Sivkishen Ji
తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ‘‘సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీం భజేహం’’ ప్రాతఃకాలము, మధ్యాహ్నము, సాయంకాలము- గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ రూపములలో సంధ్యాదేవిని ధ్యానిస్తారని, వీటినే జన్మ, మధ్యమ, అస్తమయ జీవిత కాలములుగా చెప్తారు.
సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన సరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. అందుకే గాయత్రీ మాతను
ఓం తత్స విదుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహీ
ధియోయోనః ప్రచోదయాత్॥
అంటూ స్తుతిస్తారు. ఏ మహాతేజం ఈ లోకమంతా వ్యాపించి సర్వాధిపత్యం వహిస్తుందో, ఏ తేజ పుంజం సర్వ చరాచర జీవ జాలాన్ని నడుపుతూ కర్మఫలాలను అనుభవింపచేస్తుందో ఆమే గాయత్రి. ఆ తల్లి దివ్యతేజస్సుతో బ్రహ్మాది దేవతలు సైతం ప్రభాభాసమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత మహిమాన్వోపేతమైన గాయత్రీ మాత కరుణకు పాత్రులం కావడానికి గాయత్రీ మంత్రోపాసన ముఖ్య భూమికను పోషిస్తోంది. ఈ గాయత్రీ మంత్రం సూర్యపరంగా, శక్తిపరంగా, శివపరంగా, పరబ్రహ్మపరంగా, తేజోమయుడైన పురుషోత్తముని పరంగా ధ్యానింపబడుతోంది. …..శివ కిషె

త్రిక శక్తి
No comments:
Post a Comment