త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం
Updated : 3/14/2015 2:03:20 PM
Views : 379
హైదరాబాద్: త్వరలోనే రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ను జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనమండలిలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. కమలనాథన్ కమిటీ నివేదిక పూర్తయిన తర్వాత ఉద్యోగాల భర్తీకి చర్యలు. ఉద్యోగుల విభజన అనంతరం సత్వర నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకుంటున్నం. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో 3726 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చాం. అదేవిధంగా 600 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ. ఉర్తూ మీడియం పాఠశాలల్లో దాదాపు 1500 మంది టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్పై కూడా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఉద్యోగాల కోసం డీఎస్సీ ఉండదు. పిల్లల చదువుల కోసం డీఎస్సీ ఉంటది. కేజీ టూ పీజీ ఉచిత విద్యను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యా వ్యవస్థలో మార్పుల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ. వయోపరిమితిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులకు వయసు సడలింపును ఇచ్చి రిక్రూట్మెంట్లలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు.
No comments:
Post a Comment