్నుమూశారు. జనవరి 19న భీమవరంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్ఎస్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకువచ్చారు. కొండపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండెసంబంధిత వ్యాధితో ఎమ్ఎస్ బాధపడుతున్నారు. ఎమ్ఎస్ 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో ఓ రైతు కుటుంబంలో ఎమ్ఎస్ జన్మించారు.
ఎమ్ఎస్ నారాయణగా ప్రసిద్ధి చెందిన మైలవరపు సూర్యనారాయణ హాస్యనటుడిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధిగాంచారు. 1995లో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన అంతకుముందు భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. దాదాపు 500 చిత్రాలకుపైగా నటించి నవ్వించారు. రచయిత కావాలని వచ్చి హాస్యనటుడిగా స్థిరపడిన ఎమ్ఎస్ 2011లో విడుదలైన దూకుడులో నట విశ్వరూపం ప్రదర్శించారు.
ఈ చిత్రానికి ఎమ్ఎస్కు హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఎమ్ఎస్కు భార్య కళాప్రపూర్ణ, కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు విక్రమ్ కొడుకు సినిమాతో ఇండస్ర్టీలో అడుగు పెట్టగా, కుమార్తె శశికిరణ్ ఈ మధ్యే దర్శకురాలిగా అడుగుకు ముందుకేశారు. కొడుకు విక్రమ్ భజంత్రీలు చిత్రానికి దర్శకత్వం వహించారు.
--------------------------
మా నుండి వ్యక్తం అయిన కొన్ని సీన్స్ యమ్ యస్ నారాయణ గారి మరణం మాకు ఎంతో భాధాకరం, వారి ఆత్మకు శాంతి కలగాలి
మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment