ఇకపై రూ.3 లక్షలకు మించితే క్యాష్ లావాదేవీలు కుదరవు
న్యూఢిల్లీ: నల్ల ధనాం కట్టడిపై కేంద్రం నియమించిన సిట్ పలు ప్రతిపాదనలు చేసింది. ఇందులో అతి ముఖ్యమైంది షాక్ కలిగించేదే. మూడు లక్షలకు మించితే నగదు లావాదేవీలు కుదరబోవని తేల్చింది. అంటే 3 లక్షలకు మించి నగదు లావాదేవీ చేయాలంటే ఇకపై కుదరదు. ఒకవేళ మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీ జరపాలంటే అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. అంతేకాదు. 15 లక్షలకు మించి నగదు ఉంచుకోవడానికి కూడా వీల్లేదు. 15 లక్షల నగదు మించి ఉంచుకోవాలనుకుంటే అనుమతి తప్పనిసరి. సిట్ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది.
No comments:
Post a Comment