సమన్వయ దృష్టి
కాలుని దున్న, నందినయి గంటలు దున్నక మంటి నా, మహా
కాలుని నంది, దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా
హాలికు లెన్నడుం దెగని యౌరుల చేలును, జౌకుమళ్లునుం
గా నలి నేరు సాఁగి రిలఁ గల్గు పసిం గొని పేద మున్నుగన్..
కాలుని నంది, దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా
హాలికు లెన్నడుం దెగని యౌరుల చేలును, జౌకుమళ్లునుం
గా నలి నేరు సాఁగి రిలఁ గల్గు పసిం గొని పేద మున్నుగన్..
శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద
అరక దున్నడానికి సిద్ధం చేసిన నాగలిని “ ఏరు “ అంటారు. వానలుపడి నేల పదును కాగానే రైతులు తమ వ్యవసాయం పనులు మొదలుపెడతారు. సాధారణంగా ఏరువాక పూర్ణిమ లేదా జ్యేష్ట పూర్ణిమనాడు రైతులంతా సంతోషంగా దుక్కి దున్నడానికి సిద్ధమవుతారు. అదే ఏరువాక సాగడం అంటారు. పొలం దున్నడానికి బలిష్టమైన దున్నపోతులు, ఎద్దులు కావాలి. ఎడ్లు మెఱకచేలల్లో గడ్డి దుబ్బులు సులువుగా దున్నగలవు. దున్నలు బురద మళ్లల్లో తేలిగ్గా దున్నగలవు. రొంపి దుక్కి ఎడ్లకు కష్టం. మెఱక దుక్కి దున్నలకు కష్టం. అందుకే రెండింటినీ ఉపయోగిస్తారు కాబట్టి ఎన్ని ఉన్నా సరిపోవు. అది చూసిన యముడి దున్నపోతు - నేను ఎద్దునై ఉంటే నన్నుగూడా గడ్డి దుబ్బులు దున్నించేవారు కదా, శివుడి నంది - నేను దున్నపోతునై ఉంటే నన్ను కూడా ఆ బురదకయ్యలు దుక్కికి లాక్కుపోయేవాళ్లు... ఆ కష్టం తప్పిందని సంతోషించాయంట.. ఈ బురదకయ్యల్లో దున్నేటప్పుడు అందులో బంగారు రంగులో ఉండే చిన్న చిన్న పాములు రైతుల కాళ్లకు చుట్టున్నాయంట. విజయవంతంగా దుక్కి దున్నుతున్న రైతుల కాళ్లకు గండపెండేరాలు తొడిగినట్టుగా కనిపిస్తున్నాయంటున్నాడు రాయలు.. తానొక చక్రవర్తియై ఉండి కూడా వ్యవసాయం గురించి, ఏరువాక, మెట్ట, మాగాణి మొదలైన విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అవన్నీ ఒక్క పద్యంలోనే పొందుపరిచాడు శ్రీకృష్ణ దేవరాయలు.
రాయలవారి ఆముక్తమాల్యదలో ఋతువర్ణనలో ప్రకృతి, సమాజ పరిశీలన స్పష్టంగా కనిపిస్తుంది. ఏరువాక సమయంలో ఎడ్లతో చేసే సేద్యం, దున్నపోతులతో చేసే సేద్యం, దానికి యముడి దున్నపోతును, శివుడి నందిని జత కలపడం , అవి భయపడినట్టు ఊహించి చెప్పడంవల్ల ఆతని పాండిత్యం, లోకజ్ఞానం తెలియవస్తోంది.
No comments:
Post a Comment