UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 6 July 2016

Mighty blessings from King and Queen.......to Shriman Mangalampalli Balamurali Krishna gaaru ..... Yours His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


నేడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారికి నమఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం

బాల్యంనుండీ కర్ణాటక సంగీతాన్ని వింటున్నప్పుడు అందరు భారతీయుల వలెనె నేను కూడా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గీతాలలో భావరాగలయాది సౌఖ్యాన్ని అనుభవించేవాడిని. ఆ మహానుభావుని ఒకసారి చూడాలి అనుకున్న వాడిని.
చెన్నైలో ఉన్న రోజుల్లో 1998నుండి ప్రవచనాలు కొన్ని జరిగాయి. ఆ సమయంలోనే “నీలకంఠేశ్వరా” శతక గ్రంథాన్ని వ్రాసుకున్నాను. ఆత్మీయులు శ్రీ పప్పు వేణుగోపాలరావుగారు ఆ పద్యాలు విని అభినందించి ఆ గ్రంథావిష్కరణకు శ్రీ బాలమురళీకృష్ణగారు వస్తే బాగుంటుందని అన్నారు.
వారు ముందుగా ఆ గ్రంథాన్ని పరిశీలిస్తే బాగుంటుందన్నాను. వెంటనే వారితో మాట్లాడి నన్ను వారివద్దకు పంపారు. ఒకరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏకాంతంగా శ్రీ బాలమురళీకృష్ణగారు ఆ పద్యాలు వినడానికి అంగీకరించారు. ఆశ్చర్యపోయాను! ఆ మహా ప్రతిభాశాలితో సన్నిహితంగా మాట్లాడే చక్కని అవకాశం! ఎంతో ఆదరంగా, ఆ ప్రథమ పరిచయంలోనే ఆహ్వానించి, ప్రతి పద్యాన్ని ఆస్వాదిస్తూ విని ఆనందించారు. సంతోషంగా పుస్తకావిష్కరణకు అంగీకరించారు.
ఆ సభలో వారి ప్రసంగం ఒక అద్భుతం. పాటామాటా రెండూ మధుర గాంభీర్య స్వభావంతో ఉండడం వారి ప్రత్యేకత. సంగీతం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా శ్రీబాలమురళీకృష్ణగారి విశిష్టత స్పష్టంగా తెలుస్తుంది. కేవలం గొప్ప గాయకులు మాత్రమే కాదు – సంగీత విద్యలో కూలంకషపాండిత్యం కలవారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతనిధి.
వాద్య సంగీత, గాత్ర సంగీతాలలో బాల్యంనుండే కౌశలం కలిగిన ఒకానొక అరుదైన పురాసుకృత నాద ప్రతిభ వారిది. ఎన్ని గొప్ప పురస్కారాలు వారికి ఇచ్చినా వారి ప్రతిభాపాటవాల ముందు, సంగీత ప్రపంచానికి వారిచ్చిన పరీదానం ముందు చిన్నవే. నూతన రాగాలను సృష్టించడమే కాక, ‘వాగ్గేయకారులు’గా కూడా అద్వితీయ ప్రతిభాశాలి. ఇన్ని విభిన్నకోణాల, వైవిధ్యభరితమైన సమగ్ర నాద విజ్ఞాన కోవిదులు తెలుగువారు కావడం ప్రత్యేకించి తెలుగుజాతికి గర్వకారణం.
అంతకీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉన్నప్పటికీ ఇతరులను ఆదరించి, ఆప్యాయంగా పలకరించడంలో ఆయన ఎంతో నిరవధికప్రేమను చూపిస్తారు. ‘శివపడం’ కచేరీలకు వచ్చి విని ఆనందించడమే కాక, చెన్నైలో నా ప్రవచనాలకు విశిష్ట అతిథిగా వచ్చి ఆశీర్వదించిన ఘట్టాలు మధురమైనవి.
“నేను పాట కచేరీలు చేసినట్లు, వీరు మాట కచేరీలు చేస్తూ వర్ధిల్లాలి” – అని ఆ రోజుల్లో వారన్నమాటలు నేటికీ జ్ఞప్తికొస్తుంటాయి.
వారికి 75ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చెన్నైలో శర్వాణీ సంగీతసభ వారు ‘అమృతోత్సవ సభ’ను అద్భుతంగా నిర్వహించారు. ఆ సమహంలో నేను హైదరాబాద్ లో స్థిరపడ్డాను. కానీ వారు ‘షణ్ముఖశర్మ సభకు రావాలి” అని సంస్థ వారిని కోరారు. నాకు సభవారు ఈ మాట తెలియజేయగానే నేను ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ అనుభవించాను. వెంటనే సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి సమక్షంలో ఎందఱో ప్రముఖుల మధ్య ఆ మహనీయుని విశిష్టతపై ప్రసంగించగలిగాను.
నేటికీ 84 ఏళ్ల వయస్సులో వారు అదే ప్రతిభా చైతన్యంతో స్ఫూర్తిని కలిగిస్తున్నారు.
వారు అరుదైన ప్రతిభకు నమస్కరించవలసిందే.

No comments:

Post a Comment