ఇంటికో ఐదు లక్షలు!
Sakshi | Updated: May 12, 2015

సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పేదల కోసం రెండు పడక గదుల గృహాల నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. తొలిదశ కింద ఒక్కో మున్సిపాలిటీలో 500 నుంచి 1,000 ఇళ్లను నిర్మిస్తామని.. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఖర్చు చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలపై రూపాయి భారం పడకుండానే ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. హైదరాబాద్లోని ఐడీహెచ్ కాల నీని ఆదర్శంగా తీసుకుని ఈ నిర్మాణాలు జరపాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో సీఎం సమావేశమై.. నగర, పట్టణ గృహ నిర్మాణంపై పలు ఆదేశాలు జారీచేశారు. మైవాన్ టెక్నాలజీతో కట్టే నిర్మాణాలను, ఐడీహెచ్ కాలనీని మంగళవారం కలెక్టర్లు సందర్శించాలని సూచిం చారు. ఇందిరమ్మ, ఐఏవై పథకాల కింద ఇళ్లు మంజూరైన వారిలో నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేం దుకు విచారణ జరపాలని కలెక్టర్లకు సూచించారు
సోమవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో సీఎం సమావేశమై.. నగర, పట్టణ గృహ నిర్మాణంపై పలు ఆదేశాలు జారీచేశారు. మైవాన్ టెక్నాలజీతో కట్టే నిర్మాణాలను, ఐడీహెచ్ కాలనీని మంగళవారం కలెక్టర్లు సందర్శించాలని సూచిం చారు. ఇందిరమ్మ, ఐఏవై పథకాల కింద ఇళ్లు మంజూరైన వారిలో నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేం దుకు విచారణ జరపాలని కలెక్టర్లకు సూచించారు
గ్రామీణ ప్రాంతంలో 125 గజాలు, పట్టణ ప్రాంతాల్లో 75 నుంచి 100 గజాల వరకు స్థలాలను ఇంటి నిర్మాణానికి కేటాయించాలి.
ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. తర్వాత తరానికీ ఉపయోపడేలా కచ్చితంగా పిల్లర్లతో నిర్మాణం జరపాలి.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లు, నగర పంచాయతీల్లో జీ+1, మున్సిపాలిటీలు, ఆపైస్థాయి పట్టణాల్లో జీ+2 పద్ధతిలో చేపట్టాలి.
ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. తర్వాత తరానికీ ఉపయోపడేలా కచ్చితంగా పిల్లర్లతో నిర్మాణం జరపాలి.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లు, నగర పంచాయతీల్లో జీ+1, మున్సిపాలిటీలు, ఆపైస్థాయి పట్టణాల్లో జీ+2 పద్ధతిలో చేపట్టాలి.





No comments:
Post a Comment