|
దోమలపెంట (మహబూబ్నగర్), మే 15: తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని మహబూబ్నగర్ జిల్లా ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమకొండ టర్నింగ్ వద్ద శుక్రవారం ఉదయం వైసీపీ నేత ఏ.వసంతరావు దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావు.. సుండిపెంట నుంచి కుటుంబ సభ్యులను కలవడానికి హైదరాబాద్కు బయలు దేరారు. ఈగల పెంట ప్రాంతానికి రాగానే.. గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకొని ఇనుపరాడ్లతో దాడి చేశారు. తలపై బలమైన గాయం కావడంతో వసంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య శైలజ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఉన్న వసంతరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. దుండగులు తమ వాహనాన్ని (ఏపీ28డీఎన్5858) శ్రీశైలం జలాశయం దిగువన, నదీ తీరం వెంట సాగర్ వైపు 14 కిలోమీటర్ల దూరంలో వదిలి పరారయ్యారు.
|
No comments:
Post a Comment