ఎన్టీఆర్ తొలిసారిగా వేంకటేశ్వరుని పాత్రలో పి.పుల్లయ్యగారి దర్శక నిర్మాణంలో రూపొందిన 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం' చిత్రంలో నటించారు. సంక్త్రాంతి కానుకగా 9 జనవరి 1960 న విడుదలై అఖండ విజయం సాధించింది ఈ చిత్రం. ఎంతగా అంటే ఎన్టీఆర్ ను ప్రజలు దేవదేవుడే అనుకునేంతగా! ఆ రోజుల్లో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద ఎన్టీఆర్ వేంకటేశునిగా కనిపించే కటౌట్లను పెట్టారు. సినిమా చూసేందుకు వచ్చిన జనం ఆ కటౌట్లకు భక్తితో పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. నిర్మాతలు హుండీలు కూడా ఏర్పాటుచేయడంతో కానుకలు కూడా సమర్పించుకున్నారు. ఆ రోజుల్లో వేల రూపాయల కానుకలు పోగయ్యాయి. ఆ మొత్తాలను నిర్మాతలైన పుల్లయ్య దంపతులు తిరుమల - తిరుపతి దేవస్థానం వారికి అందచేశారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిన భక్తులు అటునుంచి అటే చెన్నై వెళ్లి ఎన్టీఆర్ ను దర్శించుకుని చేతులెత్తి మొక్కేవారు. అంతగా సంచలనం సృష్టించింది వేంకటేశ్వరునిగా ఎన్టీఆర్ నటన. ఈ చిత్రం అందించిన స్ఫూర్తితోనే లవకుశ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది.
తిరిగి 1979లో ఎన్టీఆర్ దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టి ''శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం'' అనే చిత్రాన్ని తీశారు. అందులోదే ఈ చిత్రం.
తిరిగి 1979లో ఎన్టీఆర్ దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టి ''శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం'' అనే చిత్రాన్ని తీశారు. అందులోదే ఈ చిత్రం.
No comments:
Post a Comment